అమరావతి కోసం రెండో విడత భూసమీకరణకు ఏపీ సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో 4 గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో 3 గ్రామాల పరిధిలో మొత్తం 16,666.57 ఎకరాల పట్టా & అసైన్డ్ భూమి సమీకరణ బాధ్యతను సీఆర్డీఏ కమిషనర్కు అప్పగించింది. ఈ 7 గ్రామాల్లో 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వీటిని కూడా కలుపుకుంటే 20,494 ఎకరాల భూమి అందుబాటులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది.
short by
srikrishna /
04:11 pm on
02 Dec