For the best experience use Mini app app on your smartphone
భారత్‌లో తొలి మసీదును కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో నిర్మించారు. దీని పేరు చేరమాన్ జుమా మసీదు. ఈ మసీదును క్రీ.శ 629లో మాలిక్ ఇబ్న్ దీనార్ నిర్మించారని చెబుతుంటారు. దీని డిజైన్ హిందూ ఆలయాన్ని పోలి ఉంటుంది. భారత్‌లోని మొట్టమొదటి చర్చిని కూడా త్రిస్సూర్ జిల్లాలోనే స్థాపించారు. యేసుక్రీస్తు 12 మంది అపొస్తలులలో ఒకరైన సెయింట్ థామస్ దీనిని నిర్మించారట. అందుకే దీనికి సెయింట్ థామస్ చర్చి అని పేరు వచ్చింది.
short by Devender Dapa / 05:40 pm on 02 Dec
For the best experience use inshorts app on your smartphone