For the best experience use Mini app app on your smartphone
శైలం మహాక్షేత్రంలో రూ.500 స్పర్శ దర్శనం, రూ.300 అతి శీఘ్ర దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. స్పర్శ దర్శనం టికెట్‌పై 100 గ్రాముల లడ్డూలు రెండు, రూ.300 దర్శనం టికెట్‌కు ఒక లడ్డూను పంపిణీ చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీగోకులం ఆధునికీకరణకు భూమి పూజ చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి ఛైర్మన్ ఛాంబర్‌ను ప్రారంభించారు.
short by Devender Dapa / 10:19 am on 02 Dec
For the best experience use inshorts app on your smartphone