అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను నవంబర్ 19న కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రం కూడా అదేరోజు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది. కేంద్రం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడతలో 46,62,904 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
short by
srikrishna /
02:17 pm on
17 Nov