For the best experience use Mini app app on your smartphone
మూత్రంలో ఉన్న నీరు, యూరియా, లవణాల ప్రభావంతో దాని రంగు మారుతుంది. వివిధ రంగుల్లోని మూత్రం పలు అనారోగ్యాలకు సంకేతం కావొచ్చని అమెరికన్‌ యూరలాజికల్‌ అసోసియేషన్‌ చెబుతుంది. ఎరుపు రంగులోని మూత్రం కిడ్నీ సమస్యలను, ముదురు పసుపు, నారింజ రంగు డీహైడ్రేషన్‌ను, దుర్వాసనతో కూడిన పాల రంగు మూత్ర నాళ ఇన్ఫెక్షన్‌ను, కాఫీ, నలుపు రంగు మూత్రం కాలేయ రుగ్మతలను, ఆకుపచ్చ రంగు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ను సూచిస్తాయి.
short by Sharath Behara / 12:19 pm on 27 Jul
నటుడు జాన్‌ విజయ్‌ తమను వేధించాడని ఆరోపిస్తూ మహిళలు తనకు పంపిన కొన్ని ఫిర్యాదులను గాయని చిన్మయి శ్రీపాద షేర్‌ చేశారు. “ఎవరితోనైనా ‘యెస్‌’ అని చెప్పించే హక్కు తన సెలెబ్రిటీ స్టేటస్‌ తనకు కల్పిస్తుందని అతడు భావిస్తాడు,” అని ఒక ఫిర్యాదులో కనిపించింది. 'నా నడుము పట్టుకోబోయాడు' అని మరో ఫిర్యాదులో ఉంది. 2018 #MeToo ఉద్యమం సమయంలోనూ అనేకమంది మహిళలు జాన్‌ విజయ్‌పై వేధింపుల ఆరోపణలు చేశారు.
short by Sharath Behara / 09:43 am on 27 Jul
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో జరిగిన పరేడ్‌ ఆఫ్‌ నేషన్స్‌లో భాగంగా రెండుసార్లు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న షట్లర్ పీవీ సింధు, వెటరన్ టీటీ ప్లేయర్ శరత్ కమల్ భారత జెండాను మోశారు. పరేడ్‌లో భారత బృందంలో భాగంగా మొత్తం 78 మంది అథ్లెట్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రారంభ వేడుక సెయిన్ నదిపై జరిగింది. ప్రధాన స్టేడియానికి వెలుపల ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి.
short by Sharath Behara / 12:34 am on 27 Jul
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ పరేడ్‌లో 12 విభాగాల నుంచి మొత్తం 78 మంది అథ్లెట్లు, అధికారులు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారని ఐఓఏ వెల్లడించింది. ఇందులో భారత పతాకధారులుగా పీవీ సింధు, శరత్‌ కమల్ వ్యవహరించనున్నారు. టెన్నిస్ క్రీడాకారులు రోహన్ బోపన్న, సుమిత్ నాగల్, జూడో క్రీడాకారిణి తులికా మాన్, ఆర్చర్లు దీపికా కుమారి, తరుణ్‌దీప్ రాయ్, స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారు.
short by Srinu / 08:04 pm on 26 Jul
పారిస్ ఒలింపిక్స్‌లో జులై 27న మధ్యాహ్నం 12.30 గంటలకు (IST) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్‌లో షూటర్లు ఎలవెనిల్ వలరివన్-సందీప్ సింగ్, రమిత-అర్జున్ బాబుటా పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు టెన్నిస్ క్రీడాకారులు శ్రీరామ్ బాలాజీ, రోహన్ బోపన్నలు తమ పురుషుల డబుల్స్ మొదటి రౌండ్ మ్యాచ్ ఆడనున్నారు. అలాగే రాత్రి 9 గంటలకు జరిగే పురుషుల హాకీ పూల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.
short by Srinu / 09:48 pm on 26 Jul
అత్యుత్తమ భారత కెప్టెన్ ఎవరని టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఓ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, "నాకు ఇష్టమైన కెప్టెన్ నేనే. ఎందుకంటే నేను కొన్ని మ్యాచ్‌లకు నాయకత్వం వహించా’,, అని ఆయన సమాధానం చెప్పారు. ''టీమిండియాకు చాలా మంది గొప్ప కెప్టెన్సీ చేశారు. కానీ, నేను నా పేరునే ఎంచుకుంటా,’’ అని ఆయన చెప్పుకొచ్చారు. బుమ్రా నాయకత్వం వహించిన మూడు అంతర్జాతీయ మ్యాచుల్లో భారత్ రెండు విజయాలు సాధించింది.
short by Srinu / 11:37 am on 27 Jul
పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకల కోసం నూతన దుస్తులు ధరించి సిద్ధమైన భారతీయ అథ్లెట్లు, అధికారుల చిత్రాలను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) విడుదల చేసింది. ఇందులో భారతీయ బృందం సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించారు. అయితే స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగని తొలి ఒలింపిక్స్ ఇవే. ఈ సారి అథ్లెట్ల పరేడ్ సెయిన్ నదిపై నిర్వహించనున్నారు.
short by Srinu / 08:57 pm on 26 Jul
ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయనేది sancharsaathi.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో ‘know your mobile connections’ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. అనంతరం మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్‌, ఓటీపీని ఎంటర్‌ చేసి లాగిన్‌ అయితే, మీరు సిమ్‌ తీసుకున్నప్పుడు సమర్పించిన ధ్రువపత్రం మీద ఎన్ని నంబర్లున్నాయనేది కనిపిస్తుంది. చట్ట ప్రకారం 9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉండకూడదు.
short by Sharath Behara / 10:10 am on 27 Jul
భారత్‌లో రాబందుల సంఖ్యలో భారీ క్షీణత 2000- 2005 మధ్యకాలంలో 5 లక్షల మంది మనుషుల మరణాలకు దారితీసిందని ఓ అధ్యయనం తెలిపింది. ప్రకృతిలో పారిశుద్ధ్య సేవలందించే జీవులుగా రాబందులకు పేరుంది. చనిపోయిన జంతువులను తినడం ద్వారా వాటి శరీరాల్లోని బ్యాక్టీరియాలు, వ్యాధికారకాలు వ్యాపించకుండా రాబందులు కీలక పాత్ర పోషిస్తాయి. రాబందులు బాగా తగ్గిపోవడంతో వ్యాధుల వ్యాప్తి పెరిగి ఎక్కువ మంది మరణిస్తున్నారు.
short by Sri Krishna / 11:45 am on 27 Jul
భారత టెలికాం చట్టం ప్రకారం ఒక వ్యక్తి పేరు మీద గరిష్ఠంగా తొమ్మిది కంటే ఎక్కువ సిమ్‌ కార్డులు ఉండకూడదు. అయితే ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌ ప్రజలు మాత్రం తమ పేరు మీద ఆరు కంటే ఎక్కువ సిమ్‌ కార్డులను కలిగి ఉండకూడదు. పరిమితికి మించి సిమ్ కార్డులు ఉంటే మొదటిసారి రూ.50వేలు, ఆ తర్వాత కూడా వాటిని డీయాక్టివేట్‌ చేయకపోతే రూ.2లక్షల జరిమానా విధిస్తారు.
short by Sharath Behara / 09:29 am on 27 Jul
పీఎం నరేంద్ర మోదీ ఆగస్టులో ఉక్రెయిన్‌లో పర్యటించొచ్చని నివేదికలు తెలిపాయి. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలయ్యాక మోదీ ఆ దేశానికి వెళుతుండటం ఇదే తొలిసారి. జులైలో ఆయన రష్యాలో పర్యటించి, ‘’యుద్ధభూమిలో దేనికీ పరిష్కారాలు లభించవు,’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సూచించారు. కాగా, జూన్‌లో ఇటలీలో జరిగిన జీ7 సదస్సులో పీఎం మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు.
short by Sri Krishna / 09:51 am on 27 Jul
నీట్-యూజీ 2024 సవరించిన పరీక్ష ఫలితాల్లో మొత్తం 17 మంది అభ్యర్థులు టాప్‌ ర్యాంకును దక్కించుకున్నారు. ఈ రివైజ్డ్‌ ఫలితాల తర్వాత టాప్ ర్యాంకర్ల సంఖ్య 61 నుంచి 17కి పడిపోయింది. జూన్ 4న విడుదలైన నీట్‌ ఫలితాల్లో 67 మంది అభ్యర్థులు 720 మార్కులు సాధించారు. అయితే సమయం కోల్పోయిన కారణంగా మొదట్లో ఇచ్చిన గ్రేస్ మార్కులను ఎన్టీఏ తొలగించాక టాపర్ల సంఖ్య 61కి తగ్గింది.
short by Srinu / 10:59 pm on 26 Jul
జమ్మూకశ్మీర్‌ కుప్వారాలోని మచిల్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మేజర్ ర్యాంక్ అధికారితో సహా ఐదుగురు భారత సైనికులు గాయపడ్డారని రక్షణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. గాయపడిన సైనికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. అనుమానిత ఉగ్రవాదుల కదలికలను బలగాలు గుర్తించి, ప్రశ్నించే లోపు వారు కాల్పులు జరిపారని సమాచారం. ఇంతకుముందు ఉగ్రవాదుల కాల్పుల కారణంగా ముగ్గురు సైనికులు గాయపడ్డారు.
short by Srinu / 12:06 pm on 27 Jul
పారిస్ 2024 ఒలింపిక్స్ ఆరంభ సంబరం సెన్ నదిపై జరిగింది. అథ్లెట్లు ఫ్రెంచ్ రాజధానిలోని చరిత్రాత్మక స్మారక చిహ్నాలతో పరేడ్ చేపట్టారు. ఒలింపిక్స్ చరిత్రలో ప్రధాన స్టేడియంలో కాకుండా వేరే ప్రాంతంలో ప్రారంభ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో లేడీ గాగా, సెలిన్ డియోన్, అయా నకమురా సహా పలువురు కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
short by Sri Krishna / 09:34 am on 27 Jul
భారత్‌లోని ఐదు అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 88,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్‌ చేసుకోనున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 40,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించగా, ఇన్ఫోసిస్‌, HCLటెక్‌, విప్రోలు వరుసగా 15,000-20,000, 10,000, 10,000-12,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోనున్నట్లు తెలిపాయి. కొన్ని IT కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో తక్కువ మంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి.
short by Devender Dapa / 07:33 pm on 26 Jul
22 ఏళ్ల యువతిపై తిరుపతి జిల్లాలో అత్యాచారం జరిగింది. పోలీసుల ప్రకారం, LLB చదువుతున్న బాధితురాలు న్యాయ విద్యార్థులైన ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డి దంపతుల ఇంటికి వెళ్లేది. వారు ఆమెకు గంజాయి అలవాటు చేశారు. యువతి మైకంలో ఉన్నప్పుడు కిషో‌ర్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడగా, అతని భార్య వీడియో తీసింది. తర్వాత వీడియోని చూపి యువతిని డబ్బు డిమాండ్‌ చేశారు. ఆ జంటను పోలీసులు అరెస్టు చేశారు.
short by Sri Krishna / 07:55 am on 27 Jul
నెల్లూరు జిల్లా బీవీ నగర్‌లోని నగరపాలక సంస్థ పాఠశాలలో స్లాబ్‌ కూలి 9వ తరగతి చదివే గురు మహేంద్ర అనే విద్యార్థి చనిపోయాడు. పాఠశాలలో నిర్మిస్తున్న నూతన భవనం కింద ఆడుకుంటుండగా ఒక్కసారిగా స్లాబ్‌ విరిగి పైన పడటంతో గురు మహేంద్ర మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై మంత్రి నారాయణ ఆదేశాలతో జిల్లా విద్యా శాఖ అధికారి రామారావు విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారిస్తామని చెప్పారు.
short by Bikshapathi Macherla / 11:20 pm on 26 Jul
సౌదీలో ఉన్న మరో వ్యక్తిని మంత్రి నారా లోకేశ్‌ స్వదేశానికి తీసుకువచ్చారు. తాను ఏజెంట్ల చేతిలో మోసపోయి, సౌదీ అరేబీయాలో చిక్కుకుపోయానని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఇసుకపూడికి చెందిన వీరేంద్ర ట్విట్టర్‌లో వీడియో పోస్ట్‌ చేసి మంత్రి లోకేశ్‌కు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి NRI TDP ప్రతినిధులకు చెప్పగా వారు వీరేంద్రను రక్షించి స్వదేశానికి పంపారు. ఇటీవల శివ అనే వ్యక్తిని ఇదే తరహాలో లోకేశ్‌ కాపాడారు.
short by Bikshapathi Macherla / 09:19 pm on 26 Jul
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరంలో అంజలి కార్తీక అనే 8 ఏళ్ల బాలిక ఇంటి వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందింది. చేతులు తడిగా ఉన్న సమయంలో సెల్‌ఫోన్‌కి ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురై ఆ చిన్నారి శుక్రవారం మరణించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అంజలి స్థానిక ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
short by Sri Krishna / 12:23 pm on 27 Jul
తాము దిల్లీలో చేసిన ధర్నాకి కాంగ్రెస్‌ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్న మాజీ సీఎం జగన్‌ వ్యాఖ్యలపై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. ‘’మణిపుర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా?. మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది,’’ అని ఆమె చెప్పారు.
short by Sri Krishna / 10:48 am on 27 Jul
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌ 1 నాటికి జాబితా రూపొందించేలా షెడ్యూల్‌ విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు సెప్టెంబర్‌ 30న ఓటర్ల జాబితాకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.
short by Bikshapathi Macherla / 12:05 am on 27 Jul
బీఆర్‌ఎస్‌ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. చేనేతలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి, బతుకమ్మ చీరలను సూరత్‌ నుంచి కిలోల లెక్కన తీసుకొచ్చి పంచారు. మీరిచ్చిన చీరలు మహిళలే తగలబెట్టారు. కొందరు పొలాల వద్ద పిట్టలను బెదిరించడానికి వాడుతున్నారు. మీ అవినీతిపై విచారణకు సిద్ధంగా ఉన్నారా,’’ అని బీఆర్‌ఎస్‌ను రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.
short by Srinu / 12:38 pm on 27 Jul
మేడిగడ్డ నుంచి నీటి పంపింగ్ ఉండబోదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం నుంచి నీటి పంపింగ్‌ను ప్రారంభించాలన్న బీఆర్‌ఎస్‌ డిమాండ్‌కు జవాబుగా ప్రాజెక్ట్‌ స్థితిపై ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రూ.38,500కోట్లుగా ఉన్న కాళేశ్వరం వ్యయం రూ.1.47లక్షల కోట్లకు పెరిగిందన్నారు. నాసిరకంగా నిర్మించడంతోనే మేడిగడ్డలోని 6 పిల్లర్లు కుంగాయని NDSA నివేదిక ఇచ్చిందని చెప్పారు.
short by Bikshapathi Macherla / 09:51 pm on 26 Jul
తెలంగాణలో వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల కార్యాచరణపై సచివాలయంలో పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు మొదటి వారంలోగా కొత్త ఓటరు జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
short by Bikshapathi Macherla / 08:37 pm on 26 Jul
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మొత్తం రూ.9,74,556 కోట్ల అప్పులు, చెల్లింపుల భారం ఉందని ఇప్పటివరకు తేలింది. సీఎం చంద్రబాబు శుక్రవారం వెలువరించిన శ్వేతపత్రంలో ఈ లెక్కలను పేర్కొన్నారు. 2019 మార్చి 31 నాటికి రాష్ట్ర మొత్తం అప్పు రూ.3,75,295 కోట్లుగా ఉంది. ఇంకా పెండింగు బిల్లులు వెలికితీస్తున్నామని, వివరాలన్నీ తెలిస్తే రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు.
short by Sri Krishna / 08:48 am on 27 Jul
Load More
For the best experience use inshorts app on your smartphone