For the best experience use Mini app app on your smartphone
అకస్మాత్తుగా తీపి పదార్థాలు తినాలనే కోరిక, శరీరంలో ఏర్పడిన ప్రొటీన్ లోపానికి సంకేతం కావొచ్చని హార్వర్డ్‌లో శిక్షణ పొందిన డాక్టర్ సౌరభ్ సేథీ తెలిపారు. "ప్రొటీన్ లోపంతో కాళ్లు, పాదాలు & చేతుల్లో వాపు, ఎముకలు & కండరాలు బలహీనంగా మారడం, బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గడం, జుట్టు, గోర్లు & చర్మ సమస్యలు, బరువు పెరగడం, తరచుగా జలుబు వంటి ఇమ్యూనిటీ సమస్యలు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి," అని ఆయన పేర్కొన్నారు.
short by Rajkumar Deshmukh / 07:18 pm on 22 Oct
శీతాకాలంలో పురుషులు/స్త్రీల మూత్రంలో కాల్షియం స్థాయి ఎక్కువగా ఉంటుందని, ఈ స్థితి రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధనలో వివరించారు. శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల మూత్రం పరిమాణం తగ్గడమే కాక గాఢత పెరిగి, అనవసరమైన మూలకాలు & ఖనిజాలు పేరుకుపోతాయని నెఫ్రాలజిస్ట్ డాక్టర్ PS.వలీ తెలిపారు. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుందని పేర్కొన్నారు.
short by Rajkumar Deshmukh / 04:20 pm on 22 Oct
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగమైన 9 క్రీడలను రానున్న ఎడిషన్ CWG-2026 నుంచి తొలగించారు. ఇందులో క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, షూటింగ్, నెట్‌బాల్ & రోడ్ రేసింగ్ ఉన్నాయి. జూలై 23-ఆగస్ట్ 2 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగనున్న CWG-2026 ఈవెంట్‌లో ఖర్చులను తగ్గించుకోవడానికి 10 క్రీడలను మాత్రమే నిర్వహించనున్నారు.
short by Rajkumar Deshmukh / 05:37 pm on 22 Oct
కొత్తగా ప్రవేశపెట్టిన కారులోపల విశాలమైన స్థలం ఉందని చూపించేందుకు చైనాకు చెందిన వాహన తయారీ సంస్థ జీక్ర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాచెంగ్‌ అందులోనే వంట వండుకుని తిన్నారు. ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. “ఈ వింత ఆలోచన ఎవరికి వచ్చింది. మీరు మీ సొంత కారులో వండుకుని తింటారా?” అని ఒకరు, “కారు ఇంధనం లీక్ అయితే మాత్రం పరిస్థితి భయంకరంగా ఉంటుంది,” అని మరొక యూజర్‌ కామెంట్‌ చేశారు.
short by Devender Dapa / 07:21 pm on 22 Oct
16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యాలోని కజాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ‘’మన సంబంధాలు ఎంతో బలంగా ఉన్నందున అనువాదం అవసరం లేకుండానే మీరు నా మాటలను అర్థం చేసుకుంటారని అనుకున్నాను,’’ అని పుతిన్ ఈ భేటీలో అన్నారు. పుతిన్‌ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ నవ్వుతూ కనిపించారు.
short by Sri Krishna / 06:38 pm on 22 Oct
హర్యానా రోహ్‌తక్‌లోని PGIMS వైద్యులు 6 రోజులుగా ఒక వ్యక్తి గుండెలో ఇరుక్కుపోయిన కత్తిని 4 గంటల పాటు శస్త్రచికిత్స చేసి తొలగించారు. సదరు వ్యక్తి ఘర్షణ సమయంలో కత్తి పోట్లకు గురయ్యాడు. హ్యాండిల్ విరిగిపోవడంతో బ్లేడ్ గుండెలో ఇరుక్కుపోయిందని సమాచారం. పదునైన వస్తువు గుండెలో ఉండిపోవడం అనే ఈ తరహా కేసును తాము తొలిసారి చూశామని ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ & సీనియర్ కార్డియాక్ సర్జన్ SS.లోహ్చాబ్ చెప్పారు.
short by Rajkumar Deshmukh / 08:45 pm on 22 Oct
బెంగళూరులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో మూడు మృత దేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. సుమారు మరో 20 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. భవనం కూలిపోతున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది. 14 మందిని రక్షించామని, మరికొందరు గల్లంతయ్యారని బెంగళూరు తూర్పు డీసీపీ దేవరాజు తెలిపారు.
short by Devender Dapa / 08:39 pm on 22 Oct
ఇటీవల నకిలీ బాంబు బెదిరింపుల కారణంగా భారతీయ విమానయాన సంస్థలు ఇప్పటివరకు రూ.500 కోట్లు నష్టపోయాయని NDTV ప్రాఫిట్ నివేదించింది. విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు, వాటిని సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తారు. అపుడు విమానయాన సంస్థలు ఇంధనం, ప్రయాణీకుల భోజనం, వసతి కోసం అదనపు ఖర్చులు, పార్కింగ్ ఛార్జీలు, సిబ్బంది ఓవర్‌టైమ్‌ చెల్లింపులు భరిస్తాయి.
short by Devender Dapa / 10:14 pm on 22 Oct
మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలతో ఫైజల్ అనే వ్యక్తి భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్ స్టేషన్ వద్ద 21 సార్లు జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ, 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేశాడు. సదరు వ్యక్తి 'పాకిస్థాన్‌ జిందాబాద్' అంటూ దేశ వ్యతిరేక నినాదాలు చేశాడనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నాడు. దర్యాప్తు ముగిసే వరకు నెలకు 2 సార్లు జాతీయ జెండాకు వందనం చేస్తూ, దేశభక్తి నినాదాలు చేయాలనే షరతుపై అతనికి బెయిల్ మంజూరైంది.
short by Rajkumar Deshmukh / 05:06 pm on 22 Oct
దిల్లీ CRPF పాఠశాలలో పేలుడు జరిగిన కొన్ని రోజుల తర్వాత మరో 3 స్కూళ్లలోనూ పేలుళ్ల జరుపుతామని CRPFకు బూటకపు బాంబు బెదిరింపు ఇ-మెయిల్‌ వచ్చింది. హైదరాబాద్‌లోని పాఠశాలతో పాటు దిల్లీలోని 2 స్కూల్‌లకు ఈ బెదిరింపులు వచ్చాయి. అయితే వీటిలో రోజూవారీ తరగతులు యథావిథిగా జరిగాయని, విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని నివేదికలు తెలిపాయి. కాగా మంగళవారం ఉదయం 11 లోపు పేలుళ్ల జరగవచ్చని ఇ-మెయిల్‌లో ఉంది.
short by Devender Dapa / 05:56 pm on 22 Oct
భారతీయ విమానయాన సంస్థలకు చెందిన సుమారు 30 విమానాలకు సోమ, మంగళవారాల్లో బాంబు బెదిరింపులు వచ్చినట్లు పలు నివేదికలు తెలిపాయి. అందులో ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా విమానాలు ఉన్నాయి. బెదిరింపులకు గురైన విమానాలు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి. కాగా గడిచిన వారంలో 120 విమానాలకు బూటకపు బెదిరింపులు వచ్చాయి.
short by Devender Dapa / 05:10 pm on 22 Oct
మంగళవారం IQAir ప్రత్యక్ష ర్యాంకింగ్‌ల ప్రకారం, పాకిస్థాన్‌లోని లాహోర్ ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ, సెనెగల్‌లోని డాకర్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని కిన్షాసా, బంగ్లాదేశ్‌లోని ఢాకా ఉన్నాయి. టాప్‌ 10 స్థానాల్లో ఉన్న ఇతర నగరాల్లో మంగోలియాలోని ఉలాన్‌బాతర్, వియత్నాంలోని హనోయి, ఇండోనేషియాలోని జకార్తా, కోల్‌కతా, రొమేనియాలోని బుకారెస్ట్‌లు ఉన్నాయి.
short by Devender Dapa / 07:41 pm on 22 Oct
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నడుమ, పాలస్తీనాకు చెందిన ఓ చిన్నారి తన చెల్లెలిని భుజంపై ఎత్తుకొని, చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. "నేను ఆమెకు చికిత్స చేయించాలని అనుకుంటున్నా. గంటకు పైగా ఎత్తుకొని నడవడంతో అలసిపోయాను.” అని ఆ పాప ఒక వ్యక్తితో చెప్పినట్లు వీడియోలో ఉంది. సదరు వ్యక్తి వారిద్దరిని తన వాహనంలో ఎక్కించుకొని, ఆస్పత్రి సమీపంలో దింపేశాడు.
short by Rajkumar Deshmukh / 10:23 pm on 22 Oct
చేజారిపోయిన తన ఫోన్‌ను తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించి, రాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుపోయిన ఓ మహిళను ఆస్ట్రేలియాలో రెస్క్యూ బృందం ప్రతినిధులు చాకచక్యంగా రక్షించారు. సదరు మహిళను బయటకు తీసేందుకు స్నేహితులు ప్రయత్నించి, విఫలమయ్యారు. దీంతో రెస్క్యూ సహాయం కోరగా, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సుమారు 7 గంటల తర్వాత బాధిత మహిళను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
short by Rajkumar Deshmukh / 06:39 pm on 22 Oct
బంగ్లాదేశ్‌లో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి భారత్ 2.31 లక్షల గుడ్లను పంపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ధరలను స్థిరీకరించడానికి 4.5 కోట్ల గుడ్లను దశలవారీగా దిగుమతి చేసుకోవడానికి ఇటీవల ఆమోదం తెలిపింది. దీంతో నవంబర్‌ నాటికి భారత్‌ నుంచి అదనంగా 90 లక్షల గుడ్లను బంగ్లాదేశ్‌ దిగుమతి చేసుకోనుంది. ఆ దేశ రాజధాని ఢాకాలో గుడ్డు ధరలు డజనుకు రూ.140 (200 టాకా) వరకు పెరిగాయి.
short by Devender Dapa / 11:21 pm on 22 Oct
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడి వల్ల జరిగిన నష్టాన్ని చూపించే తొలి ఫొటో ఆన్‌లైన్‌లో కనిపించింది. కాగా ఈ దాడి తామే చేసినట్లు హిజ్బుల్లా ప్రతినిధి మహ్మద్ అఫీఫ్ ప్రకటించారు. ఈ దాడి తర్వాత నెతన్యాహు ఓ వీడియోను విడుదల చేశారు. “మా భవిష్యత్తు రక్షణ కోసం శత్రువులపై మేము చేస్తున్న న్యాయమైన యుద్ధం కొనసాగించకుండా నన్ను లేదా ఇజ్రాయెల్‌ దేశాన్ని ఏ దాడి అడ్డుకోలేదు,” అని అన్నారు.
short by Devender Dapa / 11:34 pm on 22 Oct
యూరప్‌ దేశమైన స్లొవేకియాలో దాదాపు 6వేల ముస్లిం జనాభా ఉంది. అయినా కూడా అక్కడ ఒక్క మసీదు కూడా లేదు. చాలా ఏళ్లుగా వారు పోరాడుతున్నా, మసీదు నిర్మాణానికి, ప్రత్యేక స్మశానానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు. ఏదైనా మతాన్ని అధికారికంగా గుర్తించి, వాటి నిర్మాణాలకు అనుమతించేందుకు, ఆ మతంలో కనీసం 50వేల జనాభా ఉండాలని ఆ దేశం చట్టం తీసుకొచ్చింది. ఇస్లాంను అణగదొక్కేందుకే ఈ చట్టాన్ని 2016లో ప్రవేశపెట్టారు.
short by Sharath Behara / 05:05 pm on 22 Oct
హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద భారతీయ IPOగా స్టాక్‌ ఎక్స్‌ఛేంజీలలో లిస్టింగ్‌ కోసం రూ.624 కోట్లు వెచ్చించి, ఇష్యూ ఖర్చుల పరంగా అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ జాబితాలో పేటీఎం (రూ.441 కోట్లు), జొమాటో (రూ.284 కోట్లు), DLF (రూ.266 కోట్లు), ఓలా ఎలక్ట్రిక్ (రూ.251 కోట్లు) తర్వాత ఉన్నాయి. రూ.21,000 కోట్లు సమీకరించి భారత్‌లో 2వ అతిపెద్ద IPOగా ఉన్న LIC లిస్టింగ్‌కు రూ.119.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
short by Devender Dapa / 06:51 pm on 22 Oct
తాను ఇటీవల కొనుగోలు చేసిన రోల్స్‌ రాయిస్ స్పెక్టర్ కారు రిజిస్ట్రేషన్ కోసం సినీ నటుడు రామ్‌చరణ్ మంగళవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కి వచ్చారు. కారు నంబర్ టీజీ 09 C 2727ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఫొటో దిగి, సంతకం చేశారు. ఈ కారు ‌ధర ఏడున్న‌ర కోట్ల రూపాయలు అని సమాచారం. భారత్‌లో ఈ కారును కొన్న రెండో వ్యక్తి చ‌ర‌ణ్ అని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
short by Sri Krishna / 06:23 pm on 22 Oct
రూ.99కి క్వార్టర్ మద్యం బాటిళ్ల ఉత్పత్తిని పెంచామని, ఈ నెలాఖరుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఏపీ ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. ప్రస్తుతం రూ.99 మద్యానికి సంబంధించి రోజుకు 10 వేల కేసులే వైన్స్‌లకు సరఫరా అవుతున్నాయని, వాటిని ఈనెలాఖరుకు 2.4 లక్షల కేసులకు పెంచుతున్నట్లు పేర్కొంది. కాగా ఏపీలో 4 కంపెనీలు తమ 7 రకాల బ్రాండ్ల క్వార్టర్‌ సీసాను రూ.99 ఎమ్మార్పీకే విక్రయించేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి పొందాయి.
short by Devender Dapa / 09:33 pm on 22 Oct
ప్రయాణంలో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో 'మోషన్ సిక్ నెస్' అంటారు. చెవిలో ఉండే ‘లాబ్రింథైస్‌’ అనే భాగానికి ఇబ్బంది కలగడం వల్లే ప్రయాణాల్లో తల తిరగడం, వాంతులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు. ప్రయాణంలో ఉండగా వాంతులు అవుతున్నట్లు అనిపిస్తే, కుడి/ఎడమ చేతి బొటన వేలు కింద చివర భాగం, మణికట్లు కలిసే చోట ఎడమ/కుడి చేతితో నొక్కిపట్టుకోవడం లేదా మెల్లగా నొక్కడం వల్ల ఉపశమనం ఉంటుంది.
short by Sri Krishna / 06:04 pm on 22 Oct
గుంటూరు జీజీహెచ్‌లో మూడు రోజులుగా కోమాలో ఉన్న దశలో చికిత్స పొందుతున్న సహానా అనే యువతి మంగళవారం రాత్రి మృతి చెందింది. ఆమె ప్రియుడు, రౌడీ షీటర్‌ నవీన్‌ దాడిలో సహానా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది. కారు డాష్‌ బోర్డుకు ఆమె తలను గట్టిగా గుద్దడంతో ఆమె బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు గుర్తించారు. తనకు ఇవ్వాల్సిన రూ.1.5లక్షల గురించి సహానా అడగడంతో, ఆమెను కోపంతో బలంగా కొట్టినట్లు పోలీసులకు నిందితుడు తెలిపాడు.
short by Sharath Behara / 10:51 pm on 22 Oct
‘అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌’లో భాగంగా విజయవాడలో దేశంలోనే తొలిసారి 5,500 డ్రోన్లతో ఏర్పాటు చేసిన షో 5 గిన్నిస్ రికార్డులను నమోదు చేసింది. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ పేరిట మొదటి రికార్డు సాధించగా, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టికి 2వ రికార్డు, లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్ పేరిట 3వ రికార్డు, డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శనతో 4వ రికార్డు, ఏరియల్ లోగోతో 5వ రికార్డును నెలకొల్పింది.
short by Devender Dapa / 11:10 pm on 22 Oct
దేశంలోనే అతి పెద్దదిగా చెబుతున్న అమరావతి డ్రోన్‌ ప్రదర్శన మంగళవారం సాయంత్రం విజయవాడలోని కృష్ణా నదీ తీరాన ప్రారంభమైంది. 5,500 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతకుముందు జరిగిన డ్రోన్‌ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద డ్రోన్‌ హబ్‌ ఏర్పాటుకు 300 ఎకరాల స్థలం కేటాయిస్తామని, కేంద్రం సహకరించాలని కోరారు.
short by Sharath Behara / 07:29 pm on 22 Oct
జగిత్యాలలోని జాబితాపూర్‌లో మాజీ ఎంపీటీసీ 58 ఏళ్ల మారు గంగారెడ్డిని సంతోష్‌ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత కత్తితో పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. గంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. ఈ హత్యకు నిరసనగా జగిత్యాల పాత బస్టాండ్‌ వద్ద తన అనుచరులతో కలిసి జీవన్‌రెడ్డి ధర్నాకు దిగారు. మరోవైపు, నిందితుడు సంతోష్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.
short by Rajkumar Deshmukh / 04:27 pm on 22 Oct
Load More
For the best experience use inshorts app on your smartphone