For the best experience use Mini app app on your smartphone
సాంకేతిక లోపం తలెత్తడంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. విమానం బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉండగా, హైదరాబాద్‌లో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ అధికారులు గన్నవరానికి దారి మళ్లించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ సమయంలో ఇండిగో విమానంలో మొత్తం 222 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్‌ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
short by Devender Dapa / 11:05 pm on 01 Jul
For the best experience use inshorts app on your smartphone