For the best experience use Mini app app on your smartphone
ఒక వ్యక్తి ప్రతిరోజూ 5 గంటలు మాత్రమే నిద్రపోతే, అతని శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులను ఉటంకిస్తూ 'స్లీప్ ఫౌండేషన్' పేర్కొంది. తగినంత నిద్ర లేకపోవడం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక స్థితి, రోగనిరోధక శక్తి & జీవనశైలిని ప్రభావితం చేయటమే కాకుండా ఆకలి & బరువు పెరుగుదలకు కారణమవుతుంది. మంచి ఆరోగ్యం కోసం పెద్దలు రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
short by Devender Dapa / 09:32 pm on 21 Aug
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆస్తులు జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమంగా సంపాదించిన డబ్బును వైట్‌ మనీగా మార్చుకునేందుకు కెసిరెడ్డి వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేశారని సిట్‌ అధికారులు నిర్ధరించారు. ఈ ఆస్తుల్లో కొన్ని ఆయన బంధువుల పేర్లపై కూడా ఉన్నట్లు గుర్తించారు.
short by Devender Dapa / 08:38 pm on 21 Aug
పార్లమెంటులో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో డ్రీమ్ 11 తన ప్రధాన రియల్-మనీ గేమింగ్ వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించిందని నివేదికలు తెలిపాయి. వాటి ప్రకారం, కంపెనీ ఆదాయంలో మూడింట రెండు వంతులు ఇందులో నుంచే వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ రియల్-మనీతో సంబంధం లేని ఫ్యాన్‌కోడ్, స్పోర్ట్స్ డ్రిప్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తోంది.
short by / 09:29 pm on 21 Aug
త్రిపురలోని పశ్చిమ జిల్లాలో బైక్‌పై వెళ్తుండగా ఓ మహిళ తన భర్తపై యాసిడ్‌ పోసిందని పోలీసులు తెలిపారు. "దంపతులు బైక్‌పై వెళ్తుండగా ఇది జరిగింది. ఏం జరిగిందో తెలియక అతడు సహాయం కోసం కేకలు వేశాడు. అయితే ఇదే సమయంలో అతడి భార్య మరోసారి యాసిడ్ పోసేందుకు ప్రయత్నించింది. కానీ స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుకున్నారు" అని చెప్పారు. ముఖం, మెడపై గాయాలు కావడంతో సదరు వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు.
short by / 10:43 pm on 21 Aug
లక్షలాది మంది భారతీయులు తమకు తెలియకుండానే మధుమేహంతో జీవిస్తున్నారని లాన్సెట్ నివేదిక చెబుతోంది. ప్రధానంగా తక్కువ అవగాహన, పరీక్షలు చేయించుకోకపోవడం కారణంగా దాదాపు సగం కేసులు నిర్ధారణ కాలేదు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ప్రజలు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలని, చురుకుగా ఉండాలని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు.
short by / 11:21 pm on 21 Aug
టీమిండియా ఆటగాళ్ల కోసం రగ్బీ-కేంద్రీకృత బ్రోంకో టెస్ట్‌ను BCCI ప్రవేశపెట్టింది. ఈ టెస్టులో భాగంగా ఆటగాళ్లు వరుసగా 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల దూరంలో షటిల్ రన్స్ చేయాలి. ఒక ఆటగాడు ఇలా ఐదు సెట్‌లను ఏకధాటిగా పూర్తి చేయాలి. ఈ టెస్ట్‌ను కేవలం ఆరు నిమిషాల్లోనే పూర్తి చేయాలనే షరతు కూడా విధించారు. ఈ టెస్టు ప్రధాన ఉద్దేశం ఆటగాళ్లు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు మరింతగా పరుగులు పెట్టి స్టామినా పెంచుకోవడమే.
short by / 11:41 pm on 21 Aug
ఆస్ట్రియాలో దాదాపు 300 కిలోల బరువున్న 29 ఏళ్ల వ్యక్తిని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్టు చేసి జైలులో ఉంచారు. అయితే అక్కడి ప్రభుత్వం ఈ ఖైదీ సంరక్షణ కోసం సాధారణ ఖైదీ కంటే పది రెట్లు ఎక్కువ (రోజుకు 1,800 యూరోలు) ఖర్చు చేస్తోంది. ఇదే సమయంలో అతడి సౌలభ్యం కోసం ప్రత్యేకంగా వెల్డింగ్ చేసిన బలమైన మంచాన్ని ఏర్పాటు చేశారు. అయితే నేరస్థుల కోసం ఇంత మొత్తం ఖర్చు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
short by / 11:45 pm on 21 Aug
శుక్రవారం దేశంలోని అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. యూపీ, బిహార్, రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో రాజస్థాన్, బిహార్, ఎంపీలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడతాయి.
short by / 09:30 pm on 21 Aug
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన దివ్యమ్ అనే విద్యార్థి.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోతే వాహనాన్ని స్వయంచాలకంగా ఆపే ఒక ప్రత్యేకమైన డెమో పరికరాన్ని సృష్టించాడు. 'న్యూస్ 18' నివేదిక ప్రకారం, 'యాంటీ-స్లీప్ అలారం'తో కూడిన ఈ పరికరం డ్రైవర్ నిద్రపోయిన 3 సెకన్లలోపు అలారం మోగిస్తుంది. ఆ తర్వాత వాహనం స్లో అయి నెమ్మదిగా ఆగిపోతుందని విద్యార్థి దివ్యమ్ తెలిపారు.
short by / 09:55 pm on 21 Aug
12,000 డాలర్ల కోసం చైనాకు రహస్య సైనిక సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా నేవీ సెయిలర్‌ జిన్చావీ దోషిగా తేలాడు. ఇందుకు అతడి తల్లి కూడా సహకరించిందని నివేదికలు తెలిపాయి. అతడు రహస్యంగా సందేశాలు పంపించాడని, కోడ్‌ లాంగ్వేజ్‌ను ఉపయోగించని పేర్కొన్నాయి. చైనాలో ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామనే ఆఫర్‌తో అతడు ఈ పనిచేసినట్లు సమాచారం. అతడికి జీవితఖైదు విధించే అవకాశం ఉంది.
short by / 10:01 pm on 21 Aug
రియల్-మనీ ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించడానికి ఉద్దేశించిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు, 2025ను రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లుపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశంలో 45 కోట్ల మంది ఆన్‌లైన్ మనీ గేమింగ్ ద్వారా రూ.20,000 కోట్లకు పైగా నష్టపోయారని అన్నారు. ఆన్‌లైన్ మనీ గేమింగ్‌ను డ్రగ్స్ లాంటి ముప్పుగా అభివర్ణిస్తూ, ఈ వ్యసనం అనేక మంది ప్రాణాలను బలిగొందని చెప్పారు.
short by / 11:27 pm on 21 Aug
జూన్ 2025లో 21.89 లక్షల మంది కొత్త సభ్యులు EPFO​​లో చేరారని భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. 2018 నుంచి పేరోల్ డేటా ట్రాకింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఒకనెలలో ఇంత మంది సభ్యులు EPFOలో చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ కాలంలో కొత్త సభ్యుల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 13.46%, నెలవారీ ప్రాతిపదికన 9.14% పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు వివరించాయి.
short by / 11:31 pm on 21 Aug
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, బ్రిటిష్ వ్యక్తి అయిన ఎథెల్ కాటర్‌హామ్ ఆగస్టు 21న తన 116వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఎథెల్ ఏప్రిల్ 30 నుంచి ఈ రికార్డును కలిగి ఉన్నారు. ఆమె 18 సంవత్సరాల వయసులో భారత్‌లో నివసించి బ్రిటిష్ కుటుంబంలో నానీగా ఉద్యోగం చేశారు. ఎథెల్ 110 ఏళ్ల వయసులో కొవిడ్ బారిన పడ్డారు. కరోనా నుంచి బయటపడ్డ అత్యంత వృద్ధ మహిళల్లో ఆమె కూడా ఒకరు కావడం గమనార్హం.
short by / 11:49 pm on 21 Aug
మహిళల వన్డే ప్రపంచ కప్‌కి ముంగిట జరుగుతున్న మహిళల ఛాలెంజ్ కప్ 2025లో బంగ్లాదేశ్ సీనియర్ మహిళల జట్టు (బంగ్లాదేశ్ ఉమెన్స్ రెడ్)ను అండర్-15 బాలుర జట్టు ఓడించింది. బాలుర జట్టు మొత్తం 181/8 పరుగులు చేయగా, మహిళల జట్టు 38 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌట్ అయ్యారు. బంగ్లాదేశ్ మహిళా జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా ఈ మ్యాచ్‌లో మూడు బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగారు.
short by / 08:33 pm on 21 Aug
భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 142 పాయింట్లు పెరిగి 82,000 వద్ద.. నిఫ్టీ 33 పాయింట్ల పెరిగి 25,083 వద్ద ముగిసింది. ప్రధాన రంగాల సూచీల విలువ పెరిగింది. జీవిత, ఆరోగ్యబీమాపై జీఎస్టీ తొలగింపు వంటి చర్యలు తాజాగా మార్కెట్‌లో జోష్‌ నింపాయి. దీనికితోడు భారత ఆర్థికవ్యవస్థ బలంగా, స్థిరంగా ఉందని ఆర్బీఐ గవర్నర్‌ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసం పెంచింది.
short by / 09:27 pm on 21 Aug
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లే అంబులెన్స్‌లో ఆక్సిజన్ అయిపోవడంతో 58 ఏళ్ల మహిళ మరణించిందని, డ్రైవర్ వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఆమె గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. "ఆమెను తొలుత అడ్వాన్స్‌డ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత వారు ఆమెను ఎస్ఎంఎస్ ఆసుపత్రికి రిఫర్ చేశారు," అని ఒక అధికారి తెలిపారు.
short by / 10:54 pm on 21 Aug
భారీ వర్షాల తర్వాత పాకిస్థాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం దేశంలోని దాదాపు మూడింట రెండు వంతుల మంది ఇంటర్నెట్ వినియోగదారులపై పడింది. 2022లో కూడా పాకిస్తాన్‌లో ఇలాంటి బ్లాక్‌అవుట్ సంభవించింది. వరదలు ప్రధాన ఫైబర్ మార్గాలను దెబ్బతీశాయి. "మూడింట రెండు వంతుల మధ్య ఇబ్బంది పడుతున్నారు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది" అని ఇంటర్నెట్ పరిశ్రమ అధికారి ఒకరు అన్నారు.
short by / 11:23 pm on 21 Aug
మధ్య అమెరికాలోని గ్వాటెమాలాలో ఒక వ్యక్తి పర్వతాలలో మోకాళ్లపై కూర్చుని తన స్నేహితురాలికి ప్రపోజ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా అగ్నిపర్వతం పేలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. "ప్రపోజ్ చేస్తేనే అగ్నిపర్వతం బద్దలైంది. ఇక పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో?" అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.
short by / 11:26 pm on 21 Aug
కర్ణాటకలో ట్రాక్టర్‌పై స్టంట్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాక్టర్‌తో స్టంట్స్‌ చేసి రీల్ చేయాలని యువకుడు భావించాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయి సదరు యువకుడి కింద పడ్డాడు. అతడిపై ట్రాక్టర్ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వ్యూస్‌ కోసం ప్రాణాలు పోగొట్టుకోవద్దని కామెంట్లు చేస్తున్నారు.
short by / 11:34 pm on 21 Aug
ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాలో ఉన్న తాజ్‌ మహల్‌లో సాధారణంగా పర్యటకులు చేరుకోలేని ఓ ప్రదేశానికి సంబంధించిన ఫొటో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటో షాజహాన్, ముంతాజ్‌ల వాస్తవ సమాధులను చూపిస్తోందని పలువురు యూజర్లు పేర్కొన్నారు. అయితే తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు వెళ్లిన వారు చూసే సమాధులు నకిలీవి. వాటిని 'సమాధి భవనాలు' అంటారు. అయితే ఫొటో నిజమైనదో కాదో తేలాల్సి ఉంది.
short by / 11:38 pm on 21 Aug
సిన్ గూడ్స్ అంటే వ్యక్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే, సమాజానికి హానికరంగా భావించే వస్తువులు అని అర్థం. కేంద్రం ప్రతిపాదించిన GST సంస్కరణల తర్వాత వీటిపై 40% పన్ను విధించే అవకాశం ఉంది. గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు సిన్ గూడ్స్ జాబితాలో ఉన్నాయి. లగ్జరీ కార్లు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై కూడా 40% GST విధించే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి.
short by / 11:56 pm on 21 Aug
భారత్‌లో ఐఫోన్ 16కు పోటీగా గూగుల్ పిక్సెల్‌ 10 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 20న లాంఛ్ అయింది. దీని ప్రారంభ ధర రూ.79,999 కాగా, ఐఫోన్‌ 16 ప్రారంభ ధర రూ.79,900గా ఉంది. పిక్సెల్‌ 10 ప్రో ప్రారంభ ధర రూ.1,09,999 కాగా, ఐఫోన్‌ 16 ప్రో ప్రారంభ ధర రూ.1,19,900. ఇదే సమయంలో పిక్సెల్‌ 10 సిరీస్‌లోని టాప్ మోడల్ పిక్సెల్‌ 10 Pro XL ప్రారంభ ధర రూ.1,24,999 కాగా, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ ప్రారంభ ధర రూ. 1,44,900గా ఉంది.
short by / 10:05 pm on 21 Aug
2025 ఆసియా కప్ కోసం భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల అతడి తండ్రి సంతోష్ అయ్యర్ నిరాశ వ్యక్తం చేశారు. "అతడిని భారత కెప్టెన్‌గా చేయాలని నేను చెప్పడం లేదు, కానీ కనీసం జట్టులోకి అయినా ఎంపిక చేయండి. అతడిని జట్టుకు దూరంగా ఉంచినప్పటికీ, అతడి ముఖంలో అసంతృప్తి లేదు" అని ఆయన అన్నారు. శ్రేయస్ తన సారథ్యంలో ఐపీఎల్‌ 2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు. 2025లో పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
short by / 10:09 pm on 21 Aug
జమ్ముకశ్మీర్‌లో షాలు అనే 27 ఏళ్ల వివాహితను అత్తింటి వారే హత్య చేశారని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెళ్లి సమయంలో కానుకగా ఇచ్చిన సోఫా, మంచాలనే చితిగా పేర్చి, అత్తింటి ప్రాంగణంలోనే మృతదేహాన్ని దహనం చేశారు. ఇటీవలే తమ కుమార్తెకు ఘనంగా పెళ్లి చేశామని, కానీ పెళ్లయిన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం వరుడి కుటుంబ సభ్యులు వేధించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
short by / 10:38 pm on 21 Aug
రాజస్థాన్‌లో అత్యాచారం-హత్య కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి వచ్చాక, దత్తపుత్రికను అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తి 2024లో జైలు నుంచి విడుదలయ్యాడు. ఆపై భరత్‌పూర్‌లోని ఒక పేద కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్నాడు. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
short by / 10:42 pm on 21 Aug
Load More
For the best experience use inshorts app on your smartphone