For the best experience use Mini app app on your smartphone
దుబాయ్‌లో భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్ ఆరంభానికి ముందు పాకిస్థాన్‌ జాతీయ గీతానికి బదులుగా పంజాబీ-ఇంగ్లిష్‌ పాప్‌ సాంగ్‌ ‘జలేబీ బేబీ’ని డీజే పొరపాటున ప్లే చేశాడు. దీంతో పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 7 వికెట్ల తేడాతో ఓడించింది.
short by srikrishna / 12:30 pm on 15 Sep
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌ జిల్లాలో 75 ఏళ్ల వృద్ధురాలిని గ్రైండింగ్ రాయితో తలపై కొట్టి చంపిన కేసులో ఆమె మనవరాలు 21 ఏళ్ల పల్లవిని అరెస్టు చేశారు. అర్ధరాత్రి వేళ ఇంట్లో పల్లవి తన ప్రియుడు దీపక్‌తో శృంగారం చేస్తుండగా ఆ వృద్ధురాలు చూసిందని, ఈ విషయం బయట చెబుతుందేమోననే భయంతో వారిద్దరూ కలిసి ఆమెను హత్య చేశారని పోలీసులు చెప్పారు. ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి ఈ హత్య చేసినట్లు పల్లవి నమ్మించే ప్రయత్నం చేసింది.
short by srikrishna / 12:06 pm on 15 Sep
ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేసేందుకు గడువు సోమవారం (సెప్టెంబరు 15)తో ముగియనుందని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించింది. ‘’పన్ను చెల్లింపులపై సందేహాలు తీర్చేందుకు 24×7 హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశాం. కాల్స్‌, లైవ్ చాట్స్‌, వెబ్‌ సెషన్స్‌, ఎక్స్‌లోనూ పన్ను చెల్లింపుదారులకు సపోర్ట్‌ అందిస్తున్నాం,’’ అని తెలిపింది.
short by srikrishna / 09:17 am on 15 Sep
బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు అసభ్య పదజాలంతో దూషణలకు దిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ బయలుదేరిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో జరిగింది. ఇరువైపుల బంధువులు వారికి మద్దతుగా నిలవడంతో గొడవ ముదిరి, ఆ ఇద్దరు నీళ్ల సీసాలతో దాడులు చేసుకున్నారు. బస్సును పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాలని ప్రయాణికులు కోరడంతో గొడవ సద్దుమణిగింది.
short by srikrishna / 10:29 am on 15 Sep
విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి తిరుపతి స్పెషల్ ట్రైన్ ఈ నెల 15 నుంచి నవంబర్ 24 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని చెప్పారు. మరోవైపు తిరుపతి నుంచి విశాఖపట్నం రైలును ఈ నెల 16 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం నడపనున్నట్లు వివరించారు. దీంతో ఈ మార్గంలో కొత్తగా 22 సర్వీసులు నడుస్తాయి.
short by / 12:51 pm on 15 Sep
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి BRS శాసనసభ్యులు సోమవారం స్పీకర్‌ను కలవనున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై వారు తమ అభ్యంతరాలను తెలియజేయనున్నారు. గతంలో స్పీకర్ ఆ వివరణలపై అభ్యంతరాలుంటే 3 రోజుల్లోగా తెలపాలని BRS పార్టీకి సూచించారు. ఈ నేపథ్యంలో ఆ వివరణలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆ పార్టీ లీగల్ సెల్ మరిన్ని ఆధారాలను స్పీకర్‌కు సమర్పించాలని నిర్ణయించింది.
short by / 12:48 pm on 15 Sep
ఏపీ మెగా డీఎస్సీ 2025 తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తూ, ‘’వాగ్దానం నెరవేరింది’’ అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. 150 రోజుల్లోపే పాఠశాల విద్యా శాఖ మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. ఇందులో అర్హత పొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ‘’ఈసారి జాబితాలో పేరు లేని వారు నిరుత్సాహపడొద్దు. హామీ ఇచ్చినట్లు ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. సిద్ధంగా ఉండండి,’’ అని లోకేశ్‌ తెలిపారు.
short by srikrishna / 11:24 am on 15 Sep
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాసంస్థలకు ఫీజు రీయంబర్స్‌మెంట్ల బకాయిలు విడుదల చేయడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బకాయిలు విడుదల చేయాలంటే 20 % కమీషన్లు డిమాండ్ చేస్తోందని చెప్పారు. దీంతో విద్యా సంస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయని వెల్లడించారు. ఆమె ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
short by / 01:03 pm on 15 Sep
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఐఫోన్ ధరలు భారీగా తగ్గనున్నాయి. రూ.1.19లక్షలతో లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఈ సేల్‌లో రూ.69,999కు అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం దీని ధర రూ.1,12 లక్షలు ఉండగా బిగ్‌ బిలియన్‌ డే సేల్‌లో భారీగా తగ్గనుంది. ఈ సేల్ ఈ నెల 23న ప్రారంభం కానుండగా, ఆపిల్ ఐఫోన్ ఆఫర్లు స్టాక్ ఉన్నంతవరకు అందుబాటులో ఉంటాయి.
short by / 12:53 pm on 15 Sep
మెగా డీఎస్సీ -2025 తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. 16,347 పోస్టులకు గాను 2 విడతలుగా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం జూలై 5న ప్రాథమిక కీ, ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేసింది. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in/ తుది ఎంపిక ఫలితాలను పోస్టు చేసింది.
short by / 10:29 am on 15 Sep
ఇటీవలి కాలం వరకు ధర పలికిన ఉల్లి విలువ ప్రస్తుతం రికార్డు స్థాయిలో క్షీణించినట్లు కర్నూలు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉల్లి కిలోకు 30 పైసలకు పడిపోయినట్లు వెల్లడించాయి. తమ మార్కెట్‌ చరిత్రలో ఈ ధరలు నమోదు కావడం ఇదే తొలిసారని చెప్పాయి. కాగా, ప్రస్తుతం మార్కెట్‌కు ఉల్లి వస్తున్నప్పటికీ, మద్దతు ధర మాత్రం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
short by / 10:36 am on 15 Sep
తెలుగు రాష్ట్రాల్లో రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
short by / 10:40 am on 15 Sep
నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి సుశీలా కర్కి ఆదివారం తన మంత్రివర్గంలోకి ముగ్గురు మంత్రులను చేర్చుకున్నారు. ప్రముఖ న్యాయవాది ఓం ప్రకాష్ ఆర్యల్ కొత్త హోం మంత్రిగా నియమితులయ్యారు. నేపాల్ మాజీ ఆర్థిక కార్యదర్శి రమేషోర్ ఖనాల్ దేశ కొత్త ఆర్థిక మంత్రిగా, విద్యుత్ అథారిటీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుల్మాన్ ఘిసింగ్‌ను ఇంధన, నీటిపారుదల మంత్రిగా నియమించారు.
short by / 10:39 am on 15 Sep
దోహాలో ఇటీవల ఇజ్రాయెల్ దాడులను ఉదహరిస్తూ ఇస్లామిక్ సైనిక కూటమిని ఏర్పాటు చేయాలని ఇరాన్ సీనియర్ అధికారులు పిలుపునిచ్చారు. సోమవారం ఖతార్‌లో జరగనున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ (OIC) అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి ముందు వారు ఈ ప్రతిపాదన చేశారు. OIC నిర్ణయాత్మకంగా వ్యవహరించకపోతే సౌదీ అరేబియా, టర్కీ, ఇరాక్‌ భవిష్యత్తులో ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.
short by / 10:43 am on 15 Sep
కెనడా టొరంటోలోని కార్వెట్ జూనియర్ పబ్లిక్ స్కూల్‌లో ఒక ఉపాధ్యాయుడు 5, 6 తరగతుల విద్యార్థులను చార్లీ కిర్క్ హత్యకు సంబంధించిన వీడియోను చూడాలని బలవంతం చేశాడు. సదరు టీచర్‌ విద్యార్థులతో ఫాసిజం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి "ఇది జరగడానికి కిర్క్ అర్హుడు" అని పేర్కొన్నాడని సమాచారం. కాగా, బాధ్యుడైన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ వెల్లడించారు.
short by / 11:03 am on 15 Sep
వక్ఫ్ సవరణ చట్టాన్ని పూర్తిగా నిలిపివేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే కొన్ని విభాగాలకు రక్షణ అవసరమని సోమవారం చేపట్టిన విచారణ సందర్భంగా పేర్కొంది. వక్ఫ్ గుర్తింపు పొందేందుకు ఒక వ్యక్తి 5 ఏళ్ల పాటు ఇస్లాం మతాన్ని ఆచరించేవాడిగా ఉండాలనే నిబంధనను కోర్టు నిలిపివేసింది. వక్ఫ్ ఆస్తులను నిర్ణయించడంలో కలెక్టర్ పాత్రపై నిబంధనను కూడా నిలిపివేసింది.
short by / 12:14 pm on 15 Sep
డల్లాస్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్యను తన భార్య, కొడుకు కళ్లెదుటే తల నరికి చంపిన కేసులో సంచలన విషయాలు తన దృష్టికి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అక్రమ వలసదారులపై ఇక సున్నితంగా వ్యవహరించబోనని అన్నారు. గతంలో బైడెన్‌ ప్రభుత్వం అనుసరించిన విధానమే నిందితుడు మార్టినెజ్‌ అమెరికాలో నివసించేందుకు దోహదపడిందని విమర్శించారు. తమ కస్టడీలో ఉన్న నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానన్నారు.
short by / 10:07 am on 15 Sep
అమెరికాలో వాషింగ్ మెషిన్ పగలడంపై చెలరేగిన వాగ్వాదం అనంతరం చంద్రమౌళి నాగమల్లయ్యపై అతని సహోద్యోగి కోబోస్-మార్టినెజ్ దాడి చేసి తల నరికి చంపాడు. 50 ఏళ్ల నాగమల్లయ్య డల్లాస్‌లోని డౌన్‌టౌన్ సూట్స్ మోటెల్ మేనేజర్‌గా ఉన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు అతడిని "బాబ్" అని పిలిచేవారు. 2018లో అమెరికాకు వెళ్లే ముందు బెంగళూరులోని బసవనగుడిలోని ఇందిరానగర్ కేంబ్రిడ్జ్ స్కూల్, నేషనల్ కాలేజీలో ఆయన విద్యనభ్యసించారు.
short by / 11:38 am on 15 Sep
మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఆ రాష్ట్ర రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో గుజరాత్ గవర్నర్‌గా ఉన్న దేవవ్రత్‌కు మహారాష్ట్ర అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, ముంబై చేరుకునేందుకు దేవవ్రత్‌ ఆదివారం తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు.
short by / 11:52 am on 15 Sep
దుబయ్‌లో భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్‌ జాతీయ గీతానికి బదులుగా టెషర్, జాసన్ డెరులో రాసిన "జలేబీ బేబీ" పాటను DJ పొరపాటున ప్లే చేయడంతో పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది.
short by / 01:19 pm on 15 Sep
భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అరుణాచల్, బిహార్, అసోం, మేఘాలయ, యూపీ, జార్ఖండ్, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్‌లల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్, బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
short by / 12:25 pm on 15 Sep
పంజాబ్ పోలీసులు రూ.75 కోట్ల విలువైన 15.775 కిలోగ్రాముల హెరాయిన్‌తో 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడిని సోనుగా గుర్తించారు. పాకిస్థాన్‌ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న హెరాయిన్‌తో ఫిరోజ్‌పూర్‌ సట్లెజ్ నది వెంట ఉన్న ఒక కట్ట వద్ద అరెస్టు చేశారు. ఫిరోజ్‌పూర్ సరిహద్దులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల స్మగ్లర్లు వరద పరిస్థితిని ఆసరాగా చేసుకుని చాలా చురుకుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
short by / 12:41 pm on 15 Sep
భారత్‌కు చెందిన ప్రసిద్ధ ఇంజినీర్లలో ఒకరైన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 15న జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఆయన వినూత్న డిజైన్లు & పరిష్కారాల ద్వారా దేశ మౌలిక సదుపాయాలను మార్చేందుకు కృషి చేశారు. 1955లో భారతరత్న అవార్డు పొందిన విశ్వేశ్వరయ్య ఉస్మాన్ సాగర్ & హిమాయత్ సాగర్ వంటి జలాశయాలను రూపొందించారు. పలు వరద నియంత్రణ పరిష్కారాలను ఆయన ప్రతిపాదించారు.
short by / 10:29 am on 15 Sep
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ ప్రజలకు ఇంజినీర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత ఇంజినీరింగ్ రంగంలో చెరగని ముద్ర వేసిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఆయన నివాళులు అర్పించారు. "ఇంజినీర్లు, వారి సృజనాత్మకత, సంకల్పం ద్వారా, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్తూ, ఆయా రంగాల్లో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటారు" అని ఆయన అన్నారు. వికసిత్‌ భారత్ నిర్మాణంలో ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తూనే ఉంటారన్నారు.
short by / 11:41 am on 15 Sep
నేపాల్ జెన్‌ జెడ్‌ యువత నేతృత్వంలో జరిగిన నిరసనలు ఉద్రిక్తంగా మారి, పోలీసులు కాల్పులు జరపడంతో 72 మంది మృతి చెందారు. కాగా దీనిపై ఆందోళనకారులు ప్రకటన విడుదల చేశారు. తీవ్ర గాయాలపాలైనప్పటికీ, తమకు "ఏ విధమైన విచారం లేదు" అని ఆదిత్య రావల్, సుభాష్ ధకల్ వంటి నిరసనకారులు చెప్పారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారు ఈ ప్రకటన చేశారు.
short by / 12:51 pm on 15 Sep
Load More
For the best experience use inshorts app on your smartphone