For the best experience use Mini app app on your smartphone
స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరుగుతున్న రేసింగ్‌లో నటుడు అజిత్ కుమార్‌ కారు ప్రమాదానికి గురైంది. రేస్‌ సమయంలో అడ్డంగా వచ్చిన మరో కారును తప్పించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అజిత్‌ వాహనం ట్రాక్‌పై పల్టీలు కొట్టగా, ఆయన సురక్షితంగా బయట పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను అజిత్‌ రేసింగ్‌ టీమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ రేసులో అజిత్ 14వ స్థానంలో నిలిచాడని ఆయన కుటుంబం తెలిపింది.
short by Srinu Muntha / 12:55 pm on 23 Feb
భారత్‌తో దుబాయ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ముహమ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో కలిపి భారత్ వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయింది. దీంతో వరుసగా అత్యధిక టాస్‌లు ఓడిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో ఆడిన తుది జట్టుతోనే భారత్ ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగింది.
short by Devender Dapa / 02:22 pm on 23 Feb
పాకిస్థాన్‌తో భారత్ ఇప్పటి వరకు 135 వన్డే మ్యాచ్‌లు ఆడింది. అందులో భారత్‌ 57 గెలవగా 73 మ్యాచ్‌లు ఓడిపోయింది. వాటిలో ఐదు మ్యాచ్‌లు ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో భారత్‌ ఐదు మ్యాచ్‌లు ఆడగా, వాటిలో రెండింటిలో గెలిచి మూడు ఓడింది. 2023లో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ తమ అత్యధిక వన్డే స్కోరు (356/2)ను నమోదు చేసింది.
short by Srinu Muntha / 10:24 am on 23 Feb
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్‌ ఇవాళ పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ వేదికగా ఇవాళ స్థానిక కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 1 గంటలకు (IST మధ్యాహ్నం 2.30) ప్రారంభమవుతుంది. అక్కడి వాతావరణాన్ని చూస్తే, మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 26°C- 32°C మధ్య ఉండొచ్చని అంచనా. AccuWeather ప్రకారం, సాయంత్రం వరకు వర్షం పడే అవకాశం లేదు. అయితే, రాత్రయ్యే కొద్దీ ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది.
short by Srinu Muntha / 08:56 am on 23 Feb
పాకిస్థాన్‌పై 16 వన్డేలు ఆడిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, 52.15 సగటు, 100.29 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 678 పరుగులు చేశాడు. అతడు పాక్‌పై మూడు వన్డే సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు కొట్టాడు. పాక్‌పై ఇప్పటివరకు కోహ్లీ అత్యధిక స్కోరు 183గా ఉంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌పై 19 వన్డేలు ఆడి 51.35 సగటు, 92.38 స్ట్రైక్ రేట్‌తో 873 పరుగులు చేశాడు. రోహిత్ పాక్‌పై రెండు సెంచరీలు కొట్టాడు.
short by Srinu Muntha / 12:50 pm on 23 Feb
నడుము నొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి వైదొలిగిన భారత ఫాస్ట్ బౌలర్‌ జస్‌ప్రీత్ బుమ్రా ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లను కలిశాడు. అతడు విరాట్ కోహ్లీని కౌగిలించుకుని, మాట్లాడినట్లు ఫొటోల్లో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది.
short by Devender Dapa / 03:01 pm on 23 Feb
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో నటి తమన్నా భాటియా తన కుటుంబంతో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు. ఇది జీవితంలో ఒకేసారి లభించే అవకాశమని, అందరితో కలిసి ఇలా చేయడం గొప్ప అనుభూతినిచ్చిందని తమన్నా అన్నారు. "మనమందరం అన్ని బాధల నుంచి విముక్తి పొంది, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. వాటి కోసమే మనం ఇక్కడికొచ్చాం," అని ఆమె పేర్కొన్నారు.
short by Srinu Muntha / 10:34 am on 23 Feb
బెంగళూరులో 33ఏళ్ల వివాహితపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. ‘’దిల్లీకి చెందిన మహిళ తన స్నేహితురాలి కోసం వేయిట్‌ చేస్తుండగా సమీప హోటల్‌లో పనిచేసే నలుగురు యువకులు ఆమెతో పరిచయం పెంచుకుని డిన్నర్‌కు తీసుకెళ్లారు. తర్వాత ఇంటి వద్ద విడిచిపెడతామని చెప్పి, ఓ రూమ్‌కు తీసుకెళ్లి రేప్‌ చేశారు,’’ అని పోలీసులు తెలిపారు. నలుగురు బిడ్డల తల్లినని చెబుతున్నా వినలేదని బాధితురాలు వాపోయారు.
short by Srinu Muntha / 10:15 am on 23 Feb
ప్రేమికుల దినోత్సవం రోజున 'సాస్సి మామ్' అనే పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ మహిళ తన కొడుకుతో సన్నిహితంగా ఉన్న వీడియోను పోస్ట్ చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అందులో సదరు మహిళ ఆ బాలుడిని కౌగిలించుకుని అసభ్యకరంగా ముద్దులు పెట్టడం కనిపించింది. ఆమె తన బయోలో తనను తాను 'పెంపుడు తల్లి'గా చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై ఓ యూజర్ స్పందిస్తూ ‘ఈ మహిళ సమాజానికి ప్రమాదకరం’ అంటూ కామెంట్ పెట్టాడు.
short by Srinu Muntha / 11:29 am on 23 Feb
14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఐదేళ్లకు పైగా జైలులో ఉన్న నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ‘’తాను ఏం చేస్తుందో తెలుసుకునేంత జ్ఞానం ఆ బాలికకు ఉంది. ఆమె ఇష్టపూర్వకంగానే 4 రోజుల పాటు నిందితుడితో ఉండిపోయింది,’’ అని కోర్టు పేర్కొంది. పోలీసు రిపోర్టు, బాలిక వాంగ్మూలంలో తేడాలున్నాయని గుర్తించిన న్యాయస్థానం, సదరు వ్యక్తితో తనకు సంబంధం ఉందని బాలిక అందులో పేర్కొన్నట్లు తెలిపింది.
short by Srinu Muntha / 01:51 pm on 23 Feb
ఈనెల 27న మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు ఆయా జిల్లాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భాగమైన కొల్లూరు, ఆర్‌సీ పురం ఠాణాల పరిధిలోనూ ఈ బంద్‌ కొనసాగుతుందని సైబరాబాద్‌ CP అవినాష్‌ మహంతి తెలిపారు.
short by Srinu Muntha / 12:38 pm on 23 Feb
తిరుపతిలో ఆదివారం గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు మమత అనే ఓ యువతి పెళ్లి బట్టల్లో హాజరైంది. చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో ఉదయం 6 గంటలకు పెళ్లి చేసుకున్న సదరు యువతి, నేరుగా అవే బట్టలతో, తలపై జీలకర్ర బెల్లంతో తిరుపతిలోని పద్మావతి డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రానికి చేరుకుంది. చెకింగ్‌ అనంతరం ఆమె పరీక్ష రాసేందుకు లోపలికి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
short by Srinu Muntha / 03:03 pm on 23 Feb
అందరి ముందు పీఈటీ కొట్టాడని ఉప్పల్‌లోని సాగర్‌ గ్రామర్‌ స్కూల్లో సంగారెడ్డి అనే 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు బాలుడు వాష్‌ రూంకు వెళ్తానని క్లాస్‌ టీచర్‌ని అడిగి బయటికి వచ్చి, స్నేహితులకు బైబై అని చెబుతూ 4వ అంతస్తు నుంచి దూకాడు. అతడు చివరగా రాసిన నోటుబుక్‌ చూడగా అందులో ‘సారీ మదర్‌.. ఐ విల్‌ డై టుడే’ అని ఉంది. క్లాస్‌రూమ్‌ CC కెమెరా డైరెక్షన్‌ మార్చడంతోనే PET కొట్టినట్లు సమాచారం.
short by Srinu Muntha / 08:57 am on 23 Feb
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (SLBC) టన్నెల్‌ పైకప్పు కూలి 8 మంది లోపలే చిక్కుకున్న ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఇప్పటికే లోకో ట్రైన్‌లో 11 కి.మీ వరకు వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల స్థాయిలో నీరు ఉండటంతో 14 కి.మీటర్‌ వరకు నడుచుకుంటూ వెళ్లి టన్నెల్ బోరింగ్‌ మిషన్ (TBM) వద్దకు చేరుకున్నాయి. అయితే, అవతలివైపు చిక్కుకున్న వారిని తీసుకురావాలంటే బురద నీటిని తోడాల్సి ఉంటుంది.
short by Srinu Muntha / 10:13 am on 23 Feb
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట ఆలయంలో బంగారు రాజగోపురాన్ని ఆవిష్కరించారు. విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు. ఆలయ హుండీ కానుకలతో పాటు, దాతలు ఇచ్చిన 68.84 కిలోల బంగారంతో ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించారు. తెలంగాణలోనే తొలి స్వర్ణతాపడ గోపురం ఇదే అని నివేదికలు తెలిపాయి. దీని కోసం రూ.80 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు.
short by Devender Dapa / 02:46 pm on 23 Feb
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఫోన్‌ చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ఆయన ఆరా తీశారు. వీరిద్దరూ దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు తెలంగాణ సీఎంవో తెలిపింది. శనివారం టన్నెల్‌లోని 14వ కిలోమీటర్‌ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలడంతో 8 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు.
short by Srinu Muntha / 11:33 am on 23 Feb
OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్‌, అతడి భర్త ఆలివర్ ముల్హెరిన్ ఒక మగబిడ్డను తమ జీవితంలోకి స్వాగతించారు. బిడ్డ నెలలు నిండకుండానే జన్మించాడని, కొన్నాళ్లు ఆసుపత్రిలో గడుపుతాడని ఆల్ట్‌మాన్‌ అన్నారు. "చిన్నారి బాగానే ఉన్నాడు. అతడిని జాగ్రత్తగా చూసుకోవడం ఎనలేని ఆనందాన్ని ఇస్తోంది. నేను ఇంత ప్రేమను ఎప్పుడూ అనుభవించలేదు" అని ఆల్ట్‌మాన్‌ Xలో రాశారు. సత్యనాదెళ్ల సహా పలువురు ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.
short by / 12:08 pm on 23 Feb
పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి "క్లిష్టంగా" ఉందని వాటికన్ పేర్కొంది. "పోప్ ప్రమాదం నుంచి బయటపడలేదు" అని కూడా తెలిపింది. 88 ఏళ్ల పోప్‌కు సప్లిమెంటల్ ఆక్సిజన్ మరియు రక్త మార్పిడి అవసరమని వాటికన్ వివరించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన తర్వాత ఫిబ్రవరి 14న ఆయన ఆసుపత్రిలో చేరారు. రెండు ఊపిరితిత్తులలో న్యుమోనియా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
short by / 12:10 pm on 23 Feb
దిల్లీలోని అత్యంత ఖరీదైన ఇంటిని డీఎల్‌ఎఫ్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్ కుమార్తె, వ్యాపారవేత్త రేణుకా తల్వార్ సొంతం చేసుకున్నారు. దిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్‌లో ఉన్న ఈ ఇంటి ధర చదరపు మీటరుకు ₹8.8 లక్షలు. 4,925 చదరపు మీటర్లలో ఉన్న ఈ ఇంటిని రేణుకా తల్వార్ 2016లో ₹435 కోట్లకు కొనుగోలు చేశారు. రేణుక నికర ఆస్తుల విలువ ₹2,780 కోట్లు.
short by / 12:00 pm on 23 Feb
సాధారణ రైళ్ల మాదిరిగా కాకుండా, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ పుల్లింగ్ సౌకర్యం లేదు. దీనికి, బదులుగా అలారం మోగించే సౌకర్యం ఉంది. అయితే, ఈ సౌకర్యాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. ఒక ప్రయాణీకుడు అలారం మోగించిన వెంటనే, అతను నేరుగా లోకో పైలట్‌కు కనెక్ట్ చేయబడతాడు. అనంతరం సరైన కారణం వివరిస్తే రైలును ఆపుతారు.
short by / 12:02 pm on 23 Feb
చైనాలో ఒక రోడ్డు ప్రమాదంలో కలిసిన ఇద్దరు అపరిచితులు ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. 36ఏళ్ల లీ అనే వ్యక్తి నడుపుతున్న కారు సదరు యువతి ఇ-బైక్‌ను ఢీకొట్టింది. దాంతో ఆమె కాలర్ బోన్ విరిగిపోయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించిన లీ, ప్రతిరోజూ ఆమెను సందర్శించేవాడు. అతడి బాధ్యతాయుతమైన వ్యవహారశైలికి ముచ్చటపడిన యువతి, మూడు వారాల తర్వాత ఆ వ్యక్తికి ప్రపోజ్ చేసింది.
short by / 12:26 pm on 23 Feb
సొరకాయను తొక్కతో పాటు తినడం సురక్షితమే అని, అయితే కాయ తాజాగా ఉండాలని, దాన్ని బాగా ఉడికించాలని చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లోని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సీవీ ఐశ్వర్య తెలిపారు. "ఈ తొక్కలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులోని పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఒత్తిడి, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి" అని ఆమె చెప్పారు.
short by / 12:48 pm on 23 Feb
ఫిబ్రవరి 23న తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో బెంగళూరులోని అశోక్‌నగర్‌లోని గరుడ మాల్ సమీపంలో కాంగ్రెస్ నాయకుడు హైదర్ అలీని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. శనివారం రాత్రి (ఫిబ్రవరి 22) ఒక కార్యక్రమానికి హాజరైన తర్వాత అలీ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. మరో బైక్‌పై వారిని వెంబడించిన దుండగులు అలీపై మెరుపుదాడి చేసి, చంపి అక్కడి నుండి పారిపోయారు.
short by / 12:16 pm on 23 Feb
ABP న్యూస్ నివేదిక ప్రకారం, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ కోర్టులో విడాకుల విచారణ సందర్భంగా తాము 18 నెలలుగా విడివిడిగా జీవిస్తున్నామని చెప్పారు. విడాకులకు కారణం ఏంటని కోర్టు అడిగినప్పుడు, తమ మధ్య కొన్ని విషయాల్లో పొసగట్లేదని, సామరస్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిపారు. వీరిద్దరికీ విడాకులు ఖరారయ్యాయి.
short by / 12:21 pm on 23 Feb
థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో ఇద్దరు భారతీయ పర్యాటకులు ఇద్దరు థాయ్ మహిళలను వేధించినట్లు ఆరోపణలు రావడంతో భారతీయ పర్యాటకులకు స్థానికులకు మధ్య గొడవ జరిగింది. బీచ్ దగ్గర ఉన్నప్పుడు, ఇద్దరు భారతీయ పురుషులు తమ వద్దకు వచ్చి అనుమతి లేకుండా తమను రికార్డ్ చేయడం ప్రారంభించారని ఆ మహిళలు పేర్కొన్నారు. పోలీసులు ఇద్దరు పర్యాటకులను అరెస్టు చేసినట్లు సమాచారం.
short by / 12:32 pm on 23 Feb
Load More
For the best experience use inshorts app on your smartphone