For the best experience use Mini app app on your smartphone
మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో సంధ్య చౌదరి అనే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిని అభిషేక్‌ అనే వ్యక్తి పలుమార్లు గొంతు కోసి చంపిన వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంధ్య ఛాతిపై కూర్చుని కత్తితో గొంతు కోస్తుండగా, ఆసుపత్రి సిబ్బంది, ఇతర వ్యక్తులు పక్కనే నిలబడి చూస్తు ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో అభిషేక్‌ ఆమెను హత్య చేశాడని వార్తా కథనాలు తెలిపాయి.
short by Srinu / 12:45 pm on 01 Jul
ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా సెట్‌లోకి ఆయన సోదరుడు, నటుడు చిరంజీవి ఆకస్మికంగా వెళ్లారు. ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుండగా చిరంజీవి సర్‌ప్రైజ్‌ విజిట్‌ ఇచ్చారు. సోదరుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌కు జంటగా శ్రీలీల నటిస్తోంది.
short by / 11:44 am on 01 Jul
తాను ఇటీవల నటించిన కొన్ని సినిమాలు అభిమానులను సంతోష పెట్టలేకపోయాయంటూ నటుడు నితిన్‌ ‘తమ్ముడు’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో క్షమాపణలు చెప్పారు. ‘’ఇక నుంచి మంచి సినిమాలతోనే మీ ముందుకు వస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను,’’ అని అన్నారు. తనను ఇష్టపడే వాళ్ల కోసం, దర్శకుడు వేణు శ్రీరామ్‌ కోసం ‘తమ్ముడు’ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని నితిన్‌ తెలిపారు. ఈ చిత్రం జులై 4న విడుదల కానుంది.
short by srikrishna / 12:02 pm on 01 Jul
గుంటూరులో ప్రభుత్వాసుపత్రి వద్ద తన తల్లి నడిపే టిఫిన్‌ బండిని రోడ్డు విస్తరణ పేరిట తొలగించి, కాలువలో పడేశారని 8 ఏళ్ల యశ్వంత్‌ సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు. జీవనోపాధి పోవడంతో అమ్మ చనిపోదామని అంటోందని చెప్పాడు. తనకు గుండె జబ్బు ఉందని, చికిత్సకు కావాల్సిన డబ్బు కోసమే తనతల్లి కష్టపడుతోందని తెలిపాడు. కలెక్టర్‌ నాగలక్ష్మి స్పందించి జీజీహెచ్‌ ఎదుట టిఫిన్‌ బండి పెట్టుకోవడానికి స్థలం కేటాయించారు.
short by srikrishna / 11:30 am on 01 Jul
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో 35 ఏళ్ల వివాహితను ఆర్‌ఎంపీ వైద్యుడు మహేశ్‌ ఆదివారం తన కారులో ఎక్కించుకుని రేప్‌ చేసి, తర్వాత ఆమె చేతులకు గడ్డి మందు ఇంజెక్ట్‌ చేశాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున చనిపోయారు. మహేశ్‌ చేసిన ఘాతుకం గురించి ఆమె చనిపోయే ముందు వైద్యులకు వివరిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి మధ్య వివాహేతర బంధం ఉన్నట్లు సమాచారం.
short by srikrishna / 10:23 am on 01 Jul
సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం పరిశీలించి, అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. పాశమైలారంలోని సిగాచీ కెమికల్‌ పరిశ్రమలో సోమవారం రియాక్టర్‌ పేలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 37 మంది చనిపోయారు.
short by Srinu / 11:35 am on 01 Jul
వొడాఫోన్ ఐడియా (Vi) తన 5G సేవలను జైపూర్, కోల్‌కతా, లక్నోతో సహా మరో 23 నగరాలకు విస్తరించింది. దీంతో Vi భారత్‌ అంతటా తన తదుపరి తరం నెట్‌వర్క్ పరిధిని బలోపేతం చేయనుంది. ఈ కంపెనీ 4G పనితీరును కూడా పెంచడంతో పాటు త్వరలో 1 లక్ష కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. అర్హత కలిగిన వినియోగదారులకు రూ.299 నుంచి ప్రారంభమయ్యే ప్లాన్‌లపై అపరిమిత 5G డేటా అందించనుంది.
short by / 10:51 am on 01 Jul
సోమవారం యూరప్‌లోని చాలా ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలతో కూడిన వడగాలులు వీచాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, UKలో ఆయా ప్రభుత్వాలు వడగాలుల హెచ్చరికలు జారీ చేశాయి. ఉష్ణోగ్రతల పరంగా స్పెయిన్ (46°C), పోర్చుగల్ మోరా (46.6°C) జూన్ నెలలో కొత్త రికార్డులను సృష్టించాయి. ఇటలీ తమ దేశంలోని అనేక నగరాలకు రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. పోర్చుగల్ అధికారులు కూడా వడగాలుల హెచ్చరికను జారీ చేశారు.
short by / 10:56 am on 01 Jul
పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి జమ్మూ కశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థకు ఆధారమైన పర్యాటక రంగాన్ని నాశనం చేసేందుకు ఉద్దేశించిందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. "బాధితులను చంపే ముందు వారి మతాన్ని గుర్తించమని అడిగారు, ఇది స్పష్టంగా మత హింసను ప్రేరేపించే ప్రయత్నం" అని ఆయన అన్నారు. "మేం చాలా స్పష్టంగా ఉన్నాము, ఉగ్రవాదులకు శిక్ష నుంచి మినహాయింపు ఉండదు" అని చెప్పారు.
short by / 11:39 am on 01 Jul
భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని "అతి త్వరలో" ప్రకటించవచ్చని వైట్ హౌస్ కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఓవల్ కార్యాలయంలో వాణిజ్య బృందంతో కలిసి వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తున్నారని చెప్పారు. "ఆసియా పసిఫిక్‌లో భారత్‌ చాలా వ్యూహాత్మక మిత్రదేశంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ట్రంప్ చాలా మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నారు," అని పేర్కొన్నారు.
short by / 10:37 am on 01 Jul
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి విద్యాలక్ష్మి విద్యా రుణ పథకం కింద, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.10% వడ్డీ రేటుకు రుణం అందిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఈ రేటు 7.50%గా ఉంది. దీని కోసం, విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మెరిట్ ఆధారంగా ప్రవేశం పొందిన విద్యార్థులు దీనికి అర్హులు.
short by / 10:42 am on 01 Jul
సావన్ నెల ప్రారంభానికి ముందు, ఉపవాసంలో ఉపయోగించే రాక్‌ సాల్ట్‌, డ్రై ఫ్రూట్స్ ధరలు భారత్‌లోని హోల్‌సేల్ మార్కెట్లలో 20-25% పెరిగాయని న్యూస్ 18 కథనం పేర్కొంది. వాస్తవానికి, ఈ ఉత్పత్తులు ఇరాన్, ఇరాక్, గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అవుతాయి. అయితే, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలతో రాక్‌ సాల్ట్‌, డ్రై ఫ్రూట్స్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాటి ధరలు పెరిగాయి.
short by / 10:46 am on 01 Jul
కోల్‌కతాలో లా కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ముందస్తు ప్రణాళికతో జరిగిందని సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది. "ఈ మొత్తం విషయం ముందస్తుగానే ప్లాన్ చేశారు. బాధితురాలిని రేప్‌ చేయడానికి ఈ ముగ్గురూ చాలా రోజులుగా కుట్ర పన్నారు," అని అధికారి తెలిపారు. బాధితురాలు అడ్మిషన్ పొందిన తొలి రోజు నుంచే ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా ఆమెను టార్గెట్‌ చేసుకున్నాడని అన్నారు.
short by / 11:03 am on 01 Jul
భారత్‌తో చాలా క్లిష్టమైన వాణిజ్య చర్చల్లో అమెరికా పాల్గొంటుందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆయన వివరించారు. "వాణిజ్యంలో, కొంత ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుందని మేము భావిస్తున్నాము" అని ఆయన అన్నారు. రాబోయే కొద్ది రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుందని చెప్పారు. భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు గత 25 ఏళ్లలో భారీగా పెరిగాయని జైశంకర్‌ అభిప్రాయపడ్డారు.
short by / 11:05 am on 01 Jul
30 సంవత్సరాల వయసు దాటిన వారు ఖర్జూర తినడం అవసరమని దాని ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని డైటీషియన్ దీప్శిఖా శర్మ చెప్పారు. ''30 ఏళ్లు దాటాక శరీరంలో అనేక హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. జీవక్రియ వేగం తగ్గుతుంది. ఎముకల్లో బలం వంటి అవసరాలు పెరుగుతాయి. అలాంటి పరిస్థితిలో, ఖర్జూరాలను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో పాటు ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి,'' అని ఆమె తెలిపారు.
short by / 11:12 am on 01 Jul
జూలై 1 నుంచి ప్రయాణికుల ఛార్జీలు పెంచుతున్నట్లు భారత రైల్వే సోమవారం ప్రకటించింది. జూలై 1 లేదా ఆ తర్వాత బుక్ చేసుకున్న టిక్కెట్లపై ఈ ఛార్జీల పెంపు వర్తిస్తుందని తెలిపింది. జూన్ 30 వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై ఎలాంటి అదనపు చెల్లింపు చేయనవసరం లేదని పేర్కొంది. నాన్‌ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల ఛార్జీలను పెంచుతూ రైల్వే ఆదివారం సర్క్యూలర్‌ జారీ చేసింది.
short by / 10:32 am on 01 Jul
తమ ప్రభుత్వం ఏర్పడితే బిహార్ పూర్తిగా రూపాంతరం చెందుతుందని, ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని స్కాట్లాండ్ లాగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. బిహార్‌ ప్రతిపక్ష మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని తేజస్వి ప్రకటించారు. రాష్ట్రంలో కుల, మత రాజకీయాలను తాను అనుమతించబోనని చెప్పారు.
short by / 10:55 am on 01 Jul
11 బ్యాంకుల్లోని 5208 బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్(PO), 1000 కి పైగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో 20-30 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. ప్రభుత్వ నిబంధల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఔత్సాహిక అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.in లో ద్వారా జూలై 21 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్‌ను ఆగస్టులో నిర్వహిస్తారు.
short by / 11:50 am on 01 Jul
తమిళనాడు శివకాశిలోని ఒక బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం జరిగిన భారీ పేలుడులో నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంతో యూనిట్‌ ఆవరణలోని బాణసంచా పేలుతూనే ఉండటంతో ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు కూడా పైకి లేచాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
short by / 11:52 am on 01 Jul
భారత్‌లో ప్రతిష్టాత్మకమైన తీర్థయాత్ర అయిన అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏటా అనేక మంది భక్తులు జమ్మూ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ ఆలయంలో సహజంగా ఉద్భవించిన మంచు శివలింగాన్ని పూజించి, శివుని ఆశీర్వాదం పొందడానికి ఈ ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు. జమ్మూ కశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే భద్రతను పటిష్ఠం చేసింది.
short by / 12:28 pm on 01 Jul
ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత AI అందించే లక్ష్యంతో మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌ను (MSL) ప్రకటించారు. ఇది మనుషుల మాదిరిగా లేదా వారికంటే మెరుగ్గా పనిచేయగల AIని సృష్టిస్తుందని ఆయన చెప్పారు. "మా అన్ని ఉత్పత్తుల నెక్స్ట్‌ జనరేషన్‌ అభివృద్ధిపై ఈ ల్యాబ్‌ దృష్టి సారిస్తుంది" అని చెప్పారు. ఈ బృందానికి స్కేల్ AI మాజీ CEO అలెగ్జాండర్ వాంగ్ నాయకత్వం వహిస్తారు.
short by / 12:43 pm on 01 Jul
పంజాబ్ ఫిరోజ్‌పూర్‌లో తల్లీ కొడుకులు భారత వైమానిక దళానికి చెందిన భూమిని అమ్మేసిన కేసు వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలు, రెవెన్యూ శాఖ అధికారుల సహాయంతో వారిద్దరూ 1997లో ఈ భూమిని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 28 ఏళ్ల అనంతరం దీనిని గుర్తించిన అధికారులు, నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై పంజాబ్, హర్యానా హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.
short by / 11:16 am on 01 Jul
దేశవ్యాప్తంగా వాణిజ్య LPG సిలిండర్ల ధర మంగళవారం (జూలై 1) నుంచి సుమారు రూ.60 తగ్గింది. కొత్త రేటు ప్రకారం, నేటి నుంచి 19 కిలోల LPG సిలిండర్ దిల్లీలో రూ.1665కు, ముంబైలో రూ.1616కు, కోల్‌కతాలో రూ.1769కు, చెన్నైలో రూ.1823కు లభిస్తుంది. వాణిజ్య సిలిండర్ల ధర తగ్గించడం ఈ ఏడాదిలో ఇది వరుసగా 4వసారి.
short by / 10:20 am on 01 Jul
జనవరి 1, 2026 నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసి, కార్యకలాపాలు ప్రారంభించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన అమరావతి క్వాంటం వ్యాలీ వర్క్‌షాప్‌లో ఆయన ఈ విషయం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, TCS, L&T సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి క్వాంటం కంప్యూటింగ్‌లోని ప్రముఖ నిపుణులు, సంస్థలు హాజరయ్యారు.
short by / 11:31 am on 01 Jul
కర్ణాటకలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సహా బెంగళూరు, హుబ్బళ్లి, బెలగావి విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామని ఆదివారం ఉదయం ఈ మెయిల్స్‌ వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా చర్యలను పటిష్ఠం చేశారు. ప్రయాణికులు, సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
short by / 12:18 pm on 01 Jul
Load More
For the best experience use inshorts app on your smartphone