For the best experience use Mini app app on your smartphone
సినీ నటి రాగిణి ద్వివేది ఒక అభిమానిని చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. బెంగళూరులో నిర్వహించిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఫొటోల కోసం ఫ్యాన్స్‌ తనను చుట్టుముట్టిన సమయంలో, తన చేతిని సదరు వ్యక్తి పట్టుకుని గట్టిగా లాగాడని ఆమె తెలిపారు. అందుకే అతడిని చెంపదెబ్బ కొట్టాడని చెప్పారు. 'జెండా పై కపిరాజు' చిత్రంతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో రాగిణి హీరోయిన్‌గా నటించారు.
short by srikrishna / 01:57 pm on 12 Mar
తన తల్లిని అరెస్ట్‌ చేయాలంటూ ఓ నాలుగేళ్ల బాలుడు 911కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమెరికాలోని విస్కాన్సిన్‌ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. కాసేపటికి అతడి తల్లి ఫోన్‌ లాక్కొని, ‘’నేను తన ఐస్‌క్రీమ్‌ తిన్నాను, అందుకే 911 కి ఫోన్ చేసి ఉంటాడు,” అని చెప్పింది. తర్వాత వాళ్ల ఇంటికి ఇద్దరు మహిళా పోలీసులు వెళ్లి ఆ బాలుడితో ముచ్చటించారు. మర్నాడు ఆ పోలీసులు ఐస్‌క్రీమ్‌ కొని ఆ బాలుడికి తెచ్చి ఇచ్చారు.
short by srikrishna / 12:01 pm on 12 Mar
ఇంగ్లాండ్‌లో లారా అనే 22 ఏళ్ల విద్యార్థిని తన శీలాన్ని ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టింది. ఒక హాలీవుడ్ స్టార్ రూ.18 కోట్లు చెల్లించి ఆమె కన్యత్వాన్ని దక్కించుకున్నారు. దీనిపై లారా మాట్లాడుతూ, “చాలా మంది అమ్మాయిలు ప్రతిఫలంగా ఏమీ పొందకుండానే కన్యత్వాన్ని కోల్పోతారు. కానీ, నాకు దీనివల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది,’’ అని చెప్పారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు సహా చాలా మంది ప్రముఖులు ఈ వేలంలో పోటీ పడ్డారు.
short by srikrishna / 12:28 pm on 12 Mar
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. 260 మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తితో తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించిందన్నారు. అయితే గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ హల్చల్ సృష్టించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు రూ. 500 బోనస్, కృష్ణా జలాల అంశాలపై ప్రభుత్వ వైఖరిపై వారు నిరసన వ్యక్తం చేశారు.
short by / 01:17 pm on 12 Mar
మహిళా జర్నలిస్టు రేవతిని అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఉదయం 5 గంటలకు రేవతి ఇంటిపై దాడి చేసి ఆమెతో పాటు కుటుంబసభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని కేటీఆర్‌ మండిపడ్డారు. రైతు బంధు రావట్లేదని ఓ రైతు మాట్లాడిన వీడియోను ప్రసారం చేసినందుకు పెట్టిన కేసులో జర్నలిస్ట్ రేవతిని పోలీసులు అరెస్ట్‌ చేశారని సమాచారం.
short by / 01:13 pm on 12 Mar
తెలంగాణ గ్రూప్2 పరీక్షల మహిళా విభాగంలో బాయికాడి సుస్మిత రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకును సాధించి పావన్నపేట జిల్లా, అబ్లాపూర్ గ్రామానికి గర్వకారణం అయ్యారు. 406.5 మార్కులతో సుస్మిత ఈ ఘనత సాధించారు. ఆర్థిక కష్టాలు, కుటుంబ బాధ్యతలు, మరియు నిత్య జీవన చిక్కుల మధ్య ఆమె పోటీ పరీక్షల్లో సాధించిన విజయం మరెంతో ప్రత్యేకమని గ్రామస్థులు తెలిపారు. ఈ విజయం వెనుక భర్త శ్రీనివాస్ సహకారం అపారమని ఆమె పేర్కొన్నారు.
short by / 12:15 pm on 12 Mar
కొన్నాళ్ల క్రితం వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది హీరోయిన్ శ్రీలీల. దమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుని.. ఆ తర్వాత దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో థియేటర్లలో సందడి చేసింది. కానీ ఈ బ్యూటీ ఖాతాలో ప్లాపులు రావడంతో నెమ్మదిగా సినిమాలు తగ్గించింది. ఇప్పుడు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది ఈ అమ్మడు.
short by / 01:43 pm on 12 Mar
సినీ నటి సౌందర్యను నటుడు మోహన్‌బాబు హత్య చేయించారంటూ ఖమ్మం కలెక్టర్‌కు, ఖమ్మం రూరల్ పోలీసులకు చిట్టిమల్లు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. శంషాబాద్ పరిధి జల్‌పల్లిలోని 6 ఎకరాల భూమిని తనకు అమ్మడానికి సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్‌ నిరాకరించడంతో మోహన్‌బాబు వారిని హెలికాప్టర్ ప్రమాదం రూపంలో చంపించారని అతను ఆరోపించాడు. జల్‌పల్లిలోని ఆ భూమిని ఆయన అక్రమంగా అనుభవిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు.
short by Bikshapathi Macherla / 02:59 pm on 12 Mar
ప్రముఖ సినీ దర్శకుడు శంకర్‌కు మద్రాస్ హైకోర్టు కీలక ఉపశమనం కల్పించింది. ‘ఎంథిరన్’(‘రోబో’) సినిమాకు సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణలతో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయన ఆస్తులను స్తంభింపజేయాలని తీసుకున్న నిర్ణయంపై కోర్టు స్టే విధించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు,ఈ విషయానికి సంబంధించిన ప్రైవేట్ ఫిర్యాదుపై ఇప్పటికే స్టే విధించింది. శంకర్ ఆస్తిని స్తంభింపజేయడం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది.
short by / 12:23 pm on 12 Mar
ప్రకృతిలో అనేక ఆసక్తికరమైన జీవులు ఉన్నాయి. కొన్ని జీవులు తమ పిల్లలను నోటిలో జన్మనివ్వడం వల్ల ప్రత్యేకమైన జీవన విధానాన్ని ప్రదర్శిస్తాయి. ఇలాంటి జీవులు ఎలా జననం చేస్తాయో తెలుసుకోవడం ఒక గొప్ప ఆసక్తికర విషయం. కొన్ని రకాల చేపలు నోటి ద్వారా డెలివరీ చేయడం వల్ల విశేషమైన ప్రాథమిక మార్గాన్ని అనుసరిస్తాయి.
short by / 12:17 pm on 12 Mar
వేసవిలో బయటకు వెళ్లినవారు ఎండవేడి, ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు కూల్‌డ్రింక్స్‌, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, చెరుకు రసం, జ్యూసులు వంటి పానీయాలను తాగుతున్నారు. అయితే చాలా మంది కొబ్బరి నీళ్లు, చెరకు రసం ఏది మంచిదని ఆలోచిస్తుంటారు. మరి ఈ రెండింటిలో బెస్ట్​ డ్రింక్ ఏంటి​? బాడీని హైడ్రేట్​గా ఉంచడంలో ఏ డ్రింక్​ ఉపయోగపడుతుంది? అనే డౌట్స్​ వస్తాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
short by / 11:54 am on 12 Mar
పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. తాజాగా సోమవారం అతడి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు వైద్యులు.
short by / 01:19 pm on 12 Mar
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిన పంజాబ్ కింగ్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్, జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌కు ఓ వీడియో సందేశం పంపించాడు. ఈ సందేశంలో, ఓపెనింగ్ స్లాట్ కోసం తనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ చాహల్, తన కోచ్‌తో ముచ్చటించాడు. పంజాబ్ కింగ్స్ జట్టులో కొత్తగా చేరిన చాహల్, తన క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ సీజన్‌లో ఒక మంచి అవకాశం కోరుతున్నాడు.
short by / 12:30 pm on 12 Mar
పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్‌కు గురైన తరువాత అనూహ్య పరిణామాలు ఏర్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సైన్యం మొత్తాన్నీ ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. హైఅలర్ట్ ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయాయి. 500 మంది ప్రయాణికులు, ఆర్మీ సైనికులతో కూడిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసిన విషయం తెలిసిందే.
short by / 12:02 pm on 12 Mar
YSP సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అతడిని NTR జిల్లా జగ్గయ్యపేట పోలీసులు పీటీ వారెంట్‌పై మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. YSR జిల్లా పులివెందులకు చెందిన రవీందర్‌రెడ్డి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టారనే ఫిర్యాదుల మేరకు అతనిపై పలు కేసులు నమోదయ్యాయి.
short by / 02:38 pm on 12 Mar
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభం కాగా, వీటిని ఈ నెల 27 వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్‌, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 19న తెలంగాణ బడ్జెట్‌ను ప్రభుత్వం సమర్పించనుంది. 21-26వ తేదీ వరకు పద్దులపై చర్చ ఉండనుంది.
short by srikrishna / 02:56 pm on 12 Mar
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై హుజూరాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని, ఇలాంటి అసత్య ప్రచారాన్ని BRS పార్టీ కార్యకర్తలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీపై పూర్తి నమ్మకంతో ఉన్నానని, పార్టీకి నష్టం కలిగే పనులు చేయనని తెలిపారు. సదరు యూట్యూబ్ ఛానల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
short by / 02:43 pm on 12 Mar
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత.. వెంటనే సభ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సభను ఎంతకాలం నిర్వహించాలనేది బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు
short by / 12:20 pm on 12 Mar
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీసులు బుధవారం ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో 41ఏ నోటీసులు ఇచ్చారు. ఆర్వోపై దురుసుగా ప్రవర్తించిన కేసులో ఇవాళ విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌ 24న యర్రగొండపాలెం రిటర్నింగ్‌ అధికారి శ్రీలేఖను నామినేషన్‌ కేంద్రంలో బెదిరించారనే ఆరోపణలతో చెవిరెడ్డిపై అప్పట్లో కేసు నమోదైంది.
short by srikrishna / 01:04 pm on 12 Mar
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉష వాన్స్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెలలోనే వాన్స్‌ భారత్‌లో పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో పర్యటించిన వాన్స్, తన రెండో అంతర్జాతీయ పర్యటనగా భారత్‌ను ఎంచుకున్నారు. జేడీ వాన్స్ భార్య ఉష భారతీయ మూలాలు కలిగిన మహిళ. ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్‌కు చెందినది కాగా, ఏళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు.
short by / 12:47 pm on 12 Mar
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, 124 బ్యాంక్ ఖాతాలను అధికారులు సీజ్ చేయనున్నారు. గత ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో తీవ్ర అల్లర్లు చెలరేగి, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్‌కు వచ్చి తలదాచుకున్నారు.
short by / 12:36 pm on 12 Mar
చిత్తూరులోని గాంధీరోడ్డులో కాల్పులు కలకలం చెలరేగింది. లక్ష్మీ సినిమా హాల్‌ సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. తుపాకులతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంటి ఓనర్ అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకున్నారు.
short by / 12:43 pm on 12 Mar
గుండె సంబంధిత సమస్యలతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖడ్‌ బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉపాధ్యక్షుడు వైద్య చికిత్సకు బాగా స్పందించారని, సంతృప్తికర స్థాయిలో కోలుకున్నట్లు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. రాబోయే కొన్ని రోజులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని ధన్‌ఖఢ్‌కు సూచించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
short by / 02:39 pm on 12 Mar
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హాస్టల్ మెస్‌లో వడ్డించిన కూరలో రేజర్ బ్లేడ్ కనిపించిందంటూ మంగళవారం రాత్రి విద్యార్థులు నిరసన తెలిపారు. ఆర్ట్స్ కళాశాల భవనం సమీపంలోని ప్రధాన రహదారిపై విద్యార్థులు కర్రీ పాత్రను, అన్నం, గ్రేవీతో కూడిన ప్లేట్‌ను ఉంచి ధర్నా చేశారు. వైస్ ఛాన్సలర్ జోక్యం చేసుకుని, ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. గతంలోనూ భోజనంలో పురుగులు, గాజు ముక్కలు వచ్చాయని వారు తెలిపారు.
short by / 02:08 pm on 12 Mar
వన్డే బ్యాటర్ల తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని అధిగమించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో 76(83) పరుగులు చేసిన రోహిత్ రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌లో 1(2)కి ఔటైన కోహ్లీ ఒక స్థానం పడిపోయి ఐదో స్థానానికి చేరాడు. శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
short by / 03:07 pm on 12 Mar
Load More
For the best experience use inshorts app on your smartphone