For the best experience use Mini app app on your smartphone
ముంబయిలోని సల్మాన్‌ఖాన్ ఇంటి బయట ఇటీవల జరిగిన కాల్పుల ఘటనతో సంబంధమున్న పంజాబ్‌కు చెందిన సోను సుభాష్ చందర్, అనుజ్ థాపన్ అనే ఇద్దరిని ముంబయి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరికి బిష్ణోయ్ గ్యాంగ్‌తో పరిచయం ఉంది. వీరే ఈ కేసులో ఇద్దరు నిందితులకు తుపాకీలను సరఫరా చేశారు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌లను ఈ కేసులో వాంటెడ్‌గా పోలీసులు ప్రకటించారు.
short by Sri Krishna / 08:31 pm on 25 Apr
లైంగిక దాడి ఆరోపణలతో హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్‌కు 2020లో విధించిన శిక్షను న్యూయార్క్ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తోసిపుచ్చింది. #మీటూ విచారణలో వెయిన్‌స్టీన్‌పై దురభిప్రాయంతో న్యాయమూర్తి ఘోరమైన తీర్పులు ఇచ్చారని కోర్టు పేర్కొంది. కేసులో భాగం కాని ఆరోపణలపై మహిళల నుంచి సాక్ష్యం తీసుకున్నారని చెప్పింది. "కొత్తగా విచారణ చేపట్టడమే ఈ ఘోరమైన లోపాలకు పరిష్కారం,” అని కోర్టు పేర్కొంది.
short by Sri Krishna / 07:58 pm on 25 Apr
2 వేల కుటుంబాలు కలిగిన ఆస్పరిలో గత మూడు నెలలుగా నీటి సమస్య తీవ్రమైందని, 20 రోజులకు ఒకసారి మాత్రమే కుళాయిలకు నీరు సరఫరా చేస్తున్నారని రిపోర్ట్‌లు తెలిపాయి. దీంతో కొందరు ఎద్దుల బండ్లు, బైక్‌, సైకిల్‌, ఆటోలతో స్థానిక గాంధీ పార్కు వద్ద గల గుమ్మిల దగ్గరకు వెళ్లి నీటిని తెచ్చుకుంటుండగా, మరికొందరు నీటి కోసం ఒక్కో బిందెకు రూ.7, ట్యాంకర్‌కు రూ.800 చొప్పున ఖర్చు చేస్తున్నారని ఆ కథనాలు వెల్లడించాయి.
short by M Srinu / 04:43 pm on 25 Apr
కర్నూలు జిల్లాలో మలేరియా కేసులు క్రమేణా తగ్గుతున్నాయని డీఎంహెచ్‌వో ప్రవీణ్‌ కుమార్‌ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1,32,943 మంది శాంపిల్స్‌ను సేకరించి మలేరియా పరీక్షలు చేయగా, అందులో దేవనకొండ మండలం కోటకొండలోని ఓ వ్యక్తికి మాత్రమే వ్యాధి నిర్దారణ అయిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే-డ్రైడే’ నిర్వహిస్తున్నామని జిల్లా మలేరియా నివారణ అధికారి నూకరాజు చెప్పారు.
short by M Srinu / 02:27 pm on 25 Apr
కుళాయిలకు సరిపడా నీరందక హొళగుంద వాసులు ఎడ్ల బండి, బైక్‌ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో కడ్లెమాగి ఎస్‌ఎస్‌ ట్యాంకుకు నీరందడం లేదని, దీంతో బీసీ కాలనీ, కోటవీధి తదితర కాలనీలకు వారానికి ఒకసారి మాత్రమే నీళ్లొస్తున్నాయని ‘ఈనాడు’ కథనం తెలిపింది. దీంతో వారికి ఎంపీడీవో కార్యాలయం వద్ద గల సంపు నీరే ఆధారమయ్యాయని ఆ కథనం పేర్కొంది.
short by M Srinu / 12:32 pm on 25 Apr
వెల్దుర్తి సమీపంలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై బైక్‌ను తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టడంతో నరేష్‌ అనే 37ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. నరేష్‌ తన స్నేహితుడు రామాంజనేయులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన రామాంజనేయులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు నరేష్‌ విలేకరిగా పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు.
short by M Srinu / 01:59 pm on 25 Apr
కౌతాళం మండలం కుంటనహాల్‌ గ్రామంలో శేకన్‌ అనే 32ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నందవరం మండలం కనకవీడుకు చెందిన శేకన్‌, కుంటనహాల్‌కు చెందిన ఇలియాసాబ్‌కు 13ఏళ్ల క్రితం వివాహమైంది. శేకన్‌ తరచూ తన పుట్టింటికి వెళ్తుండటంతో, ఈ విషయంపై భర్త ఆమెతో ఘర్షణ పడ్డాడు. ఆ మనస్తాపంతో మంగళవారం రాత్రి అందరూ నిద్రపోయాక ఆమె ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకుని చనిపోయింది.
short by M Srinu / 03:04 pm on 25 Apr
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది మండలంలో గురువారం అత్యధికంగా 44.2°C ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బనగానపల్లి, డోన్‌లో 44.1°C, కోడుమూరు 43.9°C, కర్నూలులో 43.1°C చొప్పున ఎండలు నమోదయ్యాయని చెప్పారు. రానున్న 2, 3 రోజుల్లో జిల్లాలో ఉష్ణోగ్రతలు 46°C-47°C మధ్య నమోదు కావచ్చని, మంత్రాలయం, కోడుమూరు, గూడూరు, దేవనకొండ, డోన్, చాగలమర్రి మండలాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.
short by M Srinu / 08:05 pm on 25 Apr
గడివేముల మండలం దుర్వేసి గ్రామ సమీపంలో గురువారం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.41 వేల నగదు, 8 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని గడివేముల ఎస్సై వెంకటసుబ్బయ్య తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను సదరు నిందితులపై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.
short by M Srinu / 03:57 pm on 25 Apr
కోడుమూరు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) స్టేషన్ పరిధిలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వాహనాలను ఆ శాఖ అధికారులు గురువారం వేలం వేశారు. మొత్తం 3 మోటార్ సైకిళ్లు, 5 మోపెడ్ వాహనాలను వేలం వేయగా రూ.33,158 ఆదాయం సమకూరిందని సెబ్‌ సీఐ రామాంజనేయులు తెలిపారు. అనంతరం అవసరమైన వాహనాల పత్రాలను కొనుగోలుదారులకు అందజేశామని ఆయన చెప్పారు.
short by M Srinu / 06:47 pm on 25 Apr
కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఎన్నికల జనరల్‌ పరిశీలకులను కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవతేజ కలిశారు. కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ పీసీ జాఫర్, పత్తికొండ, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల సాధారణ పరిశీలకుడు మీర్ తారీఖ్ అలీని ఆయన మర్యాద పూర్వకంగా కలిసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకుందామని తెలిపారు.
short by M Srinu / 03:43 pm on 25 Apr
కర్నూలు పార్లమెంట్‌తో పాటు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ నెల 18 నుంచి జరిగిన ఈ ప్రక్రియలో 196 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు దాఖలు చేశారు. కర్నూలు అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 46 మంది, మంత్రాలయం నియోజకవర్గానికి అత్యల్పంగా 13 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. శుక్రవారం నుంచి నామపత్రాల స్క్రూటినీ ప్రక్రియ ప్రారంభమవుతోందని కలెక్టర్ సృజన తెలిపారు.
short by M Srinu / 10:23 pm on 25 Apr
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటలతో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఉంది.
short by Sri Krishna / 04:08 pm on 25 Apr
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని 9వ వార్డు మరాఠి గేరి కౌన్సిలర్ పద్మ గురువారం వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. అనంతరం పలువురు నాయకుల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేస్తానని పద్మ చెప్పారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు.
short by M Srinu / 10:18 pm on 25 Apr
మాజీ డిప్యూటీ సీఎం కుమారుడు, పత్తికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆయనకు చరాస్తులు రూ.3.23కోట్లు, కృష్ణగిరి, కంబాలపాడు గ్రామాల్లో 12.33 ఎకరాల పొలం, రూ.1.19 కోట్ల అప్పు ఉండగా, సొంత ఇల్లు లేనట్లు చూపారు. కాగా, ఆయన భార్య పేరిట చరాస్తులు రూ.1.32 కోట్లు, స్థిరాస్తి రూ.5.54కోట్లు, 46.58 తులాల బంగారు, 16.50 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి.
short by M Srinu / 12:02 pm on 25 Apr
టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు పులివర్తి నాని (టీడీపీ), చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి (వైసీపీ) నామినేషన్‌ వేసేందుకు తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్దకు గురువారం ఒకేసారి చేరుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
short by Sri Krishna / 03:46 pm on 25 Apr
నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దాని ప్రకారం, మే 2న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 2 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్‌ 5న ఫలితాలను ఈసీ వెల్లడించనుంది
short by Sri Krishna / 04:41 pm on 25 Apr
పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ చీఫ్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం నామినేషన్‌ వేశారు. ఆయన వెంట కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఉన్నారు. అంతకు ముందు పులివెందులలోని సీఎస్‌ఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగించారు. 2014, 2019 ఎన్నికల్లోనూ ఆయన పులివెందుల నుంచి పోటీ చేశారు. మరోవైపు, ఈ స్థానంలో టీడీపీ తరఫున బీటెక్ రవి పోటీ చేస్తున్నారు.
short by Sri Krishna / 12:51 pm on 25 Apr
కర్నూలు జిల్లాలోని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి బుధవారం మొత్తం 62 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కర్నూలు పార్లమెంట్‌ స్థానానికి 14, అసెంబ్లీ నియోజకవర్గాలకు 48 చొప్పున నామపత్రాలు వేశారు. కర్నూలు లోక్‌సభ సెగ్మెంట్‌ కోసం వైసీపీ అభ్యర్థి రామయ్య, అసెంబ్లీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి గౌరు చరిత, దస్తగిరి, కేఈ శ్యాంబాబు, రాఘవేంద్ర రెడ్డి, వీరభద్ర గౌడ్‌, వైసీపీ నుంచి ఇంతియాజ్‌ నామినేషన్‌ వేశారు.
short by M Srinu / 01:04 pm on 25 Apr
ప్రజలను రెచ్చగొట్టి నియోజకవర్గంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని ఎవరైనా పాడు చేస్తే ఊరుకునేది లేదని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి అన్నారు. ‘’మంచిగా మాట్లాడితే నాలుగు ఓట్లు పడతాయి. అంతే గానీ మతాల గురించి మాట్లాడితే ప్రజలే సరైన గుణపాఠం చెబుతారు. నువ్వు డెంటల్‌ డాక్టర్‌ కాదు, మెంటల్‌ డాక్టర్‌వి,’’ అని సాయిప్రసాద్‌ రెడ్డి ఆదోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
short by M Srinu / 05:58 pm on 25 Apr
టీడీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీజీ భరత్‌ గురువారం నామపత్రం దాఖలు చేశారు. ఈ మేరకు నామినేషన్‌ పత్రాన్ని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి భార్గవతేజకు అందజేశారు. అంతకుముందు భరత్‌ కర్నూలు పెద్ద మార్కెట్‌ నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు తన తండ్రి, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌తో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సుమారు 30వేల మందికి పైగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నాయి.
short by M Srinu / 07:27 pm on 25 Apr
రాజ్యాంగం కల్పించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఆరోపించారు. దీని కోసమే ఆ పార్టీ 400 ఎంపీ సీట్లు కావాలని అంటోందన్నారు. ‘’ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించి 2025 నాటికి వందేళ్లు పూర్తి కాబోతుంది. ఈలోపు రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోంది,’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాన్ని బీజేపీ అమలు చేస్తోందని విమర్శించారు.
short by Sri Krishna / 02:36 pm on 25 Apr
పీఎం నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై ఈసీఐ విచారణ చేపట్టింది. మతం, కులం, లేదా భాష ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు లేవనెత్తాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు వివరణ ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ఈసీ ఆదేశించింది.
short by Sri Krishna / 01:30 pm on 25 Apr
మణిపుర్‌లో హింస, కెనడాలో ఖలిస్థానీ హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య, బుల్‌డోజర్ చర్యని ప్రస్తావిస్తూ భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయంటూ అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన నివేదికపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘’ఈ నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడుకున్నది. భారత్‌ పట్ల అవగాహన లేమిని ఇది ప్రతిబింబిస్తుంది. మేము దీనికి ఎటువంటి విలువ ఇవ్వం. మీరు కూడా అలాగే పరిగణించండి,’’ అని తెలిపింది.
short by Sri Krishna / 07:00 pm on 25 Apr
గతేడాది మార్చిలో నిరసన సందర్భంగా లండన్‌లోని భారత హైకమిషన్‌పై దాడికి పాల్పడిన కేసులో యూకేకు చెందిన ఒక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. సదరు నిందితుడిని ఇంద్రపాల్ సింగ్ గాబాగా గుర్తించారు. ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్‌పై చర్యకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు తేలింది.
short by M Srinu / 11:06 pm on 25 Apr
Load More
For the best experience use inshorts app on your smartphone