For the best experience use Mini app app on your smartphone
ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆదివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంట్రల్‌లో పలువురు మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్, కేబినెట్ భేటీపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వాన కాలం పంటల సాగు సన్నద్ధత, రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై చర్చించారు. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా లబ్ది చేరకూడదని సీఎం అన్నారు.
short by Devender Dapa / 11:15 pm on 01 Jun
IPL చరిత్రలో ఒకే సీజన్‌లో ఒక జట్టు క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2 రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయిన సందర్భాలు మూడు ఉన్నాయి. 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్), 2016లో గుజరాత్ లయన్స్, 2021లో మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ ఇలాంటి ఫలితాలనే అందుకున్నాయి. ఇక ఐపీఎల్ 2025 క్వాలిఫయర్‌ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్, క్వాలిఫయర్‌ 2లో ముంబై ఇండియన్స్‌తో తలపడుతోంది.
short by Devender Dapa / 10:45 pm on 01 Jun
కర్ణాటకలోని బెళగావిలో 15 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల ప్రకారం, గతేడాది డిసెంబర్‌లో ఆమె ప్రియుడు బాలికను కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతడితో పాటు మరో ఐదుగురు అత్యాచారానికి ఒడిగట్టి, ఈ దుశ్చర్యను ఫోన్‌లో రికార్డు చేశారు. ఆ వీడియోతో బెదిరించి మరోసారి దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
short by Devender Dapa / 10:49 pm on 01 Jun
నంద్యాల జిల్లా నందికొట్కూరులో జాతీయ రహదారిపై టిప్పర్ అదుపుతప్పి ద్విచక్రవాహనంపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఎల్లా గౌడ్, రెహమాన్‌లకు తీవ్రగాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కమెరాలో రికార్డు అయ్యాయి. వేగంగా వచ్చిన టిప్పర్, అదుపుతప్పి డివైడర్‌ను దాటి బైక్‌ను ఢీకొట్టినట్లు కనిపించింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న గొయ్యిలో పడిపోయింది. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.
short by Devender Dapa / 11:03 pm on 01 Jun
భద్రాద్రి రామాలయం ప్రాంగణంలోని శేష వస్త్రాల విక్రయ దుకాణంలో అన్యమత ప్రచార స్లోగన్‌లు ఉన్న బ్యాగ్‌లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు చెందిన కొందరు భక్తులు, ఈ షాపులో రెండు చీరలను కొనుగోలు చేశారు. అయితే షాపు నిర్వహకులు ఇచ్చిన సంచులపై అన్యమత ప్రచార స్లోగన్‌ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై తాము ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు భక్తులు తెలిపారు. వెంటనే వాటిని అక్కడి నుంచి తీసేసినట్టు సమాచారం.
short by Devender Dapa / 11:25 pm on 01 Jun
దిల్లీలో తీవ్రమైన దుమ్ము తుపానుతో రాయ్‌పూర్‌ నుంచి దిల్లీకి రావాల్సిన ఇండిగో విమానం అల్లకల్లోలంగా మారింది. దీనికి సంబంధించి విమానం లోపల ఉన్న ఒక ప్రయాణికుడు రికార్డ్ చేసిన వీడియో ఆన్‌లైన్‌లో బయటికి వచ్చింది. దిల్లీ విమానాశ్రయంలో దిగబోతుండగా దుమ్ము తుపాను వల్ల విమానాన్ని పైలట్ మళ్లీ పైకి తీసుకెళ్లాడని నివేదికలు తెలిపాయి. గాలిలో పలుమార్లు చక్కర్లు కొట్టిన అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
short by / 11:57 pm on 01 Jun
చప్పట్లు కొడితే వచ్చే శబ్దం అరచేతులు ఢీకొనడం వల్ల కాదని, వాటి మధ్య చిక్కుకున్న గాలి వేగంగా విడుదల కావడం వల్ల వస్తుందని 'ఫిజికల్ రివ్యూ రీసెర్చ్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది. చేతుల మధ్యలోని గాలి, బొటనవేలు, చూపుడు వేలు మధ్య ఉన్న ఇరుకైన స్థలం గుండా బయటకు వెళ్లి కంపిస్తుందని వెల్లడించింది. చప్పట్లు కొట్టే శబ్దం ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది.
short by / 12:46 am on 02 Jun
బోయింగ్ 777 విమానాలకు నిర్వహణ సేవలు అందించే టర్కీ సంస్థ టర్కిష్ టెక్నిక్‌తో తమ లావాదేవీలను ముగించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించిందని ఎయిర్‌ ఇండియా CEO కాంప్‌బెల్‌ విల్సన్‌ అన్నారు. దీనిపై "మేం టర్కిష్‌ టెక్నిక్‌కు ప్రత్యామ్నాయాలను కనుగొంటాం, ప్రజల మనోభావాలు గౌరవించాలనుకుంటున్నాం" అని ఆయన చెప్పారు. మరోవైపు జాతీయ భద్రత దృష్ట్యా టర్కీ ఎయిర్‌లైన్స్‌తో అగ్రిమెంట్‌ నిలిపేయాలని ఇండిగోకు కేంద్రం సూచించింది.
short by / 01:06 am on 02 Jun
ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలో శనివారం రాత్రి ఆర్మీ డ్రోన్ కూలిపోయింది. దీని నుంచి శబ్దాలు రావడంతో పాటు ఎరుపు, నీలం లైట్లు మెరుస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీనిని చూసి భయాందోళన చెందినట్లు వారు చెప్పారు. అయితే బాబినా సైనిక ప్రాంతానికి చెందిన ఒక యూనిట్ నిఘా ప్రయోజనాల కోసం డ్రోన్‌ను ఎగరవేయగా, సాంకేతిక లోపం కారణంగా అది కూలిపోయిందని నివేదికలు తెలిపాయి.
short by / 01:08 am on 02 Jun
బంగ్లాదేశ్ మొదటి ప్రధానమంత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాన్ని కరెన్సీ నోట్ల నుంచి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం తొలగించింది. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, ఆమె తండ్రి రెహమాన్‌ చిత్రాన్ని కరెన్సీ నోట్ల నుంచి తొలగిస్తామని నూతన ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఆయన చిత్రాలు తొలగించి మసీదులు, బౌద్ధ, హిందూ దేవాలయాల చిత్రాలు ముద్రించారు.
short by / 11:21 pm on 01 Jun
జూన్ 4 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ విభాగం అంచనా వేసింది. వాతావరణ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. జూన్‌ 2న కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట్‌, హన్మకొండ, మహబూబాబాద్, సూర్యాపట, ఖమ్మం, కొత్తగూడెం మినహా మిగతా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.
short by / 12:04 am on 02 Jun
బక్రీద్‌ పండుగకు వారం రోజులే మిగిలి ఉండటంతో హైదరాబాద్‌ నగరానికి పశువుల రవాణా పెరుగుతోంది. దీనిని అడ్డుకునేందుకు గో రక్షక్‌ బృందాలు, పోలీసుల హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా పశువులను తీసుకెళ్తున్న వాహనాలను నిలిపివేశారు. శనివారం పశువుల వ్యాపారులు 3 నగర శివారు ప్రాంతాల్లో ఈ బృందాలతో ఘర్షణలను ఎదుర్కొన్నారు. దీంతో AIMIM MLC మీర్జా రహమత్ బేగ్ జోక్యం చేసుకుని, గో రక్షక్ బృందాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
short by / 12:08 am on 02 Jun
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైన్యం ప్రస్తుతం పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, బాబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, జోషిమఠ్‌తో సహా దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాలలో తదుపరి తరం రక్షణ సాంకేతికతను పరీక్షిస్తోంది. ఆగ్రా,గోపాల్‌పూర్‌లలో వైమానిక రక్షణ పరికరాల ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
short by / 11:47 pm on 01 Jun
భూమికి ప్రతి 2.75 కోట్ల ఏళ్లకు ఒకసారి గుండె కొట్టుకుంటుందని న్యూయార్క్ విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్రవేత్త మైఖేల్ రాంపినో బృందం తేల్చింది. భూమి రహస్యాలను ఛేదించడానికి ఈ బృందం ఒక అధ్యయనం నిర్వహించింది. భూమి గుండె కొట్టుకునే సమయంలో అగ్ని పర్వతాలు బద్ధలు కావడం, భూకంపాలు, టెక్టోనిక్ ప్లేట్ల కదలిక, సముద్ర మట్టంలో మార్పులు వంటి విధ్వంసక సంఘటనలు సంభవిస్తాయి.
short by / 12:00 am on 02 Jun
పాకిస్థాన్‌ను వ్యతిరేకించినందుకే న్యాయ విద్యార్థిని శర్మిష్ట పనోలిని చట్టవిరుద్ధంగా అరెస్టు చేశామనే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో వ్యాప్తి అవుతోందని కోల్‌కతా పోలీసులు X లో పేర్కొన్నారు. "ఈ కథనం దుర్మార్గమైనది, తప్పుదారి పట్టించేది" అని వారు చెప్పారు. దేశభక్తిని వ్యక్తం చేసినందుకు ఆమెను అరెస్టు చేయలేదని, వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచే అంశాలను షేర్‌ చేసినందుకు అదుపులోకి తీసుకున్నామన్నారు.
short by / 12:28 am on 02 Jun
నాసిక్-త్రయంబకేశ్వర్‌లో జరిగే సింహస్థ కుంభమేళా 2026 అక్టోబర్ 31న ధ్వజారోహణంతో ప్రారంభమవుతుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం తెలిపారు. మొదటి అమృత స్నానం ఆగస్టు 2, 2027న సోమవతి అమావాస్య నాడు జరుగుతుందని చెప్పారు. 2, 3 అమృత స్నానాలను అదే ఏడాది వరుసగా ఆగస్టు 31, సెప్టెంబర్ 11 తేదీల్లో జరుగుతాయని పేర్కొన్నారు. కుంభమేళా జెండాను 2028 జూలై 24న అవనతం చేస్తారు.
short by / 12:44 am on 02 Jun
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ 2025 క్వాలిఫయర్ 2లో PBKS ఐదు వికెట్ల తేడాతో MIని ఓడించి, 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరుకుంది. ఐదుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన MI ఈ మ్యాచ్‌లో మొత్తం 203/6 పరుగులు చేసింది. ఆ తర్వాత PBKS 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. PBKS మంగళవారం జరిగే ఫైనల్‌లో RCBతో తలపడనుంది. ఈ రెండు జట్లు తమ తొలి ఐపీఎల్‌ టైటిల్‌పై కన్నేశాయి.
short by / 07:13 am on 02 Jun
వైమానిక స్థావరాల్లోని 40 రష్యన్ విమానాలను ధ్వంసం చేసేందుకు పావుటినా (లేదా వెబ్) అనే కోడ్ గల ఆపరేషన్‌ను ఉక్రెయిన్‌ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌ను 18 నెలల పాటు రూపొందించినట్లు ఉక్రెయిన్‌ వార్తా సంస్థ "ఉక్రెయినియన్‌కా ప్రవ్దా" పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో డ్రోన్‌లను డబ్బాల్లో దాచి రష్యాలోకి అక్రమంగా రవాణా చేశారు. అనంతరం డబ్బాలను ట్రక్కులపై ఉంచగా, నిర్ణీత సమయంలో దాడి చేసేందుకు అవి ఎగిరిపోయాయి.
short by / 10:52 pm on 01 Jun
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ భారత్‌కు చేరుకున్నారు. సర్వోటెక్ గ్లోబల్ అడ్వైజరీ బోర్డులో కొత్తగా నియమితులైన ఎర్రోల్ తన పర్యటనలో భాగంగా అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శిస్తారు. తన ఐదు రోజుల భారత పర్యటనలో పలు బిజినెస్‌ మీటింగ్స్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన దక్షిణాఫ్రికాకు బయలుదేరుతారని నివేదికలు తెలిపాయి.
short by / 11:14 pm on 01 Jun
ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న "వాలీ ఆఫ్ ఫ్లవర్స్" జూన్ 1 నుంచి పర్యాటకుల ప్రవేశాలను తిరిగి ప్రారంభించారు. సాధారణంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో తెరిచి ఉండే ఈ లోయను అక్టోబర్‌లో మూసివేస్తారు. జూలై, ఆగస్టు మాసాల్లో ఈ లోయకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పువ్వుల లోయలో 100 కంటే ఎక్కువ జాతులకు చెందిన పువ్వులు వికసిస్తాయి. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు.
short by / 11:37 pm on 01 Jun
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, NCP (SP) అధినేత శరద్ పవార్ మధ్య శనివారం పుణెలో జరిగిన చక్కెర సహకార సంఘం సాధారణ సమావేశం వేదికగా సంభాషణ చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) రెండు వర్గాల విలీనంపై ఊహాగానాల నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో జయంత్ పాటిల్, బాలాసాహెబ్ థోరట్ వంటి నాయకులు కూడా పాల్గొన్నారు.
short by / 11:39 pm on 01 Jun
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, వరదలకు సంబంధించిన ఘటనల్లో ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు 30 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో కొత్తగా ముగ్గురు చనిపోయారని చెప్పారు. కేరళ విద్యుత్ బోర్డు రూ.164.46కోట్ల మౌలిక సదుపాయాల నష్టం జరిగిందని అంచనా వేసింది. 10 వేల స్తంభాలు సహా విద్యుత్‌ లైన్లు దెబ్బతినగా, కరెంట్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
short by / 12:24 am on 02 Jun
పాకిస్థాన్‌ తక్ఫీరిజానికి కేంద్రబిందువు అని, దానిని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) "గ్రే లిస్ట్‌"లోకి తిరిగి తీసుకురావాలని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తక్ఫీరిజం మతభ్రష్టులు లేదా అవిశ్వాసులుగా భావించే తోటి ముస్లింలను చంపేందుకు పిలుపునిస్తుందని ఆయన చెప్పారు. 1991 నుంచి 2002 వరకు జరిగిన అంతర్యుద్ధంలో అల్జీరియా తక్ఫీరిజాన్ని ఎదుర్కొంది.
short by / 12:36 am on 02 Jun
ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆకస్మిక వరదలు సంభవించి 25 మంది మృతి చెందిన నేపథ్యంలో సహాయక చర్యల కోసం భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. హోంమంత్రి అమిత్ షా అస్సాం, సిక్కిం, అరుణాచల్ ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి, ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. వందలాది మంది పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.
short by / 12:41 am on 02 Jun
1962లో భారత్‌, చైనా మధ్య యుద్ధం జరిగిందని చాలా మంది చైనీయులకు తెలియదని సింగపూర్ మాజీ దౌత్యవేత్త, భౌగోళిక, రాజకీయ విశ్లేషకుడు కిషోర్ మహబూబానీ తెలిపారు. ఆసియాకు చెందిన అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలైన భారత్‌, చైనా కలిసి సాగకపోతే ఆసియా ఇబ్బందుల్లో పడుతుందని ఆయన అన్నారు. ఇరు దేశాల్లోని యువత ఇటీవలి ఉద్రిక్తతలను కాకుండా భవిష్యత్‌పై దృష్టి సారించాలన్నారు.
short by / 11:26 pm on 01 Jun
Load More
For the best experience use inshorts app on your smartphone