ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో శని, ఆదివారాల్లో ఏపీలోని అనకాపల్లి, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, తూ.గో ,రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
short by
Devender Dapa /
11:49 pm on
18 Apr