For the best experience use Mini app app on your smartphone
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వర్షం కారణంగా 14-14 ఓవర్లకు కుదించిన IPL 2025 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 5 వికెట్ల తేడాతో ఓడించింది. 96 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్ 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టిమ్ డేవిడ్ చివరి ఓవర్‌లో మూడు సిక్స్‌లు కొట్టాడు.
short by Devender Dapa / 12:38 am on 19 Apr
భార్య చనిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన యూపీ లక్నోకు చెందిన 25 ఏళ్ల వ్యక్తి తన జననాంగాలను తానే కట్‌ చేసుకున్నాడు. ఏడాది క్రితం చనిపోయిన భార్యను అతడు మరిచిపోలేకపోయాడని, కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో, ఇష్టంలేక ఈ నిర్ణయానికి వచ్చాడని స్థానికులు తెలిపారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
short by Devender Dapa / 10:36 pm on 18 Apr
హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ఉద్యోగులు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయం కావడంతో రోడ్లపై రద్దీ నెలకొంది. ముఖ్యంగా మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు బారులు తీరినట్లుగా ఉన్న వీడియోలో వెలుగులోకి వచ్చాయి. మాదాపూర్ ఐకియా అండర్ పాస్ వద్ద వాహనాలు నిదానంగా కదిలాయి.
short by Devender Dapa / 11:24 pm on 18 Apr
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో శని, ఆదివారాల్లో ఏపీలోని అనకాపల్లి, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, తూ.గో ,రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
short by Devender Dapa / 11:49 pm on 18 Apr
హైదరాబాద్‌ పేట్‌ బషీరాబాద్‌లో పంచాయతీకి మధ్యవర్తిగా వెళ్లిన 26 ఏళ్ల వ్యక్తిని అవతలి వర్గం తీవ్రంగా కొట్టింది. అఫ్జల్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన బాధితుడి స్నేహితురాలి సోదరి ఫ్యామిలీ గొడవలతో విడాకుల కేసు నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమెకు విడాకులు ఇష్టం లేదని, రాజీ కుదుర్చాలని స్నేహితురాలు కోరడంతో వెళ్లిన అతనిపై బాధితురాలి భర్త, అతని స్నేహితులు దాడి చేయగా, పోలీసులు SC,ST కేసు నమోదు చేశారు.
short by Bikshapathi Macherla / 12:03 am on 19 Apr
ఓ కేసులో సంగారెడ్డి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఫిట్స్‌ రావడంతో మృతి చెందాడు. మెదక్‌కు చెందిన 39 ఏళ్ల వెంకటేశ్వర్లును గంజాయి కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే బుధవారం అతనికి ఫిట్స్‌ రావడంతో ప్రథమ చికిత్స చేశారు. రాత్రివేళలో మరోసారి ఫిట్స్‌ రావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
short by Bikshapathi Macherla / 10:30 pm on 18 Apr
జపాన్‌ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ తెలంగాణ ప్రతినిధి బృందం టోక్యో వాటర్‌ ఫ్రంట్‌ను సందర్శించింది. కాగా టోక్యో మధ్య నుంచి పారే సుమిదా నది.. రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను ఆకర్షిస్తోందని తెలంగాణ CMO తెలిపింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నందున CM, టోక్యో రివర్ ఫ్రంట్‌ను పరిశీలించారని పేర్కొంది.
short by Devender Dapa / 10:55 pm on 18 Apr
రూ.473 కోట్లతో చేపట్టిన విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులను జూన్‌ నాటికి పూర్తిచేయాలని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం విమానాశ్రయం 12,961 చ.మీ. విస్తీర్ణంతో ఉందని.. ఇక్కడి నుంచి ఏటా 10 లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. దీనిని 36వేల చ.మీ.కు విస్తరించి.. ఏటా 35 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు.
short by Devender Dapa / 12:34 am on 19 Apr
హైదరాబాద్‌ అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఉపయోగిస్తున్న క్రేన్‌ కూలింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలు వాహనాలు ధ్వంసం అయినట్లు స్థానికులు తెలిపారు. క్రేన్‌ భాగాలు రామకృష్ణ థియేటర్‌ నుంచి మొజాం జాహీ మార్కెట్‌ వరకు పడినట్లు వారు చెప్పారు. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
short by Bikshapathi Macherla / 10:55 pm on 18 Apr
ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన శ్రీకాకుళం కార్మికులతో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు వీడియో కాల్‌లో మాట్లాడారు. స్వదేశానికి రాలేక, అక్కడ పని దొరకక అల్లాడిపోతున్నట్లు వారు ఆయనకు వివరించారు. స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడతామని, భయపడొద్దని ధైర్యంగా ఉండాలని మస్కట్‌ బాధితులకు రామ్మోహన్‌ భరోసా ఇచ్చారు. కార్మికుల కుటుంబాలకు కేంద్ర మంత్రి ధైర్యం చెప్పారు.
short by Bikshapathi Macherla / 11:10 pm on 18 Apr
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. శుక్రవారం కర్నూలులోని గ్రీన్‌ కో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ సైట్‌ను ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్‌కు 60 ఏళ్లకు పైగా పనిచేసే సామర్థ్యం ఉందని, అతి త్వరలో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని చెప్పారు. కేవలం సోలార్‌ పైనే ఆధారపడొద్దని, ప్రత్యామ్నాయాలను కూడా వినియోగించాలన్నారు.
short by Bikshapathi Macherla / 12:11 am on 19 Apr
జనగామ జిల్లా ఆలింపూర్‌ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగు పడిన ఘటనలో 12 మంది గాయపడ్డారు. వారిలో 10 మందికి స్వల్ప గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని నివేదికలు తెలిపాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను BRS జనగామ MLA పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
short by Devender Dapa / 10:33 pm on 18 Apr
గ్రూప్‌-1 పరీక్షల విషయంలో హైకోర్టు తీర్పు TGPSCకి చెంపపెట్టు అని BRS నేత రాకేశ్‌రెడ్డి అన్నారు. ధర్మానిదే అంతిమ విజయమని స్పష్టమైందన్నారు. “పోరాడిన అభ్యర్థులది విజయం, అండగా నిలిచిన BRSది నైతిక విజయం. పరీక్షల్లో 10మంది అభ్యర్థులు ఎలా పెరిగారు? గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో 21 ఉల్లంఘనలు జరిగాయి,” అని చెప్పారు. కాగా తెలంగాణలో గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని TGPSCని హైకోర్టు ఆదేశించింది.
short by Devender Dapa / 11:49 pm on 18 Apr
గత నాలుగు రోజులుగా, రష్యన్ యుద్ధనౌకలు బంగ్లాదేశ్ జలాల్లో నిలబడి ఉన్నాయి, ఇది ఈ ప్రాంత సముద్ర గతిశీలతలో ఒక ముఖ్యమైన క్షణాన్ని సూచిస్తుంది. నౌకాదళ గుడ్‌విల్ మిషన్‌లో భాగమైన ఈ నౌకలు దౌత్య & వ్యూహాత్మక ఆసక్తిని రేకెత్తించాయి. ఈ పర్యటన సాధారణ ఒక పర్యటన అని, ద్వైపాక్షిక సహకారంలో భాగమని బంగ్లాదేశ్ పేర్కొంది.
short by / 10:34 pm on 18 Apr
సహనటుడు షైన్ టామ్ చాకోపై అమ్మాలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని మలయాళ నటి విన్సీ అలోసియస్ చెప్పారు. చాకో పేరును బహిరంగంగా వెల్లడించరాదని తాను స్పష్టం చేశానని విన్సీ అన్నారు. "ఈ నటుడు అనూహ్యమైన ప్రతిభావంతుడు. అతడికి పని నిరాకరించకూడదు," అని ఆమె అన్నారు. డ్రగ్స్ ప్రభావంతో షైన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని విన్సీ ఆరోపించారు.
short by / 11:07 pm on 18 Apr
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ శుక్రవారం మాల్దా చేరుకున్నారు. ముర్షిదాబాద్ జిల్లాలోని హింసాకాండ ప్రభావిత ప్రాంతాల నుంచి పారిపోయి తాత్కాలిక శరణార్థి శిబిరంలో ఆశ్రయం పొందిన ప్రజలను ఆయన కలుస్తారని PTI నివేదించింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక సంఘటనలు జరిగాయి, దీని ఫలితంగా అల్లర్లకు గురైన ప్రజలు వలస వెళ్లారు.
short by / 11:14 pm on 18 Apr
అమెరికా పరస్పర సుంకాల యుద్ధంపై ఆర్థిక అనిశ్చితి నెలకొన్నందున దేశంలోని $280 బిలియన్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతి పరిశ్రమ కొత్త నియామకాలను నిలిపివేస్తోంది. 2025 Q1లో టాలెంట్ డిమాండ్ 18-20% తగ్గింది, IT సంస్థలు బడ్జెట్లను కఠినతరం & ప్రాజెక్టులను ఆలస్యం చేస్తున్నాయి, పార్శ్వ నియామకాలను నిలిపివేస్తున్నాయి. సామూహిక తొలగింపులు ఇంకా ప్లాన్ చేయనప్పటికీ, నియామకాల్లో తగ్గింపులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
short by / 10:25 pm on 18 Apr
ఏప్రిల్ 2న US టారిఫ్ ప్రకటన తర్వాత లాభాలను నమోదు చేసిన ఏకైక ప్రధాన మార్కెట్‌గా భారతదేశం ఆవిర్భవించడం ద్వారా ప్రపంచ ఈక్విటీ ట్రెండ్‌లను ధిక్కరించింది. డాలర్ పరంగా సెన్సెక్స్, నిఫ్టీ 2% పైగా పెరగడంతో, ప్రపంచ అస్థిరతల మధ్య భారత స్టాక్ మార్కెట్ స్థిరంగా ఉంది, వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడం, ముడి చమురు ధరలు పడిపోవడం, US-భారత్ వాణిజ్య ఒప్పందం చుట్టూ ఉన్న ఆశావాదం ద్వారా ఇది బలపడింది.
short by / 10:38 pm on 18 Apr
17 ఏళ్ల క్రితం 2008 ఏప్రిల్ 18న బెంగళూరులో RCB & KKR మధ్య తొలి IPL మ్యాచ్ జరిగింది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని KKR జట్టు బ్యాటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ 158*(73) ధాటికి 222/3 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని RCB జట్టు 15.1 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి సీజన్ తొలి మ్యాచ్‌లో ఆడిన విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మలు IPL-2025లోనూ ఆడుతుండటం గమనార్హం.
short by / 11:19 pm on 18 Apr
దిల్లీలోని సీలంపూర్‌లో 17 ఏళ్ల బాలుడు కునాల్ హత్యకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తర్వాత, కొంతమంది స్థానికులు హత్యకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయగా, అధికారులు వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. నిందితుడిని గుర్తించినట్లు దిల్లీ పోలీసు వర్గాలను ఉటంకిస్తూ న్యూస్ 18 నివేదించింది. నిందితులు బాధితులకు తెలిసిన వారని, వారు వేరే వర్గానికి చెందిన వారని సమాచారం.
short by / 11:25 pm on 18 Apr
పాకిస్థాన్‌లోని KFC ఔట్‌లెట్‌లపై వరుస దాడుల తర్వాత, లాహోర్‌లోని 27 ప్రదేశాలలో అధికారులు భద్రతను పెంచారు. అమెరికా వ్యతిరేక, ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారడంతో, ఇవి విధ్వంసం, ఒక ఉద్యోగి మరణానికి దారితీశాయి. ఇజ్రాయెల్-గాజా వివాదంపై పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య మతాధికారులు శాంతియుత బహిష్కరణలకు పిలుపునివ్వడంతో, పోలీసులు 178 మందిని అరెస్టు చేశారు.
short by / 11:23 pm on 18 Apr
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ముందుగా రుతురాజ్ గైక్వాడ్ తర్వాత గుర్జప్నీత్ సింగ్ గాయం కారణంగా IPL-2025 కు దూరమయ్యారు. సింగ్ స్థానంలో, జూనియర్ AB డివిలియర్స్‌గా పేరొందిన దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్ బ్రెవిస్ చెన్నై జట్టులోకి వచ్చాడు. దూకుడు బ్యాటింగ్‌కు పేరుగాంచిన డెవాల్డ్ బ్రెవిస్‌ను చెన్నై రూ.2.2 కోట్లకు కొనుగోలు చేసింది. IPL-2025 పాయింట్ల పట్టికలో CSK చివరి స్థానంలో ఉండటం గమనార్హం.
short by / 11:43 pm on 18 Apr
"ఒక మహిళ తన భర్త నుంచి వేరుగా నివసిస్తూ, మరో వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉంటే, ఆమె తన భర్త నుంచి భరణం భత్యం పొందేందుకు అర్హురాలు కాదు," అని దిల్లీ హైకోర్టు తెలిపింది. తన భార్యకు నెలకు రూ.10,000 చెల్లించాలన్న దిగువ కోర్టు ఉత్తర్వులను ఒక వ్యక్తి హైకోర్టులో సవాల్ చేసిన కేసుపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్య చేసింది.
short by / 10:30 pm on 18 Apr
ఏప్రిల్ 17న జరిగిన కర్ణాటక మంత్రివర్గ ప్రత్యేక సమావేశం 2015 కుల గణన నివేదికపై నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. దీని ప్రకారం, జనాభాలో OBCలు 70%, రిజర్వేషన్లు 51% ఉన్నాయి. కొంతమంది సీనియర్ నాయకులు దీని కచ్చితత్వాన్ని ప్రశ్నిస్తుండగా, మరికొందరు, ముఖ్యంగా OBC, దళిత వర్గాలకు చెందిన వారు దీనిని విడుదల చేసి, అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని సమీక్షించడానికి మరింత సమయం అవసరమని మంత్రులు తెలిపారు.
short by / 10:46 pm on 18 Apr
కేసు విచారణలో ఉండగా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలను అనుమతించినందుకు కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించింది. "సుప్రీంకోర్టు ఈ విషయాన్ని విచారిస్తుండగా మీరు ఇప్పుడు ఏ నిరసనకు అనుమతిస్తున్నారు?" అని ప్రశ్నించింది. వక్ఫ్‌పై నిరసనల నేపథ్యంలో మంగళూరులో కొన్ని మార్గాలను నివారించాలని వాహనదారులను కోరుతూ ఏప్రిల్ 15న జారీ చేసిన సర్క్యులర్‌కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను ఇది విచారిస్తోంది.
short by / 11:04 pm on 18 Apr
Load More
For the best experience use inshorts app on your smartphone