For the best experience use Mini app app on your smartphone
గూస్‌బంప్స్ అనేది మానవుడి సహానుభూత నాడీ వ్యవస్థ ప్రేరేపితమై ఉద్దీపనకు గురైనప్పుడు సంభవించే అసంకల్పిత ప్రతిచర్య. ఈ సమయంలో వెంట్రుకల కుదుళ్ల భాగంలోని చిన్న కండరాలు సంకోచించి, వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది వెంట్రుకలు నిటారుగా నిక్కబొడుచుకోవడానికి కారణమవుతుంది. దీంతో చర్మంపై చిన్న గడ్డలు (వాపు) ఏర్పడతాయి. ఇవి మెడ, చేతులు, కాళ్ళతో సహా శరీరంలో వెంట్రుకలు ఉన్న ఎక్కడైనా సంభవించవచ్చు.
short by Rajkumar Deshmukh / 08:54 pm on 22 Feb
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్‌ చేసి, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకున్న ఘటనపై ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సీఎం, పీఎం మోదీకి వివరించారు. మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సహాయక చర్యల కోసం వెంటనే NDRF బృందాలను పంపిస్తామని, పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని పీఎం మోదీ హామీ ఇచ్చారు.
short by Devender Dapa / 08:36 pm on 22 Feb
ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ శనివారం ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 30 ఏళ్ల ఈ ఆటగాడు లాహోర్‌లో ఆస్ట్రేలియాపై 143 బంతుల్లో 165 పరుగులు చేశాడు. టోర్నమెంట్ చరిత్రలో మునుపటి అత్యధిక స్కోరు న్యూజిలాండ్‌కు చెందిన నాథన్ ఆస్ట్లే, జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్ పేరిట ఉంది. వీరు అమెరికా, భారత్‌పై వరుసగా 145*(151), 145(164) పరుగులు చేశారు.
short by Devender Dapa / 06:38 pm on 22 Feb
పాకిస్థాన్ షార్ట్ పిచ్ బౌలింగ్ వ్యూహాలకు నిరసనగా 1978 నవంబర్ 3న పాక్‌తో జరిగిన వన్డేను భారత్ వదులుకుంది. భారత్‌ 3 ఓవర్లలో 23 పరుగులు చేయాల్సిన సమయంలో పాక్‌ బౌలర్ సర్ఫరాజ్ నవాజ్ వరుసగా నాలుగు బౌన్సర్లను బ్యాటర్‌ తల మీదుగా వేశాడు. అయినా అంపైర్‌ వాటిని వైడ్‌గా ప్రకటించలేదు. దీంతో అప్పటి కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ భారత బ్యాటర్లను వెనక్కి పిలిపించడంతో ఆ మ్యాచ్ పాకిస్థాన్‌కు దక్కింది.
short by Srinu Muntha / 08:08 am on 23 Feb
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు. “భారత్ vs పాకిస్థాన్‌ మ్యాచ్‌ పెద్దది, కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అంతకంటే పెద్ద మ్యాచ్,” అని అన్నాడు. “మేం మెరుగైన క్రికెట్ ఆడుతున్నాం. కానీ పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయం. ఈ మ్యాచ్‌ ఎంతో చరిత్రను కలిగి ఉంది. ఈ పోరు కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు,” అని వ్యాఖ్యానించాడు.
short by Devender Dapa / 09:20 pm on 22 Feb
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్‌ ఓడినా, తమ దేశ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నందున పాక్ అభిమానులు ఈసారి టీవీలను పగలగొట్టరని పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ అన్నారు. "భారత్‌ ఫేవరెట్‌. అందులో ఎలాంటి సందేహం లేదు," అని ఆయన పేర్కొన్నారు. ఈ టోర్నీలో ఇప్పటికే న్యూజిలాండ్‌ చేతిలో పాక్‌ ఓడిపోగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది.
short by Srinu Muntha / 05:56 pm on 22 Feb
శనివారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్‌లో UPW జట్టు DC జట్టును 33 పరుగుల తేడాతో ఓడించి, ఈ సీజన్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. UPW జట్టు 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి, DCని 19.3 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌట్ చేసింది. 23 బంతుల్లో 62 రన్స్ చేసిన చినెల్లే హెన్రీ UPW తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. గ్రేస్ హారిస్, క్రాంతి గౌడ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.
short by Devender Dapa / 11:18 pm on 22 Feb
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు తాను 9 కిలోల బరువు తగ్గానని భారత పేసర్ మహమ్మద్ షమీ వెల్లడించాడు. తాను రోజుకు ఒకపూట మాత్రమే తింటున్నట్లు చెప్పాడు. “2015 నుంచి నేను రోజుకు ఒకపూటే తింటున్నా. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్ చేయను. నేరుగా రాత్రి భోజనం తింటా. ఇది మొదట్లో కష్టంగా అనిపించినా, అలవాటైతే ఈజీ అయిపోతుంది,” అని షమీ వ్యాఖ్యానించాడు. తాను స్వీట్స్ అస్సలు తిననని మహమ్మద్ షమీ తెలిపాడు.
short by Devender Dapa / 05:37 pm on 22 Feb
శనివారం లాహోర్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఐసీసీ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌ను నమోదు చేసింది. ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ ఇంగ్లిస్ 86 బంతుల్లో అజేయంగా 120 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు 47.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
short by Devender Dapa / 10:59 pm on 22 Feb
పారదర్శక చర్మం కింద నకిలీ కండరాలు, ఎముకలు, కీళ్ళతో అచ్చం మనిషిలా కదిలే ‘ప్రోటోక్లోన్’ రోబోను పోలాండ్ & USకు చెందిన క్లోన్ రోబోటిక్స్ అనే స్టార్టప్ ఆవిష్కరించింది. “ఇది ప్రపంచంలోని మొట్టమొదటి రెండు కాళ్లు, కండర నిర్మితమైన ఫేస్‌లెస్ ఆండ్రాయిడ్. శరీర నిర్మాణంలో 200 డిగ్రీలకు పైగా స్వేచ్ఛతో 1,000 కంటే ఎక్కువ మైయోఫైబర్లు, 500 సెన్సార్లు కలిగిన సింథటిక్ మనిషి," అని సదరు స్టార్టప్ తెలిపింది.
short by Rajkumar Deshmukh / 09:48 pm on 22 Feb
భారత్‌లోని పౌరులు జనన ధ్రువీకరణ పత్రం పొందడానికి, అప్‌డేట్ చేసుకోవడానికి ఇచ్చిన గడువును కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 27 వరకు పొడిగించింది. అంతకుముందు, ఈ గడువు తేదీ 2024 డిసెంబర్‌ 31గా ఉంది. అలాగే, జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంతకు ముందు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని తొలగించారు. భారత్‌లోని 75% మంది పెద్దలకు జనన లేదా వివాహ ధ్రువీకరణ పత్రాలు లేవని సమాచారం.
short by Sri Krishna / 05:57 pm on 22 Feb
తక్కువ ఖర్చులో పెళ్లిళ్లు చేయిస్తామని, కానుకలు కూడా ఇస్తామని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో రిషివంశీ అనే గ్రూప్ రూ.లక్షల్లో వసూలు చేసి పారిపోయింది. పోలీసుల ప్రకారం, సామూహిక వివాహాలు జరిపిస్తామని చెబుతూ సదరు గ్రూప్‌ సభ్యులు సుమారు 28 జంటల నుంచి రూ.15 వేలు- 40 వేల చొప్పున వసూలు చేశారు. అయితే వధూవరులు ముస్తాబై వారు చెప్పినచోటుకు రాగా మోసపోయినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు పెళ్లిళ్లు చేయించారు.
short by Devender Dapa / 08:13 pm on 22 Feb
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (CBEC) అదనపు కమిషనర్ మనీశ్‌ విజయ్, ఆయన సోదరి, వారి తల్లి కేరళలోని కొచ్చిలో గల అధికారిక నివాసంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మనీశ్‌ ఓ గదిలో, ఆయన సోదరి మరో గదిలో ఉరికి వేలాడుతూ కనిపించగా, వారి తల్లి వేరే గదిలో మంచంపై నిర్జీవంగా కనిపించింది. అతడి తల్లి మృతదేహాన్ని తెల్లని వస్త్రంలో చుట్టి పూలు చల్లినట్లుగా ఉంది. ఆమె పక్కనే ఫ్యామిలీ ఫొటో పడి ఉంది.
short by Srinu Muntha / 09:00 pm on 22 Feb
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా నియమించేందుకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దాస్‌ పదవీ కాలం పీఎం మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు లేదంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఏది ముందైతే దాని వరకు ఉంటుందని ఆ కమిటీ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. దాస్ 2024 డిసెంబర్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌గా పదవీ విరమణ చేశారు.
short by Sri Krishna / 06:17 pm on 22 Feb
తన మాజీ ప్రియురాలితో మాట్లాడుతున్న వ్యక్తి ఇంటికి నిప్పంటించి, ఆరుగురిపై హత్యాయత్నం చేసిన అభియోగాలపై అమెరికాలో హారిసన్‌ జోన్స్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెన్సిల్వేనియాలో ఉండే వ్యక్తి, జోన్స్‌ మాజీ ప్రియురాలు కొన్నాళ్లుగా ఆన్‌లైన్‌లో చాట్‌ చేస్తున్నారు. ఈ వారంలో వాళ్లు కలవాల్సి ఉండగా, విషయం తెలుసుకున్న జోన్స్‌ అతడిని చంపే ఉద్దేశంతో మిషిగన్‌ నుంచి 1100 కి.మీ. కారు నడుపుకుంటూ వచ్చాడు.
short by Rajkumar Deshmukh / 07:17 pm on 22 Feb
ఏపీలో చేరేందుకు వీలుగా IPS అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్‌ను వెంటనే రిలీవ్ చేస్తున్నట్లు తెలంగాణ సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈనెల 27న MLC ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి రిలీవ్‌పై నిర్ణయం తీసుకోవాలని ఈసీకి లేఖ రాసినట్లు చెప్పారు. కాగా అంతకుముందు తెలంగాణలో పనిచేస్తున్న అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్‌, అభిషేక్‌ మహంతిలు ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రహోంశాఖ ఆదేశించింది.
short by Devender Dapa / 09:38 pm on 22 Feb
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సొరంగంలోకి వచ్చిన బురదను తొలగిస్తున్నామని, ఆదివారం ఉదయం సహాయక చర్యలు వేగవంతం అవుతాయన్నారు. ఇప్పటికే 33.5 కి.మీ పనులు పూర్తయ్యాయని, మరో 9.5 కి.మీ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆదివారం సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
short by Devender Dapa / 11:33 pm on 22 Feb
గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయలేమని, ఈనెల 23న యథాతథంగా నిర్వహిస్తామని APPSC తెలిపింది. పరీక్షలు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాశాక ఈ మేరకు బదులిచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఉ.10 నుంచి 12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. 92,250 మంది మెయిన్స్‌ పరీక్ష రాయనున్నారు.
short by Devender Dapa / 10:27 pm on 22 Feb
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలోని ఓ కూడలి వద్ద జామాయిల్ కర్ర లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. బుట్టాయిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తుండగా ఇది జరిగింది. మలుపు వద్ద వేగంగా తిరగడంతోనే ట్రాలీ బోల్తా పడినట్లు వీడియోలో కనిపించింది. అయితే సమీపంలో ప్రజలెవరూ లేకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాద దృశ్యాలు ఓ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
short by Devender Dapa / 08:09 pm on 22 Feb
ఆదివారం జరిగే గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు విశాఖలోని ఇసుకతోట కూడలి వద్ద హైవేపై బైఠాయించి ధర్నాకు దిగారు. రిజర్వేషన్‌లో రోస్టర్ విధానం సరిచేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా పరీక్షను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాయగా, షెడ్యూల్ ప్రకారం ఆదివారం పరీక్షను నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
short by Devender Dapa / 11:12 pm on 22 Feb
గ్రూప్‌-2 ప్రధాన పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు శనివారం స్పష్టం చేశారు. రిజర్వేషన్‌లో రోస్టర్‌ విధానంపై కోర్టులో మార్చి 11న విచారణ ఉన్న దృష్ట్యా అప్పటి వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాశామని ఆయన తెలిపారు. మరోవైపు, ఫిబ్రవరి 23న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఏపీపీఎస్సీ శనివారం తెలిపింది. ఈ క్రమంలో గ్రూప్‌-2 అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.
short by Sri Krishna / 06:38 pm on 22 Feb
చెల్లి పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తుండగా వరంగల్‌ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఎర్ర అఖిల్‌ అనే 28 ఏళ్ల యువకుడు, అతడి స్నేహితుడు మృతి చెందారు. పోలీసుల ప్రకారం, ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా, వీరిద్దరూ బైక్‌పై హనుమకొండ వెళ్లేందుకు బయలుదేరారు. శుక్రవారం అర్ధరాత్రి దాటక వీరి బైక్‌ను వెనక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అన్ని ఏర్పాట్లు పూర్తయినా అఖిల్ మృతితో అతడి చెల్లి వివాహం ఆగిపోయింది.
short by Devender Dapa / 10:29 pm on 22 Feb
వైద్యుల ప్రకారం, కొబ్బెర లేదా కొబ్బరి సంబంధిత పదార్థాలంటే అలెర్జీ ఉన్నవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలి. ఈ నీళ్లలో ఉండే అధిక పొటాషియం కిడ్నీ సమస్యతో బాధపడేవారికి కూడా తీవ్ర హాని కలగజేస్తుంది. కొబ్బరి నీటిలో ఉండే చక్కెర వల్ల, డయాబెటిస్ రోగులు దీనికి దూరంగా ఉండటం మేలు. అలాగే 6 నెలల్లోపు వయసున్న పిల్లలకు ఈ నీటిని తాపకూడదు. జీర్ణ సమస్యలు, ముఖ్యంగా IBS ఉన్నవారు వైద్యుల సలహాతో కొబ్బరి నీళ్లు తాగాలి.
short by Srinu Muntha / 07:30 am on 23 Feb
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ''సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కూలిన ఘటన మరువకముందే మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనం. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణ గాలికొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడటం వల్లే వరుస సంఘటనలు జరుగుతున్నాయి'' అని పేర్కొన్నారు.
short by Sri Krishna / 05:49 pm on 22 Feb
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శనివారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులను పరిశీలించిన వైద్యులు ఆయనకు కొన్ని సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉండటంతో పవన్‌ ఈ నెల చివర్లో గానీ, మార్చి మొదటి వారంలో గానీ మరోసారి ఆస్పత్రికి వెళ్లే అవకాశముందని జనసేన పార్టీ తెలిపింది. పవన్‌ గత కొద్ది రోజులుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.
short by Srinu Muntha / 07:02 am on 23 Feb
Load More
For the best experience use inshorts app on your smartphone