గత మూడు నాలుగేళ్లుగా పెండింగ్లోని రూ.2,000 కోట్ల బిల్లులు త్వరలో చెల్లిస్తామని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. దీంతో సుమారు 17,000 మందికి చెల్లింపులు దక్కుతాయని చెప్పారు. నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, నాబార్డు పనులకు బిల్లుల, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకూ కొంత మొత్తం విడుదల చేయనున్నట్లు ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో భేటీ తర్వాత మంత్రి వివరించారు.
short by
Devender Dapa /
10:45 pm on
30 Mar