For the best experience use Mini app app on your smartphone
జంటలు ఒక నెల/వారంలో ఎన్నిసార్లు అయినా సెక్స్‌లో పాల్గొనవచ్చు. అయితే వారానికి ఒక్కసారి శృంగారంలో పాల్గొన్నా, దంపతుల మధ్య బంధం మెరుగ్గా ఉంటుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. కెనడాలో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం, 20 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి 80 సార్లు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటారు. 30-39 సంవత్సరాల వయస్సు గల వారు సంవత్సరానికి సగటున 86 సార్లు లైంగిక చర్యలో పాల్గొంటారు.
short by Devender Dapa / 09:18 pm on 28 Feb
యూపీలో వరకట్నం కోసం 27 ఏళ్ల మహిళను బట్టలు విప్పి, చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలపై ఆమె భర్త, మామ, అత్తతో సహా ఆరుగురిపై కేసు నమోదైంది. వజ్రాల వ్యాపారి అయిన భర్త మద్యం మత్తులో తనపై దాడి చేసి, అసహజ లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని బాధితురాలు తెలిపింది. పెళ్లి సమయంలో రూ.50 లక్షలు కట్నంగా ఇచ్చినప్పటికీ, అదనంగా మరో రూ.10 లక్షలు, లగ్జరీ కారు డిమాండ్ చేస్తూ తనను వేధిస్తున్నారని ఆమె పేర్కొంది.
short by Rajkumar Deshmukh / 10:47 pm on 28 Feb
పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘హరిహర వీరమల్లు’ అనుకున్న తేదీకే విడుదలైతే, తాను నిర్మించిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ మార్చి 29న రిలీజ్‌ కాదని నిర్మాత నాగవంశీ తెలిపారు. ‘మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్‌ కానుంది. 29 మీకు కరెక్ట్‌ డేట్‌’ అనుకుంటున్నారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా నాగవంశీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. తమ చిత్రంలో కథ, లాజిక్స్ ఉండవని, కేవలం రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వించాలనే తీశామని చెప్పారు.
short by Devender Dapa / 08:58 pm on 28 Feb
‘నా టూర్‌ ఎం.ఎం.కె’ పేరిట ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి లైవ్‌ కాన్సర్ట్‌ చేయనున్నారు. మార్చి 22న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ వివరాలు పంచుకుంటూ ఆయన సోదరుడు, అగ్ర దర్శకుడు రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ఈ ప్రదర్శనలో ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్‌లు ఉండాలనేదే తన డిమాండ్ అని రాజమౌళి అన్నారు.
short by Devender Dapa / 11:57 pm on 28 Feb
హైదరాబాద్‌ శేరిలింగంపల్లిలో చదువుల ఒత్తిడితో 17 ఏళ్ల ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం, నెహ్రూ నగర్‌లో నివాసముండే రాజేశ్వరి కుమారుడు దీక్షిత్‌రాజ్‌ మియాపూర్‌లో ఇంటర్‌ చదువుతున్నాడు. తల్లి పని నుంచి ఇంటికి వచ్చిన సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. వారం రోజులుగా చదువులో ఒత్తిడికి గురవుతున్నాడని, అందుకే ఉరివేసుకున్నాడని తల్లి రాజేశ్వరి తెలిపింది.
short by Bikshapathi Macherla / 11:43 pm on 28 Feb
హైదరాబాద్‌ బండ్లగూడ PS పరిధిలోని లేక్‌ వ్యూహిల్స్‌ ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్‌ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సమీప ప్రాంతాలను పొగ కమ్మేసినట్లు వీడియోలో కనిపించింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడం గమనించి, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారుల ఆరా తీస్తున్నారు.
short by Devender Dapa / 11:58 pm on 28 Feb
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో 100 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోందని ‘ఈనాడు’ తెలిపింది. దాని ప్రకారం, శాంతిభద్రతలు, ట్రాఫిక్, మహిళ, సైబర్‌ PSలతో కలిపి రాష్ట్రంలో ప్రస్తుతం 844 ఉన్నాయి. ‘కొత్తగా ఏర్పాటయ్యే వాటిలో ట్రాఫిక్, మహిళా PSలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికే ఉన్న వాటిలో సుమారు 150 ఠాణాల స్థాయిని పెంచుతారు.
short by Devender Dapa / 10:28 pm on 28 Feb
హైదరాబాద్‌ నార్సింగిలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో మంటలు అంటుకున్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పాషా కాలనీలో ఉన్న 2 అంతస్థుల భవనంలో ఉన్న సెల్లార్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిందని, మంటలు మెట్ల ద్వారా పై అంతస్థుల్లోకి పాకినట్లు అధికారులు తెలిపారు. వాహనాల్లో ఉన్న CNG గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఇంట్లో ఉన్న 70 ఏళ్ల జమీలా, 40 ఏళ్ల సహానా, 7 ఏళ్ల సిజిరాలు పొగతో ఊపిరాడక చనిపోయారు.
short by Bikshapathi Macherla / 10:35 pm on 28 Feb
వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకు కేంద్రం అనుమతి మంజూరు చేసినందుకు తెలంగాణ సీఎం రేవంత్‌, పీఎం మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌కు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. కాగా మామునూరు విమానాశ్రయం 32 ఏళ్ల క్రితం మూతపడింది. అప్పుడప్పుడు శిక్షణ ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడుస్తున్న ఈ విమానాశ్రయం నుంచి త్వరలో మళ్లీ విమానాలు ఎగరనున్నాయి.
short by Devender Dapa / 11:25 pm on 28 Feb
చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాకేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన రికవరీ మేళాలో 1183 ఫోన్లను బాధితులకు అందజేసినట్లు ఎస్పీ జగదీశ్‌ తెలిపారు. 2022 నుంచి మొత్తం 11,378 ఫోన్లు రికవరీ చేశామని, వీటి విలువ రూ.21.08 కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నవారు CEIR పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
short by Bikshapathi Macherla / 11:56 pm on 28 Feb
వరంగల్‌ ఎల్‌బీ కళాశాల ప్రిన్సిపల్‌ వేధిస్తున్నారని రాధ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ధర్నా చేపట్టారు. MLC ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఇండిపెండెంట్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌ రెడ్డిని టీచర్ల సమస్యలపై ప్రశ్నించినందుకు తనను కాలేజీ వదిలి వెళ్లాలని ఆదేశించారని ఆమె పేర్కొన్నారు. లెక్చరర్లకు చాలా సమస్యలు ఉన్నాయని, ప్రిన్సిపల్‌ భయంతో ఎవరూ బయటికి రావడం లేదని ఆరోపించారు.
short by Bikshapathi Macherla / 10:45 pm on 28 Feb
తెలంగాణలో రానున్న రోజుల్లో హెల్త్ టూరిజం పాలసీ తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డా.నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించడంతో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలతో పాటు విదేశీయులకు వైద్య సేవలందించే హబ్‌గా తెలంగాణను తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 1000 ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు.
short by Devender Dapa / 11:34 pm on 28 Feb
మహాకుంభమేళ సమయంలో యూపీలో కొన్ని చోట్ల హైవేలపై తెలుగులో రాసిన ఊర్ల పేర్లు కనిపించాయి. దీనిపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఆయనను కలిసినపుడు తెలుగు భక్తులకు ఇబ్బంది కలగకుండా రహదారుల వివరాలు తెలిపే బోర్డులు తెలుగునూ ఉండేలా చూడాలని కోరినట్లు చెప్పారు. తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారంటూ యూపీ సీఎంకు లేఖ రాశారు.
short by Devender Dapa / 10:58 pm on 28 Feb
నంద్యాల జిల్లా అయ్యలూరు గ్రామంలో చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదైన లింగమయ్య అనే వ్యక్తి, తాను బతికే ఉన్నానని, పింఛన్‌ ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. 2022లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకుని, చికిత్స కోసం కర్నూలులో ఉంటున్నట్లు బాధితుడు తెలిపాడు. అయితే 2021 సెప్టెంబర్‌లోనే తాను చనిపోయినట్లు రికార్డుల్లో నమోదైందని, రేషన్‌ రావడం లేదని, తనను బతికి ఉన్నట్లుగా గుర్తించాలని కోరాడు.
short by Bikshapathi Macherla / 11:47 pm on 28 Feb
హైదరాబాద్‌ గాంధీభవన్‌లో శుక్రవారం జరిగిన టీపీసీసీ సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ పొరపాటున జై జగన్‌ అని నినదాలు చేశారు. మొదట రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఛైర్మన్‌ బెల్లయ్య నాయక్‌ తన ప్రసంగం ముగిసిన అనంతరం జై జగన్ అని నినదించారు. అనంతరం తన ప్రసంగం చివరలో "జై హింద్‌, జై భారత్‌, జై జగన్‌" అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
short by Bikshapathi Macherla / 09:01 pm on 28 Feb
గతేడాది తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనక వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రిమాండ్ రిపోర్టులో ఉందని ‘ఈనాడు’ తెలిపింది. దాని ప్రకారం, సజ్జల రాసిచ్చిన స్క్రిప్టు మేరకే పవన్‌, లోకేశ్‌లపై విమర్శలు చేశానని పోసాని చెప్పినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. తన మాట్లాడిన మాటలను సజ్జల తనయుడు భార్గవరెడ్డి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసేవాడన్నారు.
short by Devender Dapa / 12:09 am on 01 Mar
తన అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్‌కు మొదటి విదేశీ అతిథిగా పాకిస్థాన్ నుంచి ఒక వ్యోమగామిని పంపాలని చైనా యోచిస్తోంది. పాకిస్థాన్ వ్యోమగాములను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి, వారిలో కొందరిని తియాంగాంగ్‌కు పంపే ద్వైపాక్షిక ప్రయత్నాలతో సహా ఇరు దేశాలు శుక్రవారం ఒక ఒప్పందంపై సంతకం చేశాయని చైనా మ్యాన్‌డ్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ప్రధానంగా చైనా గత కొన్ని ఏళ్లుగా పాకిస్థాన్ ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగిస్తోంది..
short by / 10:13 pm on 28 Feb
దిల్లీలో బంగారం ధరలు శుక్రవారం రూ.500 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రెండు వారాల కనిష్ట స్థాయి రూ.87,700కి చేరుకుంది. వెండి వరుసగా మూడో రోజు నష్టాలను చవిచూసింది. ఇది కిలోకు రూ.2,100 తగ్గి రూ.96,400కి చేరుకుంది. "సూచీల్లో డాలర్ బలంగా పుంజుకోవడం వల్ల బంగారం & వెండి క్షీణించాయి" అని మెహతా ఈక్విటీస్ రాహుల్ కలాంత్రి తెలిపారు.
short by / 10:55 pm on 28 Feb
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద అన్నయ్య రాజబాబు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని జయప్రద ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ. "అన్నయ్య రాజబాబు చనిపోయారని చెప్పడం చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా," అని తెలిపారు. రాజబాబు నటుడు & చిత్ర నిర్మాత అని, చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని నివేదికలు పేర్కొన్నాయి.
short by / 11:32 pm on 28 Feb
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల వేడుకల తర్వాత 2025 మహా కుంభమేళా బుధవారం ముగిసింది. తదుపరి కుంభమేళా 2027లో మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నాసిక్ నుంచి దాదాపు 38-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వర్‌లో జరుగుతుంది. 2027లో జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు 30 రోజుల పాటు ఈ కుంభమేళా జరుగుతుందని నివేదికలు తెలిపాయి.
short by / 12:02 am on 01 Mar
భారతీయ శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా కారణంగా 1974లో దేశం తన మొదటి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అలాగే విక్రమ్ సారాభాయ్, డాక్టర్ జగదీష్ చంద్రబోస్, సత్యేంద్రనాథ్ బోస్, ఏపీజే అబ్దుల్ కలాం, జయంత్ విష్ణు నార్లికర్ & సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ వంటి ప్రముఖుల కృషి ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను మరింత పెంచింది.
short by / 11:16 pm on 28 Feb
శుక్రవారం జరిగిన WPL 2025 మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై ఇండియన్స్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి, టోర్నమెంట్‌లో వారిపై 2వ విజయాన్ని నమోదు చేసుకుంది. కెప్టెన్ మెగ్ లానింగ్ 60*(49) పరుగులు చేయడంతో దిల్లీ 124 పరుగుల లక్ష్యాన్ని 33 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో దిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, ముంబయి ఇండియన్స్ రెండో స్థానానికి పడిపోయింది.
short by / 11:19 pm on 28 Feb
UPI లావాదేవీలు జనవరి నెలలో మొదటిసారిగా 16.99 బిలియన్లను అధిగమించాయని ప్రభుత్వ తాజా గణాంకాల తెలిపాయి. వీటి విలువ రూ.23.48 లక్షల కోట్లను దాటింది. ఇది గతంలోని నెలలకు సంబంధించిన గణాంకాల పరంగా అత్యధిక మొత్తం అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, డిజిటల్ చెల్లింపులు ప్రతి నెలా మెరుగుపడుతున్నాయని వివరించింది. భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు UPI మూలస్తంభంగా మారింది.
short by / 11:25 pm on 28 Feb
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025 కోసం తమ సన్నాహాలను ప్రారంభించిన సందర్భంగా మైదానంలో ఎంఎస్ ధోని & రవిచంద్రన్ అశ్విన్ కలిసి కనిపించారు. ఫిబ్రవరి 27న ఎక్స్ వేదికగా CSK ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ధోని & అశ్విన్ ఇద్దరూ CSK ప్రాక్టీస్ జెర్సీలో మైదానం వైపు నడుస్తున్నట్లు ఉంది. ఈ వీడియోను పంచుకుంటూ చెన్నై "మనం చాలా దూరం వెళ్దాం.#whisleblow #yellow," అని పేర్కొంది.
short by / 08:50 pm on 28 Feb
Load More
For the best experience use inshorts app on your smartphone