నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, ఇది రాబోయే 12 గంటల్లో తుపానుగా బలపడొచ్చని APSDMA గురువారం తెలిపింది. ఆపై 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరం వైపు రావొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో శని, ఆది వారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది.
short by
srikrishna /
02:15 pm on
27 Nov