For the best experience use Mini app app on your smartphone
కొత్త మొబైల్స్‌లో సంచార్‌ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ముందుగానే ఇన్‌స్టాల్‌ చేయాలంటూ ఇచ్చిన తన ఉత్తర్వును కేంద్రం బుధవారం వెనక్కి తీసుకుంది. "సంచార్ సాథికి ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా, ప్రీఇన్‌స్టాలేషన్‌ తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది,” అని కమ్యూనికేషన్స్‌ శాఖ తెలిపింది. ఈ యాప్‌ను తొలగించే వీలుండదని తొలుత వార్తలు రాగా, డిలీట్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
short by srikrishna / 04:25 pm on 03 Dec
అప్పుడే పుట్టిన పసికందును ఓ బాత్‌రూమ్‌ ఎదుట చలిలో వదిలేసి వెళ్లిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఉన్న రైల్వేవర్కర్స్‌ కాలనీలో చోటుచేసుకుంది. రాత్రంతా ఆ శిశువు చుట్టూ వీధికుక్కల గుంపు కవచంలా నిలబడి కాపలా కాశాయి. తెల్లవారిన తర్వాత కుక్కల మధ్యలో ఉన్న పసిబిడ్డను స్థానికులు గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. రాత్రంతా కుక్కలు ఎవరినీ పసికందు దగ్గరకు రానివ్వలేదని వారు తెలిపారు.
short by srikrishna / 03:15 pm on 03 Dec
మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో సైదులుబాబు అనే వ్యక్తి ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, 9వ తరగతి చదివే ఆమె కుమార్తెను కూడా లైంగికంగా వాడుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భవతి కావటంతో 2 నెలల కిందట ఆమె తల్లి సాయంతో రహస్యంగా అబార్షన్‌ చేయించాడు. ఇటీవల ఆ బాలికకు వివాహం చేసేందుకు ప్రయత్నించగా సఖి కేంద్ర నిర్వాహకులు అడ్డుకున్నారు. వారు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో బాలిక అబార్షన్‌ విషయం వెల్లడించింది.
short by srikrishna / 12:18 pm on 03 Dec
దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం పీఎం నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ నెల 8, 9న నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. అలాగే హైదరాబాద్​ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అనుమతులు, హైదరాబాద్​ రీజినల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని వారు విన్నవించారు.
short by srikrishna / 02:31 pm on 03 Dec
కోనసీమ కొబ్బరికి దిష్టి తగిలిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ మాట్లాడటం బాధాకరమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ‘’ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడమే. ఇది పవన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు,’’ అని షర్మిల పేర్కొన్నారు.
short by srikrishna / 04:48 pm on 03 Dec
వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉన్న ఐదేళ్లలో విమాన ప్రయాణాలకు రాష్ట్ర ఖజానా నుంచి రూ.222 కోట్లు ఖర్చు చేశారని NDTV కథనం పేర్కొంది. ఇందులో విమానాల కోసం రూ.112.50 కోట్లు, హెలికాప్టర్ ఛార్జీలకు రూ.87.02 కోట్లు, నిర్వహణ కోసం రూ.23.31 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఈ కథనాన్ని మంత్రి నారా లోకేశ్‌ షేర్‌ చేస్తూ, ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా జగన్‌ విహారయాత్రల కోసం రూ.222 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.
short by srikrishna / 11:45 am on 03 Dec
అనంతపురం జిల్లా నార్పలకు చెందిన వైసీపీ నాయకుడు పట్నం ఫణీంద్ర ఓ మహిళతో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న వీడియో వైరల్‌గా మారింది. పార్టీ శింగనమల నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా ఉన్న అతడు ఆ మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నట్లు సమాచారం. మంగళవారం ఆ రాసలీలల వీడియోను స్థానిక వాట్సప్‌ గ్రూపులో ఫణీంద్రనే పోస్టు చేసి వెంటనే తొలగించాడు. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేసి, వీడియోను షేర్ చేశారని అతడు చెప్పుకొచ్చాడు.
short by srikrishna / 01:42 pm on 03 Dec
సత్యసాయి జిల్లా నల్లచెరువులోని ఏపీ గ్రామీణ బ్యాంకులో ఓ మహిళ నుంచి ఇద్దరు వ్యక్తులు రూ.18,000 కాజేశారు. రూ.50 వేలు డిపాజిట్ చేసేందుకు సదరు మహిళ వచ్చింది. నగదుతో పాటు డిపాజిట్ ఫారమ్, పాస్ బుక్ చేతిలో పట్టుకుని ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఇద్దరు డిపాజిట్ ఫారమ్ రాసి ఇస్తామని నగదు కాజేశారు. క్యాషియర్ డబ్బు లెక్కించేటపుడు రూ.18వేలు తక్కువ రావడంతో విషయం తెలిసింది. సీసీటీవీలో చోరీ దృశ్యాలు కనిపించాయి.
short by / 01:52 pm on 03 Dec
బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, సభా కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఎంపీలు సభలో ఫొటోలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కొంతమంది ఎంపీలు ఫొటోలు తీస్తున్న తీరుపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, "మీరు ఈరోజు ఫోటోలు తీశారు. మీరు మరోసారి ఇలాగే ఫోటోలు తీస్తే, నేను కచ్చితంగా చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సభ. దాని గౌరవాన్ని కాపాడండి," అన్నారు.
short by / 02:13 pm on 03 Dec
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2010 తర్వాత తొలిసారి విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ టోర్నమెంట్‌లో అతను 3 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. ప్లేయింగ్ ఎలెవన్‌లోని సీనియర్ ఆటగాళ్ల మాదిరిగానే, కోహ్లీకి మ్యాచ్‌కు రూ.60,000 చొప్పున ఫీజు లభిస్తుంది. ఈ టోర్నమెంట్‌లో ఆడటం ద్వారా అతను దాదాపు రూ.1.80 లక్షలు సంపాదిస్తాడు. విరాట్‌ దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
short by / 12:34 pm on 03 Dec
మహారాష్ట్రలోని పుణెలో టైర్‌ పగిలినా ఆపకుండా మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును వేగంగా నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారు ఓ పక్కకు వంగిపోయినా.. డ్రైవర్ మాత్రం ఆపలేదు. ఇది గమనించిన ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రోడ్డుపై చెక్‌పాయింట్ ఏర్పాటు చేసి పోలీసులు కారును అడ్డుకున్నారు. మద్యం తాగి వాహనం నడిపినందుకు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
short by / 12:41 pm on 03 Dec
Xiaomi ఈ నెల చివర్లో చైనాలో Xiaomi 17 Ultraను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఇందులో ఫొటోల్లో క్లారిటీ పెంచేందుకు కొత్త లైకా లెన్స్ ఉపయోగించారు. ఫ్లాగ్‌షిప్ 1-అంగుళాల 50MP సెన్సార్, 200MP పెరిస్కోప్ లెన్స్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్, 6,000-7,000mAh బ్యాటరీ, ఫ్లాట్ డిస్‌ప్లే, శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇదే ఫోన్‌లో అప్‌డేటెడ్‌ ట్రిపుల్-కెమెరా ఫీచర్‌ కూడా ఉండనుంది.
short by / 12:47 pm on 03 Dec
రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి, మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఇప్పుడు వన్డే క్రికెట్‌లో వరుసగా 20 టాస్‌లు ఓడిపోయింది. పదిలక్షల సార్లు టాస్ వేస్తే.. ఇలా జరిగేందుకు ఒక్కసారి అవకాశం ఉంటుంది. భారత్ చివరిసారిగా 2023 నవంబర్‌లో వన్డే ప్రపంచ కప్ సందర్భంగా వన్డే క్రికెట్‌లో టాస్ గెలిచింది. తుది జట్టులో మార్పుల్లేకుండానే భారత్ బరిలోకి దిగింది.
short by / 02:07 pm on 03 Dec
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన వివాహ సమయంలో భర్తకు ఇచ్చిన నగదు, బంగారాన్ని తిరిగి పొందే హక్కు కలిగి ఉంటుందని సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు చెప్పింది. ఈ హక్కు ముస్లిం మహిళా చట్టం, 1986 కింద ఉందని పేర్కొంది. గతంలో ఇలా ఇవ్వలేమని కలకత్తా హైకోర్టు తీర్పు ఇవ్వగా, సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది. వివాహ సమయంలో ఇచ్చిన మొత్తాన్ని నేరుగా మహిళ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని భర్తను ఆదేశించింది.
short by / 02:55 pm on 03 Dec
దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో మైక్రోసాఫ్ట్ చెక్-ఇన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా బుధవారం హైదరాబాద్ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. విమానాల ఆలస్యంపై ఎయిర్‌పోర్ట్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. సాంకేతిక లోపం కారణంగా కొన్ని ఎయిర్‌పోర్ట్‌లలో సిబ్బంది మాన్యువల్ చెక్-ఇన్‌లను ప్రయత్నించారు. దీంతో ప్రయాణికులు చాలా సేపు క్యూలైన్‌లలో ఉండాల్సి వచ్చింది.
short by / 03:52 pm on 03 Dec
ఆదివారం రాంచీలో జరిగిన వన్డేలో సెంచరీ సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను అధిగమించి నాలుగో స్థానానికి చేరాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 751 రేటింగ్ పాయింట్లు ఉండగా, 738 రేటింగ్ పాయింట్లతో గిల్ ఐదో ప్లేసుకు పడిపోయాడు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 783 రేటింగ్ పాయింట్లతో వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
short by / 03:49 pm on 03 Dec
వైట్ హౌస్ విడుదల చేసిన డేటా ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రోజుకు కనీసం 12 గంటలు పనిచేస్తారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, ట్రంప్ వారాంతపు విధులను మినహాయించి వారానికి సగటున 50 గంటలు పనిచేస్తున్నారు. 79 ఏళ్ల ట్రంప్ వయసు ప్రభావంతో పనుల్లో వేగం తగ్గిందనే ఆరోపణల మధ్య వైట్‌ హౌస్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ట్రంప్‌ చాలా రోజుల్లో ఉదయం 11 గంటలకంటే ముందే పని ప్రారంభిస్తారు.
short by / 04:03 pm on 03 Dec
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. 52 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు.. మొత్తంగా 77 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్‌గా అతడికి ఇది రెండో అంతర్జాతీయ సెంచరీ. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన T20Iలో గైక్వాడ్‌ 123*(57) పరుగులు చేశాడు. గైక్వాడ్ ఇప్పటివరకు ఎనిమిది వన్డేలు ఆడాడు.
short by / 04:27 pm on 03 Dec
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో వన్డే సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌లో అతడు 90 బంతుల్లోనే మూడంకెల మార్కును చేరుకున్నాడు. ఇది వన్డే క్రికెట్‌లో కోహ్లీకి 53వ సెంచరీ కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 84వ సెంచరీ కావడం గమనార్హం. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో దక్షిణాఫ్రికాపై 10 అంతర్జాతీయ సెంచరీలు కొట్టాడు.
short by / 04:30 pm on 03 Dec
క్రికెటర్ స్మృతి మంధానతో వివాహం వాయిదా పడిన కొన్ని రోజుల తర్వాత, సంగీతకారుడు పలాష్ ముచ్చల్ ఇటీవల బృందావనంలోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఇందులో పలాష్‌ ఆశ్రమంలో ముందు వరుసలో చేతులో జోడించి కూర్చుకున్నట్లు ఉంది. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా వారి వివాహం నిరవధికంగా వాయిదా పడింది.
short by / 12:32 pm on 03 Dec
12% రాబడితో నెలకు రూ.14,000 SIP (క్రమానుగత పెట్టుబడి విధానం)లో పెట్టుబడి పెడితే 18.5 సంవత్సరాలలో రూ.75.24 లక్షల రాబడి ఇస్తుందని ఎన్డీటీవీ ప్రాఫిట్ అంచనా వేసింది. దాని ప్రకారం, ఆ సిప్‌తో మొత్తం రూ.1.06 కోట్ల కార్పస్ లభిస్తుంది. అయితే ఈ SIPను ఏడాదికి 10% పెంచుకుంటూ పోతే 14 సంవత్సరాలలో రూ.1.01 కోట్లకు పెరుగుతుంది. 12% వార్షిక రాబడి అంచనాతో ఈ మొత్తం మీకు దక్కుతుంది.
short by / 12:44 pm on 03 Dec
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బాత్రూమ్‌కు వెళ్ళినప్పుడు కూడా ఆయనతో పాటు బాడీగార్డ్స్‌ ఉంటారని నివేదికలు తెలిపాయి. మరోవైపు ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు, విదేశీ నిఘా సంస్థలు ఆయన ఆరోగ్యాన్ని విశ్లేషించకుండా అడ్డుకునేందుకు పుతిన్‌ మలాన్ని సైతం అధికారులు తిరిగి రష్యాకే పంపిస్తున్నారు. పుతిన్‌కు బాడీగార్డ్‌గా ఉండాలంటే.. 5.8–6.2 అడుగుల ఎత్తు, 75 నుంచి 90 కిలోల బరువు ఉండాలి.
short by / 02:48 pm on 03 Dec
భారత్‌కు చెందిన ట్రక్‌ డ్రైవర్‌ రాజిందర్‌ కుమార్‌ను అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు. 32 ఏళ్ల రాజిందర్‌ 2022లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడు నడిపిన ట్రక్కు వెళ్లి కారును ఢీకొట్టడంతో అందులోని 25 ఏళ్ల విలియం కార్టర్, 24 ఏళ్ల జెన్నీఫర్ మృతి చెందారు. వీరిద్దరికీ ఇటీవలే వివాహం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత రాజిందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
short by / 03:56 pm on 03 Dec
రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన తర్వాత, పిచ్‌పైకి దూసుకెళ్లి అతడి కాళ్లపై పడిన అభిమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ అభిమానిని పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల గ్రామానికి చెందిన కళాశాల విద్యార్థి సౌభిక్ ముర్ముగా గుర్తించారు. సౌభిక్ కోహ్లీకి వీరాభిమాని అని అతడి తండ్రి చెప్పారు.
short by / 12:26 pm on 03 Dec
క్రికెటర్ స్మృతి మంధానతో తన వివాహం వాయిదా పడిన కొన్ని రోజులకు సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ యూపీలోని బృందావన్‌లో ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్‌ను దర్శించుకున్నారు. పలాష్ ముందు వరుసలో కూర్చొని చేతులు జోడించి ప్రార్థిస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా, స్మృతి తండ్రి అనారోగ్యానికి గురికావడంతో స్మృతి, పలాష్ వివాహం ముహూర్తానికి కొద్దిసేపటి ముందే వాయిదా పడింది.
short by / 12:40 pm on 03 Dec
Load More
For the best experience use inshorts app on your smartphone