దేశ రాజధాని దిల్లీలో బంగారం ధరలు మంగళవారం 10 గ్రాములకు రూ.1,670 తగ్గి రూ.1,31,530కు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఇక ఇదే సమయంలో దిల్లీలో వెండి ధరలు వరుసగా ఆరో సెషన్లో పెరిగాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.4,360 పెరిగి రూ.1,81,360కి చేరుకుంది. సోమవారం వెండి ధర కిలోకు రూ.5,800 పెరిగింది. ఈ ఏడాది బంగారం ధర ఇప్పటికే 60 శాతానికి పైగా పెరగడం గమనార్హం.
short by
/
07:25 pm on
02 Dec