For the best experience use Mini app app on your smartphone
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత తన ఫొటోలు వైరల్‌గా మారడం వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాలను సినీ నటి గిరిజా ఓక్ తాజాగా వెల్లడించారు. తనకు సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు వచ్చాయని చెప్పారు. 'మీతో ఒక గంట గడపడానికి ఎంత ఖర్చవుతుంది?' అంటూ ఒకరు తన రేటు అడిగారని ఆమె తెలిపారు. "ఇలాంటి సందేశాలు చాలా ఉన్నాయి,” అని 37 ఏళ్ల గిరిజా అన్నారు. ఆమె ‘షోర్ ఇన్ ది సిటీ' అనే చిత్రంలో సందీప్ కిషన్ సరసన నటించారు.
short by srikrishna / 01:27 pm on 26 Nov
హాంకాంగ్‌లోని థాయ్‌ పొ జిల్లాలో గల ఓ నివాస సముదాయంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో నలుగురు మరణించగా, వందలాది మంది చిక్కుకున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. 31 అంతస్తుల ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 2000కు పైగా ఫ్లాట్స్‌ ఉన్నట్లు పేర్కొన్నాయి. ఘటనా స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.
short by Srinu / 05:01 pm on 26 Nov
నటుడు బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కలయికలో రూపొందనున్న సినిమా (#NBK111) బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘వీర సింహారెడ్డి’ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. ఈ మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌. బాలకృష్ణ-నయనతార కాంబోలో ఇప్పటికే ‘సింహా’, ‘జైసింహా’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.
short by srikrishna / 01:25 pm on 26 Nov
కృష్ణా జిల్లా పెదపారుపూడిలోని ఓ ఫంక్షన్‌లో వేడి సాంబారు గిన్నెలో పడి ప్రేరణ అనే 4ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులతో కలిసి రాత్రి వేళ ఫంక్షన్‌కు వెళ్లిన ప్రేరణ ఆడుకుంటూ భోజనాల కోసం సిద్ధం చేసిన సాంబారు గిన్నెపై కూర్చుంది. ప్లేటు పక్కకు ఒరగడంతో ఒక్కసారిగా వేడి సాంబారులో పడిపోయింది. దీంతో చిన్నారి శరీరం పూర్తిగా కాలింది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయింది.
short by Srinu / 03:42 pm on 26 Nov
మూవీ పైరసీ వెబ్‌సైట్‌ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవికి మరో కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇమంది రవిపై ఇప్పటి వరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మొత్తం 5 కేసులు నమోదు చేశారు. మిగిలిన 3 కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఆ 3 కేసుల్లో కూడా అరెస్టు చూపనున్నారు. కాగా 21 వేల సినిమాలను పైరసీ చేసిన రవిని పోలీసులు న‌వంబ‌రు 15న అరెస్టు చేశారు.
short by Devender Dapa / 04:36 pm on 26 Nov
ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్‌ఎస్‌ఎన్‌ ఇన్ఫోటెక్‌ కంపెనీ సుమారు 400 మంది విద్యార్థుల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసి మోసం చేసింది. శిక్షణ ఇచ్చి, ఉద్యోగం ఇస్తామని విద్యార్థులను మోసం చేసి, వసూలు చేసిన డబ్బులతో ఎన్‌ఎస్‌ఎన్‌ ఇన్ఫోటెక్‌ కంపెనీ డైరెక్టర్‌ స్వామినాయుడు పారిపోయాడు. దీంతో బాధితులు బుధవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు.
short by Srinu / 05:12 pm on 26 Nov
కరీంనగర్లోని వావిలాలపల్లిలో ఓ ఇంటి ప్రాంగణంలోకి నక్క దూరడం కలకలం రేపింది. మంగళవారం ఇంట్లోకి నక్క వచ్చిందని ఇంటి యజమాని తెలిపారు. ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చామని, వారు వచ్చేసరికే గేటు నుంచి తప్పించుకుని పారిపోయిందన్నారు. నక్క తోక తొక్కితే అదృష్టంగా భావిస్తారని, అలాంటిది నక్కే తమ ఇంటికి రావడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. గత నెలలో కరీంనగర్‌లోని సైదాపూర్‌లోని ఓ ఇంటి ఆవరణలోకి ఎలుగుబంటి వచ్చింది.
short by Devender Dapa / 03:56 pm on 26 Nov
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే మార్చి 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ‘ఈనాడు’ పేర్కొంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కో పరీక్ష మధ్య 1-2 రోజుల వ్యవధి ఇవ్వాలని, దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోందని నివేదించింది. ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ 2-3 రకాల షెడ్యూళ్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పరీక్షల తేదీల ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
short by srikrishna / 04:59 pm on 26 Nov
ఔటర్ రింగ్ రోడ్డు(ORR) లోపల, దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 నగర, పురపాలక సంఘాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (GHMC)లో విలీనం చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. దీనికోసం GHMC చట్టం, తెలంగాణ మున్సిపల్‌ చట్టాలకు సవరణలు చేయనుంది. విలీన ప్రక్రియ ముగిశాక 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంట్‌ & 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్‌ అవతరించనుంది.
short by srikrishna / 01:52 pm on 26 Nov
గుంటూరు శివారులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలోని ఓ రూమ్‌లో మహిళా డాక్టర్లు, వైద్య విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటుండగా గోడపై నుంచి ఫోన్‌తో వీడియో తీసిన వెంకటసాయి అనే మేల్‌ నర్స్‌ను ప్రత్తిపాడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వెంకటసాయి నెల రోజుల క్రితమే ఈ ఆస్పత్రిలో చేరినట్లు DSP భానోదయ చెప్పారు. ‘’నిందితుడి ఫోన్‌లో 200 వీడియోలు ఉన్నట్లు సమాచారం అందింది. కానీ దానికి ఆధారాల్లేవు,’’ అని తెలిపారు.
short by Srinu / 02:30 pm on 26 Nov
తిరుమలలోని పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునికీకరణకు ప్రవాస భారతీయుడైన రామలింగరాజు మంతెన బుధవారం రూ.9 కోట్లు విరాళం అందజేశారు. తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజు పేరిట దీన్ని ఇచ్చారు. 2013లోనూ ఆయన టీటీడీకి రూ.16 కోట్లు విరాళం అందించారు. 2017లోనూ శ్రీవారికి రూ.8 కోట్ల విలువైన బంగారు సహస్ర నామ కాసుల హారాన్ని బహుకరించారు. ఈ నెల 23న నేత్ర, ఎన్నారై వంశీ వివాహం ఉదయ్‌పుర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
short by srikrishna / 03:59 pm on 26 Nov
హైదరాబాద్‌లో రెండేళ్లుగా ఐఏఎస్, ఐపీఎస్‌, ఎన్‌ఐఏ అధికారినంటూ వసూళ్లకు పాల్పడుతున్న బత్తుల శశికాంత్‌ను ఫిల్మ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అధికారిగా కనిపించేందుకు శశికాంత్ ప్రత్యేకంగా బాడీగార్డులు, వాకీ టాకీలతో పాటు సైరన్‌ అమర్చిన ఓ కారు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. ఫేక్ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎన్‌ఐఏ ఐడీ కార్డులు తయారు చేసి, అధికారిక లేఖల వరకు ఫోర్జరీ చేశాడని, రూ.18 లక్షలు వసూలు చేశాడని చెప్పారు.
short by Devender Dapa / 04:21 pm on 26 Nov
‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమా ప్రీమియర్‌ షోకు వచ్చిన కొందరు మధ్యలోనే వెళ్లిపోయారని, అలా వెళ్లిపోవడం దర్శకుడిని అవమానించినట్లేనని ఆ సినిమా నిర్మాత వేణు ఊడుగుల అన్నారు. ‘’రిలీజ్‌కు ముందు మూవీని కొందరికి చూపించాం. అందులో కొందరు ఇంటర్వెల్‌ తర్వాత చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. దొంగల్లా పరిగెట్టారు. అది మర్యాదేనా?,’’ అని ప్రశ్నించారు. అలా వెళ్లిన వాళ్లు సినిమాపై నెగెటివ్‌ ప్రచారం మొదలుపెట్టారన్నారు.
short by Srinu / 03:16 pm on 26 Nov
కాంగ్రెస్‌ ప్రభుత్వం దాదాపు రూ.50వేల కోట్ల పవర్‌స్కామ్‌కు తెరలేపిందని, ఇందులో పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుతో 30, 40% కమీషన్లు తీసుకునేందుకు యత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘‘రేవంత్‌ ప్రభుత్వం ఏం చేసినా ఒక మిషన్‌ ఉంటుంది. ఆ మిషనే కమీషన్‌. కమీషన్లు ఎలా కొల్లగొట్టాలని మాత్రమే ఆయన ప్రభుత్వం ఆలోచిస్తోంది,’’ అని హరీశ్‌ చెప్పారు. వాటాల పంపిణీ విషయంలో మంత్రులు ఘర్షణ పడుతున్నారని తెలిపారు.
short by Srinu / 05:25 pm on 26 Nov
తెలంగాణలోని 12,728 పంచాయతీలకు డిసెంబర్‌లో ఎన్నికలు జరగనుండగా, ఇందులో 46% (5,849) సర్పంచ్‌ స్థానాలను మహిళలకు కేటాయించారు. వీటిలో ST మహిళ- 1464, ST జనరల్‌-1737, SC మహిళ- 928, SC జనరల్‌ -1182, BC మహిళ- 968, BC జనరల్‌- 1210, యూఎన్‌ మహిళ- 2489, యూఎన్‌ జనరల్‌- 2757 ఉన్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 404 గ్రామాలు ఆడవాళ్లకు కేటాయించారు. షెడ్యూల్‌ ప్రాంతాల్లో సర్పంచ్‌ స్థానాలు పూర్తిగా ఎస్టీలకే దక్కాయి.
short by srikrishna / 02:16 pm on 26 Nov
దక్షిణ థాయిలాండ్, పొరుగున ఉన్న మలేషియా వ్యాప్తంగా తీవ్రమైన వరదలు సంభవించి, 33 మంది చనిపోగా, 10 వేల మంది నిరాశ్రయులయ్యారు. కుండపోత వర్షాలు హాట్ యాయ్, ఏడు ప్రావిన్సులను ముంచెత్తడంతో థాయిలాండ్ సాంగ్‌ఖ్లాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 10 వేలమందికి పైగా ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి, క్యాంపస్‌లను ఆశ్రయాలుగా మార్చారు.
short by / 03:37 pm on 26 Nov
చెన్నైలోని యూఎస్ కాన్సులేట్‌లో హెచ్-1బి వీసా ప్రాసెసింగ్‌లో భారీ అవకతవకలు జరిగాయని యూఎస్ మాజీ కాంగ్రెస్ సభ్యుడు, ఆర్థికవేత్త డా.డేవ్ బ్రాట్ ఆరోపించారు. "85,000 హెచ్-1బి వీసాల పరిమితి ఉంటే, భారత్‌లోని ఒకే జిల్లా (చెన్నై) 220,000 వీసాలను పొందింది, ఇది దాని పరిమితికి రెండున్నర రెట్లు ఎక్కువ. ఇది ఒక స్కామ్," అని బ్రాట్ పేర్కొన్నారు.
short by / 05:27 pm on 26 Nov
26/11 దాడులకు 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ NSG కమాండో సురేంద్ర సింగ్ తాజ్‌మహల్‌ హోటల్‌లో జరిగిన భయానక ఘటనలను గుర్తు చేశారు. కమాండోల ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఆగ్రహం ఉన్నప్పటికీ పాక్‌పై దాడి చేయకపోవడం, "నిష్క్రియాత్మకత"పై నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఉగ్రవాదులను శిక్షించేందుకు ఆపరేషన్ సిందూర్ వంటి బలమైన స్పందనతో నేటి భారత్ దృఢ సంకల్పాన్ని కనబరిచిందన్నారు.
short by / 05:48 pm on 26 Nov
26/11 ముంబై ఉగ్ర దాడులు జరిగి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాధితుల జ్ఞాపకార్థం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. "ఈ దాడులను ప్లాన్ చేయడంలో అతని పాత్రపై అమెరికా ఈ ఏడాది తహవ్వూర్ హుస్సేన్ రాణాను భారత్‌కు అప్పగించింది" అని పేర్కొంది. భారత ప్రభుత్వంతో కలిసి ఉగ్ర చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉండాలనే మా దృఢ సంకల్పానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది.
short by / 03:41 pm on 26 Nov
సింగపూర్‌లో గాయకుడు జుబీన్ గార్గ్ మృతి ప్రమాదం కాదని, హత్య అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ దర్యాప్తు విధానాన్ని ప్రశ్నించారు. "జుబీన్ గార్గ్‌కు న్యాయం జరుగుతుందని అస్సాం ప్రజలు నమ్మడం లేదు" అని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే సీఎం ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
short by / 01:26 pm on 26 Nov
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, తెలుగు, ఒడియా, అస్సామీలతో సహా 9 భాషల్లో భారత రాజ్యాంగం డిజిటల్ వెర్షన్లను విడుదల చేశారు. బోడో, కశ్మీరీ రాజ్యాంగ సంచికలను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వ సూత్రాలను ప్రశంసిస్తూ, ప్రవేశిక పఠనానికి కూడా రాష్ట్రపతి నాయకత్వం వహించారు.
short by / 03:03 pm on 26 Nov
ప్రతి ఉగ్రవాద దాడి కూడా తనకు అవే భయానక జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని 26/11 దాడిలో ప్రాణాలతో బయటపడిన యువతి దేవిక రోటవాన్‌ తెలిపారు. "ఆ ఘటన గురించి విన్నప్పుడల్లా నేను మళ్లీ నాటి ఘటన వైపు ఆలోచనలు వెళ్తాయి" అని ఆమె చెప్పారు. పేలుళ్ల శబ్దం ఇప్పటికీ తన చెవుల్లో ప్రతిధ్వనిస్తుందని గుర్తుచేసుకున్నారు. ఆ దాడిలో "ఒక వ్యక్తికి ఏమి జరుగుతుందో వారికి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది" అని దేవిక పేర్కొన్నారు.
short by / 01:17 pm on 26 Nov
26/11 ముంబై దాడులు జరిగిన 17 ఏళ్లు పూర్తయినా కీలక నిందితులైన హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్‌పై పాకిస్థాన్ చర్య తీసుకోలేదని మాజీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ విమర్శించారు. "మేం పాక్‌కు పత్రాలను పంపినప్పటికీ వారు మౌనంగా ఉన్నారు" అని ఆయన అన్నారు. దీనిపై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలన్నారు. "పాక్‌ ప్రజాస్వామ్యాన్ని నమ్మితే, ఈ వ్యక్తులపై చర్యలకు ఎందుకు భయపడుతున్నారు?" అని ప్రశ్నించారు.
short by / 01:20 pm on 26 Nov
కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తాను కలిసి పరిష్కరిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించిన 2.5 సంవత్సరాల కాలపరిమితి గత వారం ముగిసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. "మేం కలిసి కూర్చుని దీనిపై చర్చిస్తాం" అని ఖర్గే అన్నారు.
short by / 03:39 pm on 26 Nov
2012లో అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష అమలు ద్వారా "పాక్షిక న్యాయం" మాత్రమే జరిగిందని 26/11 ముంబై దాడుల బాధితురాలు దేవిక రోటవాన్ అన్నారు. నాడు ఒక పోలీసు అధికారి తనతో "నువ్వు గెలిచావు బిడ్డా" అని చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. "కసబ్ దోమ మాత్రమే" అని తొందర్లోనే గ్రహించానని చెప్పారు. కసబ్ లాంటి ఉగ్రవాదులను సృష్టించి, మద్దతు ఇచ్చే పాకిస్థాన్‌లోని వారు మూల్యం చెల్లిస్తేనే నిజమైన న్యాయం జరుగుతుందన్నారు.
short by / 01:31 pm on 26 Nov
Load More
For the best experience use inshorts app on your smartphone