For the best experience use Mini app app on your smartphone
సన్నబడాలని కొందరు రాత్రిపూట భోజనాన్ని మానేస్తారని.. పదే పదే ఇలా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. బాడీకి ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు, విటమిన్స్, మినరల్స్ డిన్నర్ నుంచే అందుతాయి. డిన్నర్ చేయకపోతే మెటబాలిజం స్లోడౌన్ అయిపోతుంది. ఎనర్జీ కోసం శరీరంలోని ఫ్యాట్ బర్న్ అయిపోవడంతో అలసిపోతారు. రాత్రికి రాత్రి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ పడిపోతాయి. దీంతో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.
short by Devender Dapa / 09:22 pm on 21 Jul
భారత్‌తో జరిగే 4వ టెస్ట్ కోసం ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ లెవెన్‌ను సోమవారం ప్రకటించింది. గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో స్పిన్నర్ లియామ్ డాసన్ తుది జట్టులోకి వచ్చాడు. 35 ఏళ్ల డాసన్.. 2017 జులై తర్వాత మొదటిసారి ఇంగ్లాండ్ టెస్టు జట్టు ప్లేయింగ్ లెవెన్‌లోకి వచ్చాడు. అతడు నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ బుధవారం ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
short by Devender Dapa / 09:04 pm on 21 Jul
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ (ఎం) సీనియర్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్ సోమవారం తిరువనంతపురంలో 101 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత నెల 23న గుండెపోటుతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన, సోమవారం తుది శ్వాస విడిచారు. 44 ఏళ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, 82 ఏళ్ల వయసులో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కేరళకు అత్యంత వృద్ధ ముఖ్యమంత్రిగా నిలిచారు. 2006 నుంచి 2011 వరకు ఆయన సీఎంగా పని చేశారు.
short by Devender Dapa / 07:18 pm on 21 Jul
భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారు. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి, వైద్యుల సలహాలు పాటించేందుకు తాను ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. తన పదవీ కాలంలో మద్దతుగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. 74 ఏళ్ల వయసులో జగదీప్‌ ధన్‌ఖడ్‌, 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.
short by Devender Dapa / 10:03 pm on 21 Jul
పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జులై 23న రాత్రి 9కి ప్రీమియర్ షోకు అనుమతిచ్చి, టికెట్ ధర రూ.600+GSTగా ఖరారు చేసింది. జులై 24 నుంచి మల్టీప్లెక్స్‌లో రూ.200+GST, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.150+GST పెంచుకునేందుకు వీలు కల్పించింది. కాగా ‘పుష్ప 2’ తొక్కిసలాట జరిగాక ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్‌ పెంపు ఉండవని ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.
short by Devender Dapa / 10:24 pm on 21 Jul
తెలంగాణలో ఇప్పటివరకు 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లోనూ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్‌ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ఆందోళన అవసరం లేదని సూచించారు. రాష్ట్రంలోని జిల్లాల పరిధిలోని ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్, సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
short by Devender Dapa / 10:37 pm on 21 Jul
మగవారిలో శృంగార సామర్థ్యం క్షీణించటానికి రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరగటమూ కారణమవుతున్నట్టు తాజాగా ENDO 2025 సమావేశంలో సమర్పించిన ఓ అధ్యయనం పేర్కొంటోంది. మధుమేహంగా గుర్తించే స్థాయిలో గ్లూకోజు పెరగాల్సిన అవసరమేమీ లేదని, ఒకింత ఎక్కువగా పెరిగినా కూడా శుక్ర కణాల వేగం నెమ్మదించటానికి, అంగ స్తంభన బలహీనం కావటానికి దారితీస్తున్నట్టు తేలింది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలనూ తగ్గిస్తుందని అధ్యయనం తెలిపింది.
short by srikrishna / 07:52 am on 22 Jul
అంగన్‌వాడీ కేంద్రాల్లో చక్కెర రహిత పౌష్టికాహారం అందించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ప్రస్తుతం అంగన్‌వాడీల్లో పిల్లలకు స్నాక్స్‌గా అందించే ఆహారంలో బలవర్ధక పదార్థాలు ఏమీ లేకపోగా, అది మధుమేహానికి దారితీస్తోందని పోషకాహార నిపుణులు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో చక్కెరకు బదులుగా మాంసకృత్తులు అధికంగా ఉండే పదార్థాలను ఆహార పట్టికలో చేర్చనున్నామని అధికారులు తెలిపారు.
short by srikrishna / 06:24 pm on 21 Jul
సంగారెడ్డి జిల్లా మోర్గి గ్రామంలోని మోడల్ పాఠశాలలోని హాస్టల్లో మాంసాహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి 60 మంది విద్యార్థినులు చికెన్ తినగా, అందులో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో 8 మంది కోలుకోవడంతో డిశ్ఛార్జ్‌ చేశామని, మిగిలిన వారు కూడా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
short by srikrishna / 06:48 pm on 21 Jul
పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కలమర్లపూడి వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా కారుమంచిలోని బీసీ కాలనీకి చెందినవారని నివేదికలు తెలిపాయి. ఆటోలో కారుమంచి నుంచి వినుకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
short by Devender Dapa / 09:20 pm on 21 Jul
యానాం వద్ద గౌతమి గోదావరిలో భైరవపాలెం సమీపంలో సుమారు రూ.2 కిలోల బరువున్న పులస చేప మల్లాడి ప్రసాద్ అనే మత్స్యకారుడి వలకు చిక్కింది. ఈ చేపను యానాం రాజీవ్‌ బీచ్‌లో వేలం నిర్వహించగా, రూ.22,000కు అమ్ముడైంది. పొన్నమండ రత్నం అనే మహిళ ఈ చేపను దక్కించుకున్నారు. కాగా గతేడాది ప్రసాద్ వలకు దొరికిన పులస చేప రూ.23,000లు పలికింది. 2024లో ఇక్కడ అత్యధిక ధర పలికిన పులస చేప అదే కావడం గమనార్హం.
short by Devender Dapa / 08:16 pm on 21 Jul
రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు ఆగస్టు 15 నుంచి జీరో ఫేర్‌ టికెట్‌ ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉచిత ప్రయాణంతో లబ్ధి, 100% రాయితీ వివరాలను మహిళలకు ఇచ్చే జీరో ఫేర్‌ టికెట్‌లో పొందుపర్చాలన్నారు. “ఈ పథకం ఆర్టీసీకి భారం కాకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలి. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్‌ బస్సులే కొనుగోలు చేయాలి. దీంతో నిర్వహణ వ్యయం తగ్గుతుంది,” అని చెప్పారు.
short by Devender Dapa / 08:20 pm on 21 Jul
తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి.. ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. జార్జియాలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ క్వార్టర్ ఫైనల్‌లో 1.5-0.5తో చైనాకు చెందిన యుక్సిన్‌ సాంగ్‌పై ఆమె విజయం సాధించింది. హంపి సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ లీ టింజీ (చైనా)తో తలపడుతుంది. టింజీ క్వార్టర్స్‌లో 2-0తో ననా జాగ్నిజె (జార్జియా)ను ఓడించింది.
short by / 08:33 pm on 21 Jul
మద్యం కుంభకోణంలో అరెస్టయిన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీ నంబరు 4196 కేటాయించారు. ఆదివారం రాత్రి జైలు వైద్యాధికారి ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. ఫలితాలన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని నిర్ధారించిన తరువాత ఆయన్ను గతంలో సీఎం చంద్రబాబు ఉన్న స్నేహ బ్యారక్‌కు తరలించారు. జైలు నిబంధనల ప్రకారమే ఆయనకు ఆహారం అందించామని ఓ అధికారి చెప్పారు.
short by srikrishna / 08:11 am on 22 Jul
ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో పదెకరాల భూమి వచ్చేదని.. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సీన్ రివర్స్ అయిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఏపీలో ఎకరా అమ్మితే ఇప్పుడు తెలంగాణలో రెండెకరాల భూమి వస్తుందన్నారు. “కాంగ్రెస్ 20 నెలల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. కేసీఆర్ హయాంలో నాట్లకు, నాట్లకు రైతు బంధు వచ్చేది. రేవంత్ రెడ్డి హయాంలో ఓట్లకు, ఓట్లకు మధ్య రైతు భరోసా వస్తుంది,” అని చెప్పారు.
short by Devender Dapa / 06:11 pm on 21 Jul
సొంత పార్టీకి చెందిన నేతలే తనపై దాడికి ప్రయత్నించారని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ ఆరోపించారు. ఆదివారం రాత్రి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తుండగా 20 బైక్‌లపై సుమారు 50 మంది దుండగులు ఎదురుగా వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. “గొల్లకొట్టు అనే వ్యక్తి నన్ను టార్గెట్ చేశారు. ఆయన వ్యవహారశైలిపై గత శుక్రవారం డీసీపీని కలిసి ఫిర్యాదు చేశా,” అని అన్నారు.
short by Devender Dapa / 06:56 pm on 21 Jul
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రూ.కోట్ల అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయమని శాప్‌ ఛైర్మన్‌ అనిమిని రవినాయుడు అన్నారు. గతంలో క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన ఆమె అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఆగస్టు 10లోపు జైలుకెళ్లక తప్పదని.. ఆమె అరెస్ట్‌కు వారెంట్‌ సిద్ధమవుతోందన్నారు. రోజా రోజులు లెక్కబెట్టుకోవాలని రవినాయుడు వ్యాఖ్యానించారు.
short by Devender Dapa / 07:56 pm on 21 Jul
రెండు నాగు పాములు సయ్యాట ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రెండు భారీ కోబ్రాలు ఒకదానికొకటి ఎదురుగా పడగవిప్పి నిలబడి ఉన్నాయి. ఒక్కసారిగా ఒక కోబ్రా తన పడగతో.. ఎదురుగా ఉన్న కోబ్రాపై దాడికి దిగుతుంది. దాంతో మరో కోబ్రా కూడా ఎదురుదాడికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియోకు 35 లక్షల వ్యూస్ వచ్చాయి. 10 లక్షల లైక్స్ వచ్చాయి.
short by / 08:35 pm on 21 Jul
సోమవారం బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన F-7 BGI శిక్షణ యుద్ధ విమానం రాజధాని ఢాకాలోని ఒక పాఠశాలపై కూలిపోవడంతో కనీసం 19 మంది మరణించారని అగ్నిమాపక సేవల అధికారి తెలిపారు. పిల్లలు, పెద్దలు సహా 50 మందికి పైగా కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ వైద్యుడు విలేకరులకు తెలిపారు.
short by / 06:18 pm on 21 Jul
ఇటలీలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ మ్యాజిక్‌లో భారత్‌కు చెందిన ప్రసిద్ధ ఇంద్రజాలికురాలు సుహానీ షా 'బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్' అవార్డును అందుకున్నారు. ఈ విభాగంలో ఒక భారతీయ ఆర్టిస్ట్‌ ఈ అంతర్జాతీయ గౌరవాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ మ్యాజిక్‌ను 'ఒలింపిక్స్ ఆఫ్ మ్యాజిక్' లేదా 'ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్' అని కూడా పిలుస్తారు. "మేం గెలిచాం" అని సుహానీ పేర్కొన్నారు.
short by / 06:21 pm on 21 Jul
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2025 ప్రకారం, సిరియాలోని డమాస్కస్ జీవించడానికి అనుకూలంగా లేని అత్యంత చెత్త నగరం. దీని తర్వాత ట్రిపోలి (లిబియా), ఢాకా (బంగ్లాదేశ్), కరాచీ (పాకిస్తాన్), అల్జీర్స్ (అల్జీరియా), లాగోస్ (నైజీరియా), హరారే (జింబాబ్వే), పోర్ట్ మోర్స్బీ (పాపువా న్యూ గినియా), కైవ్ (ఉక్రెయిన్), కారకాస్ (వెనిజులా) ఉన్నాయి. 173 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
short by / 06:40 pm on 21 Jul
అప్పులు చెల్లించినా కొందరు మానసికంగా వేధిస్తున్నారంటూ మెదక్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు 54ఏళ్ల రమేశ్‌ మేడ్చల్‌లోని ఓ లాడ్జిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హవేలిఘనపూర్‌ మండలం సర్ధన జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌, చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, చిట్టీలు నిర్వహించే రమేష్‌కు రూ.7 కోట్ల వరకు అప్పు ఉన్నట్లు సమాచారం.
short by / 07:06 pm on 21 Jul
ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్‌కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించాడు. లార్డ్స్‌ టెస్ట్‌లో అతడి వేలుకు గాయం కాగా.. తాజా వీడియోల్లో పంత్ పూర్తిగా కోలుకున్నట్లు కనిపించింది. దీంతో జులై 23 నుంచి మాంచెస్టర్‌లో జరిగే 4వ టెస్ట్‌లో అతడు ఆడతాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లార్డ్స్ టెస్ట్‌లో బుమ్రా బౌలింగ్‌లో కీపింగ్ చేస్తూ రిషభ్ పంత్ వేలికి గాయమైంది.
short by / 10:47 pm on 21 Jul
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాన్వాయ్‌లోని ఓ కారును ఆవు అకస్మాత్తుగా వచ్చి ఢీకొట్టిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. నివేదికల ప్రకారం, ముఖ్యమంత్రి రేవా విమానాశ్రయం నుంచి తన కాన్వాయ్‌తో సుందర్‌ నగర్‌లోని తన అత్తమామల ఇంటికి రోడ్డు మార్గంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
short by / 07:15 pm on 21 Jul
లక్కీ భాస్కర్ చిత్రానికి గద్దర్ అవార్డు ఇచ్చినందుకు నటుడు దుల్కర్ సల్మాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఫొటోలను దుల్కర్‌ ఆన్‌లైన్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు, సినీ పరిశ్రమకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లక్కీ భాస్కర్ ఉత్తమ ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే అవార్డులను కూడా గెలుచుకుంది.
short by / 06:30 pm on 21 Jul
Load More
For the best experience use inshorts app on your smartphone