For the best experience use Mini app app on your smartphone
భారత్-పాకిస్థాస్తాన్ వివాదం సమయంలో 32 విమానాశ్రయాల మూసివేతకు జారీ చేసిన నోటామ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు)ను కేంద్రం రద్దు చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ఎయిర్‌పోర్ట్‌లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తొలుత ఈనెల 15 వరకు వాటిని మూసివేయాలని భావించినప్పటికీ పరిస్థితులు మెరుగుపడటంతో వాటిని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు.
short by Devender Dapa / 01:11 pm on 12 May
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను పద్మనాభ సపాల్య అనే బీజేపీకి చెందిన గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడిపై కేసు నమోదైంది. రోడ్డు వివాదంలో ఒక మహిళను అసభ్యకరంగా తిడుతూ, రోడ్డుపై ఆమెకు ప్రైవేట్‌ పార్ట్స్‌ను చూపించాడు. ఈ ఘటనను ఆమె తన ఫోన్‌లో రికార్డు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసి బీజేపీ వెంటనే పద్మనాభను పార్టీ నుంచి బహిష్కరించింది.
short by Srinu / 12:59 pm on 12 May
మే 10న 2 దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహనపై చర్చించడానికి భారత్‌, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య చర్చలు ప్రారంభమ్యాయి. ఇందులో భారత డీజీఎంవో రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్‌కు చెందిన DGMO కాషిఫ్ అబ్దుల్లాలు పాల్గొన్నారు. భారత్‌, పాకిస్థాన్ శనివారం సైనిక చర్యను విరమించుకోవడానికి అంగీకరించాయి. ఈ విషయానికి సంబంధించి ఈ ఇద్దరు ఫోన్ కాల్‌లో మాట్లాడుతున్నారు.
short by Devender Dapa / 01:12 pm on 12 May
ఉక్రెయిన్–రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ మరోసారి శాంతి సూచన చేశారు. ఈ నెల 15న తుర్కియేలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. “ఈ యుద్ధాన్ని ఇక ముగించాల్సిన సమయం వచ్చింది. చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది,” అని జెలెన్‌స్కీ పేర్కొనడం గమనార్హం.
short by / 12:44 pm on 12 May
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ (CA)పరీక్షలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల మే 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ తాజాగా ప్రకటించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ పరీక్షలు మే 9 నుంచి 14 వరకు జరగాల్సింది.
short by / 12:13 pm on 12 May
హైదరాబాద్‌లోని కోకాపేటలో గల మైహోం తర్ష్కయ 1వ టవర్‌లో నివాసముంటున్న దిల్లీకి చెందిన 32 ఏళ్ల అమన్‌జైన్‌ 32వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అమన్‌ కొంతకాలంగా కుంగుబాటుతో ఉన్నాడని, దానికి చికిత్స కూడా తీసుకుంటున్నాడని పోలీసులు చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. అమన్‌, అతడి భార్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే.
short by Srinu / 12:33 pm on 12 May
ఏపీలో కూటమి ప్రభుత్వం మొత్తం 22 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఈ పోస్టుల్లో TDP–అమరావతి JACకి 18, జనసేనకు 3, BJPకి ఒక పోస్టు దక్కాయి. ఈ క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ, ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఆలపాటి సురేశ్, మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా పీతల సుజాత, SC కమిషన్‌కు కేఎస్ జవహర్, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా పసుపులేటి హరి ప్రసాద్ నియమితులయ్యారు.
short by / 12:16 pm on 12 May
దేశ రక్షణలో సేవలు అందిస్తున్న సైనికుల గౌరవార్ధం వారికి ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన X ఖాతాలో ప్రకటన చేశారు. రాష్ట్రం నుంచి భారత రక్షణ దళాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ మినహాయింపు కల్పించనున్నట్లు తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పారామిలిటరీ, సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఈ వెసులుబాటు కల్పించనున్నారు.
short by / 12:27 pm on 12 May
జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో భారత సైన్యంపై పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో మరో BSF జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఆర్‌ఎస్‌పుర్ సెక్టార్ వద్ద జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాన్ దీపక్, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై అధికారులు అధికారికంగా సమాచారం ఇచ్చారు. సరిహద్దుల్లో పాక్ వరుసగా కాల్పులకు పాల్పడుతుండటంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
short by / 12:34 pm on 12 May
దిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ 3 డిస్కంలకు PPAC (విద్యుత్ కొనుగోలు సర్దుబాటు వ్యయం)ను తిరిగి పొందేందుకు అనుమతించింది. దీని కారణంగా, మే-జూన్ నెలల్లో దిల్లీలో విద్యుత్ వినియోగదారుల బిల్లులు 7-10% పెరుగుతాయని అధికారులు తెలిపారు. బొగ్గు, గ్యాస్ వంటి ఇంధన ఖర్చులు పెరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు అయ్యే విద్యుత్ సేకరణ ఖర్చులను భర్తీ చేయడానికి వినియోగదారులపై విధించే సర్‌ఛార్జీనే PPACగా పిలుస్తారు.
short by / 01:43 pm on 12 May
సోమవారం టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్ అయిన విరాట్ కోహ్లీ.. భారత్ తరఫున అత్యధిక టెస్టులకు (68) కెప్టెన్‌గా వ్యవహరించాడు. అత్యధిక విజయాలు(40) సాధించిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. అతడు అత్యధికంగా 7 డబుల్ సెంచరీలు చేశాడు. కోహ్లీ 2019లో దక్షిణాఫ్రికాపై 254* రన్స్ స్కోరు చేసిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్ విరాట్.
short by / 12:35 pm on 12 May
కశ్మీర్ విషయంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉందని, పాకిస్థాన్‌తో చర్చించడానికి ఉన్న ఒకే ఒక అంశం... పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి అప్పగించడం మాత్రమేనని ప్రధాని మోదీ అన్నట్టు ANI నివేదించింది. "వారు ఉగ్రవాదుల అప్పగింత గురించి మాట్లాడితే, మనం మాట్లాడవచ్చు. అంతే తప్ప మరే ఇతర అంశాల గురించి చర్చించే ఉద్దేశం మాకు లేదు. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని మేము కోరుకోవడం లేదు," అని అందులో వివరించింది.
short by / 01:00 pm on 12 May
ఆదివారం ఒక ఖలిస్థానీ ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ-NIA తెలిపింది. అరెస్టైన ఖలిస్థానీ ఉగ్రవాది బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్-BKI ఉగ్రవాది హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండాతో సంబంధం కలిగి ఉన్నాడని పేర్కొంది. అతను 2016లో నభా జైలు నుంచి తప్పించుకున్న భయంకరమైన నేరస్తులలో ఒకడని NIA నివేదించింది.
short by / 01:02 pm on 12 May
భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, ఇజ్రాయెల్ వంటి ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఇస్రో మిషన్లను ప్రారంభిస్తుంది. 2015లో ఇస్రో, బ్రిటన్ కోసం ఒకేసారి 5 ఉపగ్రహాలను ప్రయోగించింది. అదే సమయంలో, ఇస్రో ద్వారా అమెరికాకు చెందిన 100కి పైగా చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం గమనార్హం.
short by / 01:03 pm on 12 May
IPL-2025 పునఃప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్-GT అహ్మదాబాద్‌లో నెట్ ప్రాక్టీస్ ప్రారంభించింది. శుభ్‌మన్ గిల్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, రూథర్‌ఫోర్డ్ వంటి ఆటగాళ్ళు ప్రాక్టీస్ ప్రారంభించారు. భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా, ఐపీఎల్ మధ్యలో నిలిచిపోవటం గమనార్హం. ఈ క్యాష్ రిచ్ టోర్నీ మే 16 నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి.
short by / 12:24 pm on 12 May
ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం చెస్ "జూదానికి ఒక సాధనంగా పరిగణించబడుతుంది" అని పేర్కొంటూ ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ క్రీడను నిలిపివేసింది. 2024లో తాలిబన్ మిశ్రమ మార్షల్ ఆర్ట్స్ (MMA), ఇతర పోరాట ఛాంపియన్‌షిప్‌లను కూడా నిషేధించిన తాలిబన్లు వాటిని "హింసాత్మకమైనవి", "షరియాకు సంబంధించి సమస్యాత్మకమైనవి" అని పేర్కొన్నారు.
short by / 12:25 pm on 12 May
సోమవారం టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 2013లో టెస్టు క్రికెట్‌లో 10,000 పరుగులు సాధించడమే తన లక్ష్యమని చెప్పాడు. తాను టెస్టు క్రికెట్‌లో ఈ ఫీట్‌ను సాధించాలని అనుకున్నట్లు అప్పట్లో కోహ్లీ అన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో కోహ్లీ 30 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు చేశాడు. గతేడాది అతడు T20Iలకు గుడ్‌బై చెప్పాడు.
short by / 12:31 pm on 12 May
భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతల మధ్య, పాకిస్థాన్ దాడి కారణంగా ఆగ్రాలోని తాజ్‌మహల్ మంటల్లో చిక్కుకుని కాలిపోయిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. "అలాంటి సంఘటన ఏదీ జరగలేదు. ఈ వీడియో AI ద్వారా సృష్టించారు/నకిలీది. ఇలాంటి తప్పుదారి పట్టించే పోస్టులు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాం," అని ఆగ్రా పోలీసులు తెలిపారు.
short by / 12:37 pm on 12 May
టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బహిరంగ ప్రదేశంలో కనిపించారు. ముంబై విమానాశ్రయంలో వారిద్దరూ కనిపించారు. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. "నేను ఈ ఫార్మాట్ నుంచి వైదొలగుతున్నా, కానీ ఇది అంత ఈజీ కాదు. కానీ ఈ సమయంలో ఇదే సరైనది అనిపిస్తోంది," అని కోహ్లీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు.
short by / 12:48 pm on 12 May
పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న తమ కుమారుడు త్వరలోనే తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ తండ్రి తెలిపారు. పూర్ణమ్ కుమార్ ఏప్రిల్ 23 నుంచి పాకిస్థాన్ రేంజర్స్ నిర్బంధంలో ఉన్నారు. భారత్‌-పాకిస్థాన్ డీజీఎంవో స్థాయి చర్చల్లో తన కుమారుడి ప్రస్తావన వస్తుందని ఆశిస్తున్నట్లు జవాన్ తండ్రి పేర్కొన్నారు. సరిహద్దులో పహరా కాస్తుండగా జవాన్ అనుకోకుండా పాక్ భూభాగంలోకి వెళ్లాడని సమచారం.
short by / 12:54 pm on 12 May
అమెరికాలో ఔషధ ధరలను 30 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గించే ఉత్తర్వుపై సంతకం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన చేసిన ఈ ప్రకటనతో భారతీయ ఫార్మా కంపెనీల షేర్లు బాగా పడిపోయాయి. సన్ ఫార్మా షేర్లు 7% పడిపోగా లుపిన్, అరబిందో ఫార్మా వంటి కంపెనీల షేర్లు 1 శాతం నుంచి 3 శాతం వరకు తగ్గాయి.
short by / 01:06 pm on 12 May
పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి 'పాకిస్థాన్ ఆర్మీ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తుంది' అని చెబుతూ తడబడుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పాకిస్థాన్ సైన్యం ఒక ప్రొఫెషనల్ సైన్యం," అని అన్నారు. ఈ వీడియోపై ప్రతిస్పందిస్తూ ఒక X యూజర్, "వీరి నుంచి ఇంతకుమించి ఇంకా ఏం ఆశిస్తాం?," అని కామెంట్ చేశారు.
short by / 01:23 pm on 12 May
విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్ భౌతికకాయానికి పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లోని షాపూర్‌లోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిస్పందనగా జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు వెంబడి పాకిస్థాన్ దళాలు జరిపిన తీవ్రమైన కాల్పుల్లో మేజర్ పవన్ కుమార్ మరణించారు.
short by / 01:38 pm on 12 May
26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్ ఖన్నా అనుమతితో సంతాపం తెలిపామని భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ తెలిపారు. "దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు, సుప్రీం కోర్టు దూరంగా ఉండకూడదు, మనం కూడా దేశంలో భాగమే" అని చెప్పారు. బాధితులకు నివాళులు అర్పించేందుకు మేం సుప్రీం కోర్టులో 2 నిమిషాల మౌనం పాటించామన్నారు.
short by / 12:14 pm on 12 May
భారత్ తన 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానం కింద ఒక ఏడాది పాటు మాల్దీవులకు 'అత్యవసర ఆర్థిక సహాయం'గా సుమారు రూ.420 కోట్లు ($50 మిలియన్లు) అందించింది. ఇది 2019లో ఒక ఏడాది కాలానికి జారీ చేసిన ట్రెజరీ బిల్లును రోల్ఓవర్ చేయడం ద్వారా జరిగింది. "కీలకమైన ఆర్థిక సహాయం అందించినందుకు EAM జైశంకర్, భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా," అని మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ అన్నారు.
short by / 12:47 pm on 12 May
Load More
For the best experience use inshorts app on your smartphone