For the best experience use Mini app app on your smartphone
కోర్టు ఆదేశాల మేరకు బిహార్‌లోని మధుబని జైలులోనే ఒక ఖైదీ వితంతువైన తన వదినను పెళ్లాడాడు. 2022లో తన అన్నయ్య చనిపోవడంతో అప్పటి నుంచి వదినతో ఆ వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో ఆమె 2024లో అతడిపై రేప్‌ కేసు పెట్టి, జైలు పాలు చేసింది. తన వదినను పెళ్లి చేసుకుంటానని, బెయిల్ ఇవ్వాలంటూ ఆ వ్యక్తి అభ్యర్థించగా కోర్టు అనుమతిచ్చింది. జైల్లోనే పెళ్లి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
short by srikrishna / 01:07 pm on 04 Sep
‘ఏ రిష్తా క్యా కెహ్లతా హై’, ‘దేఖా ఏక్‌ క్వాబ్’ వంటి హిందీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆశిష్ కపూర్‌ అత్యాచారం కేసులో పుణెలో అరెస్టయ్యాడు. అతడు ఓ పార్టీకి తనను ఆహ్వానించి, అక్కడి వాష్‌రూమ్‌లో తనను రేప్‌ చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆ చర్యను రికార్డు చేశాడని కూడా ఆరోపించింది. ఆమె మొదట తనపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందని చెప్పింది, కానీ తరువాత కపూర్ ఒక్కడే అత్యాచారం చేశాడని తెలిపింది.
short by srikrishna / 03:25 pm on 04 Sep
తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన యాంకర్‌ ఉదయభాను కీలక కామెంట్స్ చేశారు. యాంకరింగ్‌లో సిండికేట్ ఏర్పడిందని ఆమె ఇటీవల కామెంట్స్ చేయగా మరో యాంకర్‌ సుమను ఉద్దేశించి అన్నట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై ఇటీవల సుమ భర్త రాజీవ్ కనకాల వ్యంగ్యస్త్రం సంధించారని నివేదికలు తెలిపాయి. కాగా, దీనికి కౌంటర్‌గా "నదిని ఎవ్వరూ బంధించలేరు, సూర్యుడిని ఆపలేరు, నేను సూర్యుడిలానే ఉదయిస్తా" అని పేర్కొన్నారు.
short by / 01:58 pm on 04 Sep
ప్రారంభించిన 15 నిమిషాల్లోనే కొత్త లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయిన ఘటన ఉత్తర తుర్కియేలోని జోంగుల్డాక్‌ తీరంలో జరగ్గా, సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. దీని నిర్మాణానికి $1 మిలియన్‌ (దాదాపు రూ.8.74 కోట్లు పైగా) ఖర్చయ్యింది. దాని యజమాని, కెప్టెన్‌, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకి, క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
short by srikrishna / 11:35 am on 04 Sep
నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాల ప్రాంగణంలో స్కూల్‌ బస్సు కిందపడి ఎల్‌కేజీ చదివే 4 ఏళ్ల జస్మిత మృతి చెందింది. తొరగల్లు గ్రామానికి చెందిన ఆ చిన్నారి గురువారం అదే బస్సులో పాఠశాలకు చేరుకుంది. తర్వాత బస్సును డ్రైవర్‌ రివర్స్‌ చేస్తుండగా దాని కింద పడింది. తీవ్ర గాయాలపాలైన బాలికను పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధరించారు.
short by srikrishna / 12:03 pm on 04 Sep
ప్రేమ విఫలమైందని మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో 21 ఏళ్ల ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగిని సక్కుబాయి ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డిలో కానిస్టేబుల్‌గా చేస్తున్న సుధాకర్‌తో ఆమె 2 ఏళ్ల క్రితం నుంచి ప్రేమలో ఉంది. సక్కుబాయి పెళ్లి చేసుకుందామని అడగడంతో అతడు 2 నెలల నుంచి మాట్లాడటం మానేసి ఫోన్‌ నంబర్ బ్లాక్‌లో పెట్టాడని సమాచారం. దీంతో ఆమె సోమవారం తన ఇంట్లో గడ్డి మందు తాగగా, చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది.
short by srikrishna / 02:05 pm on 04 Sep
జీఎస్టీలో 2 శ్లాబ్‌ల విధానం తెస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని కొనియాడారు. ‘’విద్య, బీమాపై జీఎస్టీని పూర్తిగా తొలగించడాన్ని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నా,’’ అని పేర్కొన్నారు. ఈ సంస్కరణలు దేశానికి అసలైన దీపావళి బహుమతి అని ఆయన అన్నారు.
short by srikrishna / 02:35 pm on 04 Sep
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ కేబినేట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి, కొత్త పరిశ్రమల ఏర్పాటు, రాబోయే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించనున్నారు.
short by / 11:09 am on 04 Sep
సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని 2000 మంది టీచర్లు, అధ్యాపకులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కానుకలు పంపించారు. మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు-షర్టు అందజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు వీటిని గురువారం పంపిణీ చేశారు.
short by srikrishna / 01:23 pm on 04 Sep
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వరదల కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటు, అనేక గ్రామాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు.
short by / 11:12 am on 04 Sep
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ వర్మకు ప్రభుత్వం భద్రత కల్పించింది. 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంతో పలు విషయాలపై చర్చించారు. సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత ఏపీ ప్రభుత్వం వర్మకు వ్యక్తిగత భద్రత కోసం ఇద్దరు గన్‌మెన్లను కేటాయించింది. దీంతో వర్మకు కేబినెట్ హోదా పదవి ప్రకటిస్తారని నివేదికలు తెలిపాయి.
short by / 01:53 pm on 04 Sep
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మీడియా హక్కుల గురించి ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఐపీఎల్ తొలి రోజే ప్రసార నియమాలన్నింటినీ ఉల్లంఘించానని ఆయన చెప్పారు. "నేను సోనీ టీవీతో ప్రత్యేక ఒప్పందంపై సంతకం చేశాను, కానీ సోనీకి ఆ అవకాశం లేదు, నేను అందరినీ ప్రత్యక్ష ప్రసారం చేయమని చెప్పాను" అని నాటి ఘటనను వివరించారు.
short by / 01:05 pm on 04 Sep
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రశ్నించేందుకు భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్ 1xBet ప్రకటనల కార్యకలాపాల్లో తన పాత్రను స్పష్టం చేయాలని నోటీసులో ధావన్‌ను కోరింది. ఈ కేసులో హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లను ED ఇప్పటికే ప్రశ్నించింది.
short by / 01:09 pm on 04 Sep
రష్యా, చైనాలను అరికట్టేందుకు సైనిక సంసిద్ధతను పెంచాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, తమ దేశ రక్షణ విభాగం- పెంటగాన్‌ను ఆదేశించారు. ఈ చర్య ఘర్షణను నిరోధించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఆదేశంతో ఘర్షణను కోరుకోవడం లేదని, భవిష్యత్‌ సవాళ్లకు సిద్ధం కావడమేనని పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ చెప్పారు. అంతకుముందు, రష్యా, ఉత్తర కొరియాతో కలిసి అమెరికాకు వ్యతిరేకంగా చైనా కుట్ర చేస్తోందని ట్రంప్‌ తెలిపారు.
short by / 02:52 pm on 04 Sep
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తన 3 రోజుల పర్యటన సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రపంచంలో "గొప్ప అనిశ్చితి, అల్లకల్లోలం" నెలకొని ఉందని వాంగ్ అభిప్రాయపడ్డారు. భారత్‌-సింగపూర్ భాగస్వామ్యం "భాగస్వామ్య విలువలు, పరస్పర గౌరవం, లోతైన విశ్వాసం"లో పాతుకుపోయినందున మరింత కీలకమైనదని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాని మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
short by / 03:18 pm on 04 Sep
చైనా అతిపెద్ద సైనిక కవాతు "విక్టరీ డే పరేడ్‌" సందర్భంగా జరిగిన భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్‌ను రష్యాను సందర్శించాలని ఆహ్వానించారు. "మేం మీ కోసం ఎదురుచూస్తున్నాం, మా వద్దకు రండి" అని కిమ్‌తో పుతిన్ పేర్కొన్నారు. కాగా "రష్యాకు సహాయం అందించేందుకు తాను చేయగలిగినదంతా చేస్తాను" అని కిమ్‌ జవాబిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా దళాలు రష్యా తరపున పోరాడాయి.
short by / 03:39 pm on 04 Sep
అమెరికా "మాంద్యం అంచున" ఉందని అమెరికా రేటింగ్ ఏజెన్సీ మూడీస్ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జాండి తెలిపారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని అంచనా వేసిన తొలి ఆర్థికవేత్తలలో జాండి ఒకరు. కాగా, "అమెరికా జీడీపీలో మూడింట ఒక వంతు ఉన్న రాష్ట్రాలు మాంద్యం ప్రమాదంలో ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు. మాంద్యం అంటే అమెరికా వినియోగదారులకు పరిశ్రమల్లో అధిక వ్యయాలు, ఉద్యోగాల్లో అంతరాయం అని చెప్పారు.
short by / 12:29 pm on 04 Sep
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకింగ్స్ 2025 ప్రకారం, IIM అహ్మదాబాద్ భారత్‌లోనే అత్యుత్తమ మేనేజ్‌మెంట్ కళాశాల. దాని తర్వాత IIM బెంగళూరు, IIM కోజికోడ్, IIT దిల్లీ, IIM లక్నో, IIM ముంబై, IIM కోల్‌కతా, IIM ఇండోర్ ఉన్నాయి. మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్-గురుగ్రామ్ తొమ్మిదో స్థానంలో ఉండగా, XLRI - జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్- జంషెడ్‌పూర్ 10వ స్థానంలో ఉన్నాయి.
short by / 01:06 pm on 04 Sep
అమెరికా కీలక మిత్ర దేశమైన భారత్‌ను దూరం చేసిందని, భారత్‌-పాకిస్థాన్‌ కాల్పుల విరమణకు ప్రధాని మోదీ తనకు క్రెడిట్ ఇవ్వకపోవడం పట్ల అధ్యక్షుడు ట్రంప్ బాధపడినట్లు అమెరికా కాంగ్రెస్ సభ్యుడు ఆడమ్ స్మిత్ తెలిపారు. "పాక్‌ ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేయాలని కోరింది, ప్రధాని మోదీ దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు" అని ఆయన అన్నారు. "ట్రంప్ మనస్తాపంతో మనం కీలక మిత్రదేశాన్ని దూరం చేసుకుంటున్నాం" అని చెప్పారు.
short by / 02:45 pm on 04 Sep
నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2025 ప్రకారం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (దిల్లీ), మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (మణిపాల్), జామియా మిలియా ఇస్లామియా (దిల్లీ) ఉన్నాయి. దిల్లీ విశ్వవిద్యాలయం ఐదో స్థానంలో, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం(వారణాసి) ఆరో స్థానంలో నిలిచాయి.
short by / 12:02 pm on 04 Sep
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ సంసిద్ధంగా ఉంటే మాస్కోలో కలిసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ఎటువంటి ఒప్పందం కుదరకపోతే రష్యా పోరాడుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు. అయితే ఈ ఆహ్వానంపై ఉక్రెయిన్‌ స్పందించలేదు. జెలెన్‌స్కీ, మాస్కోను ఒక వేదికగా అంగీకరించే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
short by / 12:24 pm on 04 Sep
రెండు స్లాబ్‌ల GST తో, 350cc వరకు మోటార్‌ సైకిళ్లపై GST 28% నుంచి 18% కి తగ్గుతుంది. ఇది వాటి ధరలను చౌకగా చేస్తుంది. 350cc కంటే ఎక్కువ మోటార్‌ సైకిళ్లపై 40% GST ఉంటుంది. మధ్యస్థ, పెద్ద కార్ల GST 45-50% పరిహార సెస్‌ను కలిపి 40%కి తగ్గించడం వల్ల చౌకగా మారవచ్చు. 5% GST తగ్గించడంతో సైకిళ్లు కూడా చౌకగా మారేం అవకాశం ఉంది.
short by / 01:22 pm on 04 Sep
నాసా కొత్త అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా భారతీయ-అమెరికన్ అమిత్ క్షత్రియ నియామకం అయ్యారు. ఇది నాసాకు చెందిన అత్యున్నత పౌర సేవల ఉద్యోగం. 20 ఏళ్ల పాటు నాసాలో పనిచేసిన క్షత్రియ గతంలో మూన్ టు మార్స్ ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందించారు. దీనిలో భాగంగా ఆర్టెమిస్ ద్వారా అమెరికన్లను చంద్రుని పైకి తీసుకువెళ్లేందుకు, పరిశ్రమ భాగస్వామ్యాలను మరింతగా పెంచేందుకు కృషి చేశారు.
short by / 01:29 pm on 04 Sep
భారత వాతావరణ శాఖ (IMD) సెప్టెంబర్‌ 5న 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, మహారాష్ట్ర, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరంల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది.
short by / 02:58 pm on 04 Sep
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రభుత్వం చేపట్టిన రేట్ల తగ్గింపు, GST సంస్కరణలను "చారిత్రాత్మక నిర్ణయం" అని అభివర్ణించారు. "GST 2.0, పేద, మధ్యతరగతికి భారీ ఉపశమనం కలిగిస్తుంది, అదే సమయంలో రైతులు, MSMEలు, మహిళలు, యువతకు మద్దతు ఇస్తుంది" అని ఆయన అన్నారు. "వ్యవస్థను సరళీకృతం చేసి, సాధారణ పౌరులపై భారాన్ని తగ్గించడం ద్వారా, ఈ సంస్కరణలు జీవన సౌలభ్యాన్ని, వ్యాపార సౌలభ్యాన్ని నిర్ధారిస్తాయి" అని ఆయన అన్నారు.
short by / 11:12 am on 04 Sep
Load More
For the best experience use inshorts app on your smartphone