For the best experience use Mini app app on your smartphone
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. శనివారం జరిగిన వార్షిక అవార్డు ప్రదానోత్సవంలో ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా సచిన్‌కు కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేశారు. 1989 నుంచి 2013 వరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో సచిన్ టెండూల్కర్‌ 664 మ్యాచ్‌ల్లో 34,357 పరుగులు చేశాడు. సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు.
short by Devender Dapa / 10:36 pm on 01 Feb
వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా శనివారం అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. “ఈ ఆట నాకు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చింది. ఇది నా అభిరుచి, నా గురువు, నా గుర్తింపు,” అని 40 ఏళ్ల బెంగాల్ వికెట్ కీపర్-బ్యాటర్ రాసుకొచ్చాడు. వృద్ధిమాన్ 142 ఫస్ట్-క్లాస్, 116 లిస్ట్ A, 255 T20 మ్యాచ్‌లలో వరుసగా 7169, 3072, 4655 పరుగులు చేశాడు. 40 టెస్టు మ్యాచ్‌ల్లో 1,353 పరుగులు చేశాడు.
short by Devender Dapa / 11:04 pm on 01 Feb
తన బ్యాంకు అధికారిక IVRను అనుకరిస్తూ వచ్చిన నకిలీ కాల్ తర్వాత రూ.2 లక్షలు కోల్పోయానని బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ పేర్కొన్నారు. “ముందుగా రికార్డ్ చేసిన వాయిస్‌లో మీ ఖాతా నుంచి రూ.2 లక్షల నగదు బదిలీ అవుతోంది. ఈ లావాదేవీ మీరు చేసినట్టైతే ధృవీకరణ కోసం 3 నొక్కండి లేకపోతే 1 నొక్కండి అని అందులో ఉంది. నేను కంగారు పడి 1 నొక్కాను. కాసేపు తర్వాత నేను రూ.2 లక్షలు కోల్పోయా,” అని ఆమె చెప్పారు.
short by Rajkumar Deshmukh / 10:16 am on 02 Feb
పంటలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చైనా ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో నూతన హైవేను నిర్మించింది. హుబే ప్రావిన్స్‌లోని 126 కిలోమీటర్ల పొడవైన ఈ వుహాన్‌- యాంగ్‌షీన్‌ హైవే, పంటపొలాలు, చేపల చెరువుల మీదుగా సాగుతుంది. ఒక్క గజం పొలం తవ్వకుండా, ఒక్క అంగుళం చెరువును కూడా పూడ్చకుండా నేలపైన ఎత్తయిన స్తంభాలు ఏర్పాటుచేసి, వాటి మీద ఈ హైవేను నిర్మించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా దీన్ని డిజైన్‌ చేశారు.
short by Srinu Muntha / 09:00 am on 02 Feb
దిల్లీలో కనీస సౌకర్యాలు లేవనే విషయాన్ని విదేశాల్లో చెప్పాలంటే సిగ్గుగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. "నీరు, విద్యుత్తు, వంటగ్యాస్ సిలిండర్లు, ఇళ్లు, ఆరోగ్యం మీ హక్కు, కానీ దిల్లీ ప్రజలు గత 10 ఏళ్లలో వారి హక్కులను పొందలేదు. ప్రభుత్వాన్ని మార్చే ఆలోచన చేయాలి," అని జై శంకర్ అన్నారు. ప్రస్తుతం దిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఫిబ్రవరి 5న అక్కడ పోలింగ్‌ జరగనుంది.
short by Srinu Muntha / 12:15 pm on 02 Feb
పెళ్లి ఊరేగింపులో 'చోలీ కే పీచే క్యా హై' అనే హిందీ పాటకు తన కాబోయే అల్లుడు డ్యాన్స్ చేయడం చూసి దిల్లీలో వధువు తండ్రి ఆ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. దీన్ని అనుచితమైన ప్రదర్శనగా పేర్కొన్న పెళ్లి కుమార్తె తండ్రి, వేడుకలో వరుడి చర్యలు తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీశాయని చెప్పాడు. అతడు తన కుమార్తెను వరుడి కుటుంబాన్ని సంప్రదించకుండా నిషేధించినట్లు సమాచారం.
short by Srinu Muntha / 12:28 pm on 02 Feb
వచ్చే 2-3 ఏళ్లలో దేశంలో 200 కొత్త వందేభారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. 100 అమృత్‌ భారత్‌, 50 నమో భారత్ ర్యాపిడ్‌ రైళ్లు, 17,500 జనరల్‌ నాన్‌ ఏసీ కోచ్‌లు రాబోతున్నాయని తెలిపారు. భారీ మొత్తంలో కేటాయింపులతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని మరింతగా విస్తరించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు.
short by Devender Dapa / 11:12 pm on 01 Feb
అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో సీఎం చంద్రబాబు ఐటీ ఉద్యోగులతో శనివారం ముఖాముఖి నిర్వహించారు. ఇందులో యువరాజు యాదవ్‌ అనే స్థానిక యువకుడు మాట్లాడుతూ, ‘’నేను బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా, ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోంలో ఉన్నా. నాకు ఏడాదికి రూ.93 లక్షల ప్యాకేజీ. కటింగులన్నీ పోనూ నెలకు రూ.6.37 లక్షల జీతం వస్తుంది,’’ అని చెప్పాడు. అతడు చెప్పిన జీతంపై సోషల్‌ మీడియాలో విస్తృత చర్చ జరిగింది.
short by Srinu Muntha / 12:16 pm on 02 Feb
కొత్త పన్ను విధానంతో మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. "ఎవరైనా సగటున నెలకు రూ.1 లక్ష సంపాదిస్తే, వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది," అని ఆమె తెలిపారు. ఏటా రూ.12 లక్షల వరకు సంపాదిస్తున్న వారికి శనివారం పార్లమెంట్‌లో సమర్పించిన 2025-26 కేంద్ర బడ్జెట్‌లో జీరో ట్యాక్స్‌ని ప్రకటించారు.
short by Srinu Muntha / 11:54 am on 02 Feb
కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ 25% సుంకాలు విధించారు. దీనికి ప్రతీకారంగా కెనడా పీఎం జస్టిన్ ట్రూడో $106 బిలియన్ విలువైన అమెరికన్ వస్తువులపై 25% సుంకాలు ప్రకటించారు. దీనిపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ స్పందిస్తూ, 'ప్లాన్ బి’ అమలుకు ఆదేశాలిచ్చారు. ఇందులో మెక్సికో ప్రయోజనాలను కాపాడేందుకు టారిఫ్, నాన్-టారిఫ్ చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.
short by Sri Krishna / 09:47 am on 02 Feb
అమెరికా టెక్సాస్‌లో ఓ వ్యక్తి కారు అద్దం పైనున్న మంచును 3 నెలల శిశువుతో కిందకు నెట్టాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి ఇంటిని తనిఖీ చేసి, శిశువు వయస్సును ధ్రువీకరించారు. "ఇద్దరు మహిళా అధికారులు శిశువును పరిశీలించారు. చిన్నారి క్షేమంగా ఉంది," అని వారు చెప్పారు. సోషల్‌ మీడియా లైకుల కోసం ఇలాంటి ఫీట్లు చేయకూడదని వారు పేర్కొన్నారు.
short by Bikshapathi Macherla / 10:33 am on 02 Feb
పల్నాడు జిల్లా నరసరావుపేటలో సైబర్‌ నేరగాళ్లు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని బెదిరించి రూ.11 లక్షలు కాజేశారు. ఐటీ ఉద్యోగినికి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు, ఆన్‌లైన్‌లో గంజాయి కొన్నట్టు ఆధారాలు ఉన్నాయని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని బెదిరించడంతో ఆమె భయపడి ఆన్‌లైన్‌లో రూ.11 లక్షలు చెల్లించిందని చెప్పారు. ఆ తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
short by Devender Dapa / 11:20 pm on 01 Feb
కృష్ణా జిల్లా మోటూరులో ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులతో 35 ఏళ్ల సత్తిబాబు అనే ఆటో డ్రైవర్‌ ఫేస్‌బుక్‌లో సూసైడ్‌ పోస్ట్‌ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ప్రకారం, విస్తార్‌ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.7.80 లక్షలు అప్పుగా తీసుకున్న సత్తిబాబు, జనవరి వాయిదా చెల్లించలేకపోయాడు. దీంతో ఇంటికి నోటీసులు అంటించిన ఫైనాన్స్‌ సిబ్బంది, ఆటోస్టాండ్‌ వద్దకు వెళ్లి గొడవ చేయగా, మనస్తాపం చెంది ఉరేసుకున్నాడు.
short by Bikshapathi Macherla / 08:31 am on 02 Feb
ప్లాట్‌ఫారం మారేందుకు లిఫ్టులో ఎక్కిన 14 మంది ప్రయాణికులు, అందులోనే 3 గంటలపాటు ఇరుక్కుపోయిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్‌లో జరిగింది. స్పందించిన రైల్వే పోలీసులు, ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. వారంతా తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ స్టేషన్‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, పరిమితికి మించి ఎక్కడంతోనే లిఫ్టు ఆగిపోయి, డోర్‌ తెరుచుకోలేదని అధికారులు తెలిపారు.
short by Srinu Muntha / 10:43 am on 02 Feb
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో శనివారం 29 ఏళ్ల బత్తుల ప్రభాకర్‌ జరిపిన కాల్పుల్లో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో 80 వరకూ చోరీ కేసులున్నాయి. 2022 మార్చిలో విచారణ నిమిత్తం పోలీసులు అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో అతను తప్పించుకుపోయి, అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. నిందితుడు ఎక్కువగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చోరీలు చేస్తుంటాడు.
short by Sri Krishna / 12:04 pm on 02 Feb
ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌ పెట్టిన బోధనారుసుముల్ని చెల్లించాలని ఆ పార్టీ నేతలే ఇప్పుడు ఆందోళనలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
short by Devender Dapa / 11:29 pm on 01 Feb
సత్యసాయి జిల్లా కదిరి సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాసులు టీస్టాల్‌లో భూ దస్త్రాలపై సంతకాలు చేయడం విమర్శలకు దారి తీసింది. ఫిబ్రవరి 1 నుంచి భూ రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు నేపథ్యంలో శుక్రవారమే క్రయ, విక్రయాలు పూర్తి చేయాలని చాలా మంది రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చారు. ఈ తరుణంలో సెలవులో ఉన్నట్లు శ్రీనివాసులు తన సిబ్బందికి చెప్పారు. ఆపై అర్జీదారులను హోటల్‌కు పిలిపించుకొని, అక్కడే దస్తావేజులపై సంతకాలు చేశారు.
short by Bikshapathi Macherla / 08:47 am on 02 Feb
హైదరాబాద్‌ గచ్చిబౌలిలో అరెస్టు చేసేందుకు వెళ్లిన సైబరాబాద్‌ CCS కానిస్టేబుల్‌ వెంకటరాంరెడ్డిపై దుండగుడు కాల్పులు జరిపాడు. పోలీసుల ప్రకారం, ప్రిజమ్‌ పబ్‌లో దొంగ 2 రౌండ్లు కాల్పులు జరపగా, ఓ తూటా కానిస్టేబుల్‌ తొడభాగంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పబ్‌లో ఉన్న బౌన్సర్‌కు కూడా గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన దొంగ మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ ప్రభాకర్‌గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
short by Devender Dapa / 09:47 pm on 01 Feb
కర్ణాటక నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి ఐరన్ లోడ్‌తో వస్తున్న కంటైనర్‌ లారీ గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుని దారితప్పింది. రాత్రి కావడంతో దారి తెలియక గూగుల్‌ మ్యాప్స్‌ చూస్తూ ప్రయాణిస్తున్నానని డ్రైవర్ ఫరూక్‌ తెలిపాడు. గూగుల్‌ తప్పుదారి చూపడంతో యాడికి మండలం రామన్న గుడిసెల వద్ద కొండల్లోకి వెళ్లినట్లు అతడు చెప్పాడు. లారీని వెనక్కి తీస్తుండగా లోయలోకి ఒరిగిపోతుండటంతో జేసీబీతో స్థానికులు బయటకు తీశారు.
short by Bikshapathi Macherla / 10:25 pm on 01 Feb
తాజా చికెన్ ముక్కలు గులాబీ రంగులో ఉంటాయి. నిల్వ ఉంచిన చికెన్​ అయితే ఫంగస్ చేరడం వల్ల కొంచెం పసుపు రంగులో కనిపిస్తుంది. చికెన్‌ని తెచ్చినప్పుడు లేదా వంట చేసే వేళ కుళ్లిన వాసన వస్తే అది ఖచ్చితంగా పాడైపోయిందని అర్థం. అలాగే చికెన్‌ను తాకడం ద్వారా కూడా అది మంచిదో కాదో తెలుసుకోవచ్చు. చికెన్‌ సహజంగా జిగటగా ఉంటుంది. నీళ్లలో కడిగాక కూడా ఎక్కువగా జిగటగా అనిపిస్తే, అది దాదాపుగా చెడిపోయిందని చెప్పొచ్చు.
short by Sri Krishna / 07:46 am on 02 Feb
భాస్కరరావు అనే 30 ఏళ్ల యువకుడు విశాఖలోని గాజువాకలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. శనివారం పక్కింటి యువతి స్నానం చేస్తుండగా భాస్కరరావు వీడియో తీశాడంటూ ఆమె కుటుంబ సభ్యులు అతడిని కొట్టి ఇంట్లో నిర్బంధించారు. కాసేపటికి అతను విగతజీవిగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. భాస్కరరావును కొట్టి చంపారని, ముఖంపై గాయాలు ఉన్నాయని బాధిత కుటుంబం ఆరోపించింది. వారి ఫిర్యాదు మేరకు యువతితో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది.
short by Sri Krishna / 11:17 am on 02 Feb
అల్లూరి జిల్లా అరకులో జరుగుతున్న చలిజాతర ఉత్సవాల్లో 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారులు సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు చేశారు. మారథాన్‌, ప్లవర్‌ షో, గిరిజన వంటకాలతో ఫుడ్‌ కోర్టులను జాతరలో ఏర్పాటు చేశారు. అనంతరం ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు స్థానిక గిరిజనులతో కలిసి స్టెప్పులేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం మొదలైన ఈ జాతర ఆదివారం వరకు జరగనుంది.
short by Bikshapathi Macherla / 10:23 pm on 01 Feb
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌, మధ్య తరగతి ప్రజల డ్రీమ్‌ బడ్జెట్ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్‌తో తెలంగాణకు జరిగే లబ్ధిని వివరించారు. “ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు, కేంద్ర బడ్జెట్. అన్ని కేంద్ర పథకాల్లో రాష్ట్రం భాగస్వామిగా ఉంటుంది. అర్బన్ స్టేట్‌గా ఉన్న తెలంగాణకు రూ.10వేల కోట్లు రాబోతున్నాయి. 50 ఏళ్ల వరకు వడ్డీ రహిత రుణాలతో లబ్ధి కలుగుతుంది,” అని చెప్పారు.
short by Devender Dapa / 10:48 pm on 01 Feb
వికసిత్‌ భారత్‌ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్‌ ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏపీకి పీఎం మోదీ ఇస్తున్న అండదండలు కేంద్ర బడ్జెట్‌లోనూ కొనసాగించారని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం వల్ల రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న ఆ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందన్నారు.
short by Devender Dapa / 10:57 pm on 01 Feb
రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, జనవరి 25న రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి మూడు రోజుల క్రితం కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో భేటీ అయినట్లు వార్తా కథనాలు తెలిపాయి. ఆయన హైదరాబాద్‌లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటలపాటు రాజకీయ అంశాలపై చర్చించారని సమాచారం. మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు. విజయసాయిపై గతంలో అనేక సందర్భాల్లో షర్మిల ఘాటైన విమర్శలు చేశారు.
short by Sri Krishna / 08:30 am on 02 Feb
Load More
For the best experience use inshorts app on your smartphone