For the best experience use Mini app app on your smartphone
వేసవిలో పిల్లలకు పెరుగు, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, ద్రాక్ష, మామిడి పండ్లు తినిపించాలని పీడియాట్రిషియన్‌ సందీప్ గుప్తా తెలిపారు. "పెరుగు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. కొబ్బరినీరు పిల్లలను డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. విటమిన్‌ సి సమృద్ధిగా ఉండే పుచ్చకాయ, ద్రాక్ష తినిపిస్తే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడిలో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది,’’ అని ఆయన వివరించారు.
short by srikrishna / 07:36 am on 28 Mar
మామ వరుసయ్యే వ్యక్తి కొన్ని నెలలుగా పలుమార్లు రేప్ చేయడంతో ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. పోలీసుల ప్రకారం, పీరియడ్స్ రావడం లేదని సదరు బాలికను ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం తెలిసింది. స్నానం చేస్తుండగా వీడియో తీసి, బ్లాక్‌మెయిల్ చేసి తనను రేప్‌ చేసినట్లు బాధితురాలు తెలిపింది. నిందితుడు గణేశ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
short by Devender Dapa / 10:22 pm on 27 Mar
ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వచ్చే కలెక్టర్ల సదస్సులోగా జాబ్‌ మేళాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి మూడు, ఆరు నెలలకొకసారైనా జాబ్‌ మేళాలు కచ్చితంగా జరగాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా నైపుణ్య గణన పూర్తికాకపోవడమేంటన్నారు. వర్క్‌ ఫ్రం హోం విధానంలో పని చేసేందుకు నమోదు చేసుకున్నవారికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు.
short by Devender Dapa / 11:46 pm on 27 Mar
హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో అత్తింటి వేధింపులు భరించలేక 26 ఏళ్ల నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం, భోలక్‌పూర్‌ నివాసి సౌజన్యకు మూసాపేట్‌కు చెందిన జిమ్‌ నిర్వాహకుడు శబరీష్‌తో 4 నెలల క్రితం వివాహం జరిగింది. కాగా సౌజన్య గుండెకు రంధ్రం ఉందన్న విషయం తెలియడంతో అత్తింటివారు వేధింపులకు గురి చేయడంతో పుట్టింటికి వచ్చి భవనం మూడో అంతస్థు నుంచి కిందకు దూకింది.
short by Bikshapathi Macherla / 12:06 am on 28 Mar
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ స్టేజి సమీపంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేసారం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలు గమనించి, తాను బయటకు దిగిపోయినట్లు ఈ ఘటన జరిగినపుడు డ్రైవింగ్ చేస్తున్న యజమాని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు.
short by Devender Dapa / 10:58 pm on 27 Mar
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో అతివేగంగా వెళ్తున్న లారీ, స్కూటీని ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. పోలీసుల ప్రకారం, రఘుపతిపేటకు చెందిన భార్యభర్తలు 40 ఏళ్ల సక్కుబాయి, 45 ఏళ్ల పాండు 12 ఏళ్ల క్రితం రామాంతపూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. సక్కుబాయి పంచాయతీ కార్యదర్శిగా, పాండు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కొందుర్గులో ఉన్న వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తుండగా లారీ ఢీకొని చనిపోయారు.
short by Bikshapathi Macherla / 11:47 pm on 27 Mar
పేపర్‌లో వచ్చే ధరకే చికెన్ ఇప్పించేందుకు తాను ప్రయత్నిస్తుంటే, కమీషన్ తీసుకుంటున్నానని 'సాక్షి'లో అవాస్తవాలు రాస్తున్నారని ఆళ్లగడ్డ టీడీపీ MLA భూమా అఖిల ప్రియ ఆరోపించారు. వైసీపీ MLAలే చికెన్ సెంటర్ల నుంచి కేజీకి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారని పేర్కొంటూ కర్నూలులోని సాక్షి ఆఫీస్ ఎదుట కోళ్లతో ఆమె నిరసన చేపట్టారు. వైసీపీ హయంలో కేజీ చికెన్ ధర రూ.250-280 ఉండేదని, ప్రస్తుతం రూ.150-170గా ఉందన్నారు.
short by Devender Dapa / 11:58 pm on 27 Mar
గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ గుండెను తరలించారు. గుంటూరులోని రమేశ్ ఆసుపత్రిలో చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిన్‌డెడ్‌ కాగా, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి యాజమాన్యం మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో ఆయన గుండెను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారని వైద్యులు తెలిపారు.
short by Devender Dapa / 10:45 pm on 27 Mar
ఏపీలో తొలి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందడానికి మార్చి 31 వరకే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఇప్పటివరకు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందని లబ్ధిదారులు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. “ఇప్పటికి 98 లక్షల మంది ఉచిత్‌ గ్యాస్‌ సిలిండర్లు పొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకానికి ఇప్పటికే రూ.2,684 కోట్లు మంజూరు చేశాం,” అని చెప్పారు.
short by Devender Dapa / 12:10 am on 28 Mar
ముగ్గురు పిల్లలు ఉన్నా, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడంపై తెలంగాణ సీఎం, మంత్రిమండలితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకు కలెక్టర్లు పంపించిన ప్రతిపాదనల ఆధారంగా గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నవారికే మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంది.
short by Devender Dapa / 12:22 am on 28 Mar
తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తంగా 11 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 97 గంటల 32 నిమిషాల పాటు సభ కొనసాగింది. వార్షిక బడ్జెట్‌ సహా 12 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. 146 మంది సభ్యులు మాట్లాడారు. 16 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. డీలిమిటేషన్‌ సహా పలు తీర్మానాలను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ వివరాలు వెల్లడించింది.
short by Bikshapathi Macherla / 10:04 pm on 27 Mar
బీఆర్‌ఎస్ హయాంలో రూ.500 ఫైన్ వేసే డ్రోన్ ఎగరవేత కేసులో తనను అక్రమంగా జైలుకి పంపించారనే సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. “రేవంత్ రెడ్డి ఏమైనా స్వాత్రంత్య ఉద్య‌మం చేసి జైలుకు పోయారా? మీ ఇంటిమీదికి డ్రోన్ పంపి, భార్య, పిల్లలను ఫొటోలు తీస్తే ఊరుకుంటారా? సానుభూతి ఎందుకు? మేం పోలేదా జైలుకు. తెలంగాణ ఉద్య‌మంలో వ‌రంగ‌ల్ జైలుకు నేను కూడా పోయా,” అని కేటీఆర్‌ అన్నారు.
short by Devender Dapa / 11:32 pm on 27 Mar
IPL-2025లో భాగంగా గురువారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యచ్‌లో సన్‌రైజర్స్‌ ఆటగాడు ఇషాన్ కిషన్ గోల్డెన్ డక్‌గా ఔట్ కావడంతో తన పేరు మీద ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్‌లో మొదటి బంతికే ఔటైన రెండో బ్యాట్స్‌మన్‌గా ఇషాన్ నిలిచాడు. అంతకుముందు 2013లో సురేష్ రైనా కూడా సరిగ్గా ఇలాగే ఔట్ అయ్యాడు.
short by / 11:02 pm on 27 Mar
గుజరాత్ అహ్మదాబాద్‌లోని నికోల్, వస్త్రల్, జీవ్‌రాజ్ పార్క్, గోటాతో సహా 5 వేర్వేరు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించి, 499 కిలోల కల్తీ పనీర్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత యూనిట్లను ఆహార శాఖ సీజ్ చేసింది. మార్కెట్‌లో నకిలీ పనీర్ చెలామణి అవుతుండటం, పౌరుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తున్నందున, ఆహార శాఖ ఇలా తనిఖీలు నిర్వహిస్తూ, నకిలీ పనీర్‌ను స్వాధీనం చేసుకుంటూనే ఉంది.
short by / 11:06 pm on 27 Mar
హైదరాబాద్‌కు చెందిన క్లీన్ ఎనర్జీ స్టార్టప్ HYLENR టెక్నాలజీస్, అంతరిక్షంలో తక్కువ-శక్తి అణు ప్రతిచర్య (LENR) ఆధారిత కంప్యూట్ మాడ్యూల్‌లను పరీక్షించడానికి స్పేస్-టెక్ సంస్థ TakeMe2Spaceతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మార్చి 26, 2025న జరిగిన ఒక అవగాహన ఒప్పందం ద్వారా లాంఛనప్రాయమైన ఈ సహకారం, HYLENR పేటెంట్ పొందిన LENR సాంకేతిక పరిజ్ఞానాన్ని కక్ష్యలో ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
short by / 10:02 pm on 27 Mar
చివరిసారిగా మార్చి 2017లో భారత టెస్ట్ జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్, టెస్ట్ సిరీస్‌కు ముందు మే-జూన్‌లో ఇంగ్లాండ్ లయన్స్‌తో తలపడే ఇండియా A జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. 2024–25 రంజీ ట్రోఫీలో విదర్భ తరపున అద్భుతమైన ప్రదర్శన చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్, 9 మ్యాచ్‌లు ఆడి 16 ఇన్నింగ్స్‌లలో 863 పరుగులు చేయడం గమనార్హం.
short by / 10:08 pm on 27 Mar
ఐపీఎల్-2025లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి ఔట్ అయిన తర్వాత కోపంతో తన హెల్మెట్‌ను విసిరేశాడు. నితీష్ రెడ్డిని రవి బిష్ణోయ్ 32(28) పరుగుల వద్ద ఔట్ చేశాడు. నితీష్ రెడ్డి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లే ముందు మెట్ల వద్ద తన హెల్మెట్‌ను నేలకి విసిరి కొట్టాడు.
short by / 10:50 pm on 27 Mar
అధికారిక విధానాలను ఉల్లంఘించినట్లు తేలడంతో భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం దాదాపు 2,000 వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసింది. దరఖాస్తుదారులకు వీసాలు పొందడానికి నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా అనేక మంది ఏజెంట్లు అమెరికా ప్రభుత్వాన్ని మోసం చేశారని రాయబార కార్యాలయం తెలిపింది. "మా షెడ్యూలింగ్ విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు, ఫిక్సర్లను మేము అస్సలు సహించం," అని దౌత్య కార్యాలయం పేర్కొంది.
short by / 10:58 pm on 27 Mar
ఐపీఎల్-2025లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నికోలస్ పూరన్ 70 (26), మిచెల్ మార్ష్ 52 (31)ల ధాటికి 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో లక్నో తరఫున శార్దూల్ ఠాకూర్ 4-0-34-4 గణాంకాలు నమోదు చేయడం గమనార్హం.
short by / 11:11 pm on 27 Mar
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితంపై బయోపిక్‌ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. 'అజే: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి' అనే పేరుతో శంతను గుప్తా రాసిన 'ది మాంక్ హూ బికమ్ చీఫ్ మినిస్టర్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ప్రకటనతో పాటు, యోగి ఆదిత్యనాథ్ పాత్రలో నటుడు అనంత్ జోషి నటించిన మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
short by / 10:25 pm on 27 Mar
మార్చి 31 లోపు తమ డేటాబేస్‌లను అప్‌డేట్ చేయాలని, మూసివేసిన లేదా రీసైకిల్ చేసిన మొబైల్ నంబర్‌లను తొలగించాలని బ్యాంకులు, చెల్లింపు సేవా ప్రదాతలను (PSPలు) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆదేశించింది. NPCI ప్రకారం, అలా చేయడం వల్ల లోపాలు, మోసాల ప్రమాదాన్ని నివారించవచ్చు. రీసైకిల్ చేసిన మొబైల్ నంబర్ అంటే పాత యూజర్ క్లోజ్‌డ్ నంబర్‌ను కొత్త వినియోగదారుకు కేటాయించడం.
short by / 10:41 pm on 27 Mar
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై 'దేశద్రోహి' అనే వ్యాఖ్యలకు సంబంధించి ముంబై పోలీసులు కమెడియన్ కునాల్ కమ్రాకు రెండో సారి సమన్లు ​​జారీ చేశారు. అంతకుముందు, ముంబై పోలీసులు కమ్రాకి సమన్లు ​​జారీ చేసి, మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని కోరారు, కానీ అతను హాజరు కాలేదు. అయితే, తన న్యాయవాది ద్వారా ఒక వారం రోజుల సమయం కావాలని కమ్రా కోరినప్పుడు పోలీసులు దానిని తిరస్కరించారు.
short by / 10:54 pm on 27 Mar
తప్పుదోవ పట్టించే ప్రకటనలను అరికట్టడానికి డ్రగ్స్ & మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్-1954 కింద 2 నెలల్లోపు ఫిర్యాదు వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. 70 ఏళ్ల నాటి చట్టం సరిగ్గా అమలు కావడం లేదని, పోలీసులకు తగిన శిక్షణ ఇవ్వాలని ధర్మాసనం కోరింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం 3 నెలల్లోపు డాష్‌బోర్డ్‌ను ప్రారంభించాలి.
short by / 11:21 pm on 27 Mar
మెల్‌బోర్న్‌లో తన కాన్సర్ట్‌కి 3 గంటలు ఆలస్యంగా రావడంపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ, నిర్వాహకులు తన డబ్బుతో పాటు ఇతరుల డబ్బు తీసుకొని పారిపోయారని నేహా కక్కర్ ఆరోపించారు. అక్కడ తాను ఉచితంగా ప్రదర్శన ఇచ్చానని తెలిపారు. "నా బ్యాండ్‌కు ఆహారం, హోటల్, నీటిని కూడా ఇవ్వలేదు. నా భర్త, అతని బృందం వారికి ఆహారం అందించారు," అని ఆమె అన్నారు. కాన్సర్ట్ వేదికపైనే నేహా కక్కర్ కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం.
short by / 10:17 pm on 27 Mar
ఐపీఎల్ 2025లో గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన వేగవంతమైన అర్ధ సెంచరీ ఇదే కావడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70(26) పరుగులు చేసిన పూరన్‌ను కమ్మిన్స్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇది LSG తరపున సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.
short by / 10:32 pm on 27 Mar
Load More
For the best experience use inshorts app on your smartphone