తెలంగాణలో అత్యాధునిక గోశాలల ఏర్పాటు కోసం కమిటీని నియమించాలని, గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సీఎం రేవంత్రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. తొలి విడతలో పశు, వ్యవసాయ వర్సిటీలు, కాలేజీలు, ఆలయాల భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. కనీసం 50 ఎకరాల్లో నిర్మించేందుకు వీలుగా స్థలాలు గుర్తించాలన్నారు. వీటి నిర్వహణలో ధార్మిక సంస్థలను భాగస్వామ్యం చేసే అంశం పరిశీలించాలని చెప్పారు.
short by
srikrishna /
05:51 pm on
31 May