For the best experience use Mini app app on your smartphone
డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో టీ, కాఫీలు తాగడం ప్రమాదకరమని న్యూట్రిషనిస్ట్ ఖుషీ ఛబ్రా తెలిపారు. పేపర్ కప్పుల్లో వాటర్ ప్రూఫ్ లక్షణం కోసం మైక్రో ప్లాస్టిక్ పొరను వాడుతుంటారని ఆమె చెప్పారు. వేడి పదార్థాలను ఆ కప్పులో పోసినప్పుడు ప్లాస్టిక్ పొర కరిగి సూక్ష్మ కణాలు విడుదలవుతాయని, ఇవి రక్తంలోకి ప్రవేశిస్తాయని వివరించారు. ఈ మైక్రోప్లాస్టిక్‌లు జీవక్రియ రుగ్మతకు, హార్మోన్ల అసమతుల్యతకు కారణం కావొచ్చన్నారు.
short by srikrishna / 11:17 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone