For the best experience use Mini app app on your smartphone
ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు గురువారం హాజరు కానున్నారు. ఆరేళ్లుగా జగన్‌ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ కోరింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈక్రమంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు.
short by srikrishna / 08:13 am on 19 Nov
For the best experience use inshorts app on your smartphone