For the best experience use Mini app app on your smartphone
వైసీపీ హయాంలో నిర్వహించిన "ఆడుదాం ఆంధ్రా" పోటీల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఏపీ సర్కారు ఆదేశించింది. ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు 45 రోజుల్లోనే రూ.119 కోట్లు ఖర్చు చేసినట్లు క్రీడా మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. ఇందులో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. ఎన్నికల కోసమే ఆడుదాం ఆంధ్ర నిర్వహించారని ఆరోపించారు.
short by Bikshapathi Macherla / 11:11 pm on 11 Mar
For the best experience use inshorts app on your smartphone