రాజ్యాంగం కల్పించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆరోపించారు. దీని కోసమే ఆ పార్టీ 400 ఎంపీ సీట్లు కావాలని అంటోందన్నారు. ‘’ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 2025 నాటికి వందేళ్లు పూర్తి కాబోతుంది. ఈలోపు రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది,’’ అని సీఎం రేవంత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాన్ని బీజేపీ అమలు చేస్తోందని విమర్శించారు.
short by
Sri Krishna /
02:36 pm on
25 Apr