2 వేల కుటుంబాలు కలిగిన ఆస్పరిలో గత మూడు నెలలుగా నీటి సమస్య తీవ్రమైందని, 20 రోజులకు ఒకసారి మాత్రమే కుళాయిలకు నీరు సరఫరా చేస్తున్నారని రిపోర్ట్లు తెలిపాయి. దీంతో కొందరు ఎద్దుల బండ్లు, బైక్, సైకిల్, ఆటోలతో స్థానిక గాంధీ పార్కు వద్ద గల గుమ్మిల దగ్గరకు వెళ్లి నీటిని తెచ్చుకుంటుండగా, మరికొందరు నీటి కోసం ఒక్కో బిందెకు రూ.7, ట్యాంకర్కు రూ.800 చొప్పున ఖర్చు చేస్తున్నారని ఆ కథనాలు వెల్లడించాయి.
short by
M Srinu /
04:43 pm on
25 Apr