For the best experience use Mini app app on your smartphone
గత మూడు నాలుగేళ్లుగా పెండింగ్‌లోని రూ.2,000 కోట్ల బిల్లులు త్వరలో చెల్లిస్తామని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. దీంతో సుమారు 17,000 మందికి చెల్లింపులు దక్కుతాయని చెప్పారు. నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, నాబార్డు పనులకు బిల్లుల, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకూ కొంత మొత్తం విడుదల చేయనున్నట్లు ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో భేటీ తర్వాత మంత్రి వివరించారు.
short by Devender Dapa / 10:45 pm on 30 Mar
For the best experience use inshorts app on your smartphone