For the best experience use Mini app app on your smartphone
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం అసైన్డ్‌ భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే రిటర్నబుల్‌ ప్లాట్లను అసైన్డ్‌ అని కాకుండా పట్టా పేరుతో జారీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ ప్లాట్లలో అసైన్డ్‌ అని ఉండటంతో అవి అమ్ముడుపోవడం లేదని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అవసరమైన మార్పులు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌ జీవో జారీ చేశారు. 
short by srikrishna / 06:13 pm on 17 Sep
For the best experience use inshorts app on your smartphone