అంతిమ యాత్రపై తేనెటీగలు దాడి చేయడంతో బంధువులు మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పరుగెత్తిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాకలో జరిగింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల ప్రకారం, 86 ఏళ్ల పల్లాయమ్మ అనారోగ్యంతో చనిపోగా, అంతిమ యాత్రలో బాణాసంచా కాల్చారు. టపాసులు తేనెతుట్టపై పడటంతో తేనెటీగలు దాడి చేశాయి. దీంతో మండుటెండలో రహదారిపైనే 2 గంటల పాటు మృతదేహం ఉంది.
short by
Devender Dapa /
03:06 pm on
29 Mar