ములుగు జిల్లా పూసురు ముల్లకట్ట బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం ఆదివారం లభ్యమైంది. ముల్లకట్ట గోదావరి బ్రిడ్జి 27వ పిల్లర్ వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. మహిళ గులాబీ రంగు చీర, నీలం రంగు జాకెట్ ధరించి ఉందని, తలకు చెక్స్ టవల్ చుట్టుకుని ఎముకల గూడుగా మారిందని పోలీసులు చెబుతున్నారు.
short by
News Telugu /
10:00 pm on
20 Apr