ఆంధ్రప్రదేశ్లో గురువారం మధ్యాహ్నం 3 గంటలతో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఉంది.
short by
Sri Krishna /
04:08 pm on
25 Apr