For the best experience use Mini app app on your smartphone
‘అన్నదాత సుఖీభవ’ పథకం మొదటి విడత కింద ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో రూ.3,156 కోట్లు జమ చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం తెలిపారు. ప్రకాశం జిల్లాలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని పథకాన్ని ప్రారంభించనున్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం ఇచ్చే రూ.2 వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.5 వేలను కలిపి మొత్తంగా రూ.7,000 చొప్పున అర్హులైన రైతు ఖాతాల్లో జమ చేస్తారు.
short by srikrishna / 05:10 pm on 30 Jul
For the best experience use inshorts app on your smartphone