హైదరాబాద్ చందా నగర్లో రూ.లక్షల్లో ఆస్తి పన్ను బకాయి ఉన్నారని ఓ క్లాత్ స్టోర్ ఎదుట అధికారులు జేసీబీతో గుంత తవ్వించారు. ఆస్తి పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో ఈ చర్యకు దిగినట్లు వారు చెప్పారు. శనివారం బట్టల వ్యాపారం జరుగుతుండగా జేసీబీతో వెళ్లి గుంతను తవ్వారు. దీంతో యజమాని పన్ను చెల్లించాడని సమాచారం. అనంతరం ఆదివారం సదరు గుంతను పూడ్చేశారు.
short by
Bikshapathi Macherla /
10:31 pm on
30 Mar