For the best experience use Mini app app on your smartphone
ఆసియా కప్ 2025 ట్రోఫీ ఒకటి, 2 రోజుల్లో ముంబైలోని BCCI కార్యాలయానికి చేరుకుంటుందని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. ఫైనల్‌లో గెలిచి నెలరోజులు గడిచినా ట్రోఫీని అందజేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైనల్‌ మ్యాచ్ తర్వాత పీసీబీ చీఫ్‌, పాక్ మంత్రి అయిన ఏసీసీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు భారత్ నిరాకరించింది. దీంతో నఖ్వీ ట్రోఫీ, మెడల్స్‌ను తనతో పాటు తీసుకెళ్లాడు.
short by Devender Dapa / 09:21 pm on 31 Oct
For the best experience use inshorts app on your smartphone