For the best experience use Mini app app on your smartphone
మిర్యాలగూడలో ప్రణయ్‌ను చంపిన కేసులో కోర్టు ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ కోర్టు వెలువరించిన తీర్పుపై మృతుడి భార్య అమృత తొలిసారి స్పందించారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తమకు న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పుతోనైనా పరువు పేరిట జరిగే దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. తన బిడ్డ భవిష్యత్‌, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే బయటకు రావడం లేదన్నారు.
short by Devender Dapa / 10:48 pm on 11 Mar
For the best experience use inshorts app on your smartphone