జూన్ 1 నుంచి ప్రతి నెలా 1-15వ తేదీ వరకు చౌక ధరల దుకాణాలు అందుబాటులో ఉంటాయని, ఉదయం 8- మ.12 గంటల వరకు, సాయంత్రం 4-8 గంటల వరకు అవి పని చేస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నెలలో 1-2 రోజులే రేషన్ ఇచ్చి, మిగిలిన సరుకులను అక్రమంగా తరలించారని ఆయన చెప్పారు. వీటిని అరికట్టేందుకు ఇకపై ప్రతీ పేద కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరకులు అందిస్తామని పేర్కొన్నారు.
short by
srikrishna /
05:35 pm on
31 May