ఇటీవల నకిలీ బాంబు బెదిరింపుల కారణంగా భారతీయ విమానయాన సంస్థలు ఇప్పటివరకు రూ.500 కోట్లు నష్టపోయాయని NDTV ప్రాఫిట్ నివేదించింది. విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు, వాటిని సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. అపుడు విమానయాన సంస్థలు ఇంధనం, ప్రయాణీకుల భోజనం, వసతి కోసం అదనపు ఖర్చులు, పార్కింగ్ ఛార్జీలు, సిబ్బంది ఓవర్టైమ్ చెల్లింపులు భరిస్తాయి.
short by
Devender Dapa /
10:14 pm on
22 Oct