For the best experience use Mini app app on your smartphone
జమ్మూకశ్మీర్‌ కుప్వారాలోని మచిల్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మేజర్ ర్యాంక్ అధికారితో సహా ఐదుగురు భారత సైనికులు గాయపడ్డారని రక్షణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. గాయపడిన సైనికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. అనుమానిత ఉగ్రవాదుల కదలికలను బలగాలు గుర్తించి, ప్రశ్నించే లోపు వారు కాల్పులు జరిపారని సమాచారం. ఇంతకుముందు ఉగ్రవాదుల కాల్పుల కారణంగా ముగ్గురు సైనికులు గాయపడ్డారు.
short by Srinu / 12:06 pm on 27 Jul
For the best experience use inshorts app on your smartphone