For the best experience use Mini app app on your smartphone
భూములకు ఉద్యోగాల కుంభకోణంలో తనపై ట్రయల్‌ కోర్టు విచారణను నిలిపివేయాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేసిన విజ్ఞప్తిని దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో తన పాత్రపై దర్యాప్తు చేసేందుకు సీబీఐకి ముందస్తు అనుమతి అవసరమని లాలూ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ట్రయల్ కోర్టులో విచారణ జూన్ 2న ప్రారంభం కానుంది.
short by / 05:54 pm on 31 May
For the best experience use inshorts app on your smartphone