ఈనెల 27న మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు ఆయా జిల్లాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగమైన కొల్లూరు, ఆర్సీ పురం ఠాణాల పరిధిలోనూ ఈ బంద్ కొనసాగుతుందని సైబరాబాద్ CP అవినాష్ మహంతి తెలిపారు.
short by
Srinu Muntha /
12:38 pm on
23 Feb