ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని 31 మండలాల్లో సోమవారం తీవ్ర వడగాలులు, మరో 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం నంద్యాల జిల్లా అవుకులో 42.6°C, వెంకటగిరి (తిరుపతి), నగరి (చిత్తూరు)లో 42.5 °C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. రాగల 3 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని తెలిపింది.
short by
Srinu /
07:20 am on
21 Apr