For the best experience use Mini app app on your smartphone
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌ 1 నాటికి జాబితా రూపొందించేలా షెడ్యూల్‌ విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు సెప్టెంబర్‌ 30న ఓటర్ల జాబితాకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.
short by Bikshapathi Macherla / 12:05 am on 27 Jul
For the best experience use inshorts app on your smartphone