కర్ణాటకలోని బెళగావిలో 15 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల ప్రకారం, గతేడాది డిసెంబర్లో ఆమె ప్రియుడు బాలికను కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతడితో పాటు మరో ఐదుగురు అత్యాచారానికి ఒడిగట్టి, ఈ దుశ్చర్యను ఫోన్లో రికార్డు చేశారు. ఆ వీడియోతో బెదిరించి మరోసారి దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
short by
Devender Dapa /
10:49 pm on
01 Jun