కర్నూలు పార్లమెంట్తో పాటు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ నెల 18 నుంచి జరిగిన ఈ ప్రక్రియలో 196 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు దాఖలు చేశారు. కర్నూలు అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 46 మంది, మంత్రాలయం నియోజకవర్గానికి అత్యల్పంగా 13 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. శుక్రవారం నుంచి నామపత్రాల స్క్రూటినీ ప్రక్రియ ప్రారంభమవుతోందని కలెక్టర్ సృజన తెలిపారు.
short by
M Srinu /
10:23 pm on
25 Apr