For the best experience use Mini app app on your smartphone
కుళాయిలకు సరిపడా నీరందక హొళగుంద వాసులు ఎడ్ల బండి, బైక్‌ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో కడ్లెమాగి ఎస్‌ఎస్‌ ట్యాంకుకు నీరందడం లేదని, దీంతో బీసీ కాలనీ, కోటవీధి తదితర కాలనీలకు వారానికి ఒకసారి మాత్రమే నీళ్లొస్తున్నాయని ‘ఈనాడు’ కథనం తెలిపింది. దీంతో వారికి ఎంపీడీవో కార్యాలయం వద్ద గల సంపు నీరే ఆధారమయ్యాయని ఆ కథనం పేర్కొంది.
short by M Srinu / 12:32 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone