For the best experience use Mini app app on your smartphone
గుండె సంబంధిత సమస్యలతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖడ్‌ బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉపాధ్యక్షుడు వైద్య చికిత్సకు బాగా స్పందించారని, సంతృప్తికర స్థాయిలో కోలుకున్నట్లు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. రాబోయే కొన్ని రోజులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని ధన్‌ఖఢ్‌కు సూచించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
short by / 02:39 pm on 12 Mar
For the best experience use inshorts app on your smartphone