ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మరణించారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల వేళ ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదం ధాటికి ప్యాసింజర్ రైలులోని ఓ బోగీ గూడ్స్ రైలుపైకి ఎక్కింది.
short by
srikrishna /
06:09 pm on
04 Nov