కర్నూలు జిల్లాలో మలేరియా కేసులు క్రమేణా తగ్గుతున్నాయని డీఎంహెచ్వో ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1,32,943 మంది శాంపిల్స్ను సేకరించి మలేరియా పరీక్షలు చేయగా, అందులో దేవనకొండ మండలం కోటకొండలోని ఓ వ్యక్తికి మాత్రమే వ్యాధి నిర్దారణ అయిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే-డ్రైడే’ నిర్వహిస్తున్నామని జిల్లా మలేరియా నివారణ అధికారి నూకరాజు చెప్పారు.
short by
M Srinu /
02:27 pm on
25 Apr