చరిత్రలో తొలిసారిగా ఆదివారం ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో గాలిలోకి 10-15 కి.మీ ఎత్తులోకి పొగ చేరింది. అగ్నిపర్వతం బద్దలు కావడంతో విడుదలైన బూడిద.. ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్ వైపు దూసుకెళ్తోందని నివేదికలు తెలిపాయి. మంగళవారం నాటికి ఈ బూడిద దిల్లీ, జైపూర్లను తాకే అవకాశం ఉందని Flightradar24 అంచనా వేసింది. ఇదే జరిగితే దిల్లీలో కాలుష్య తీవ్రత మరింత పెరగొచ్చు.
short by
Devender Dapa /
07:22 pm on
24 Nov