For the best experience use Mini app app on your smartphone
జూలై 1 నుంచి ప్రయాణికుల ఛార్జీలు పెంచుతున్నట్లు భారత రైల్వే సోమవారం ప్రకటించింది. జూలై 1 లేదా ఆ తర్వాత బుక్ చేసుకున్న టిక్కెట్లపై ఈ ఛార్జీల పెంపు వర్తిస్తుందని తెలిపింది. జూన్ 30 వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై ఎలాంటి అదనపు చెల్లింపు చేయనవసరం లేదని పేర్కొంది. నాన్‌ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల ఛార్జీలను పెంచుతూ రైల్వే ఆదివారం సర్క్యూలర్‌ జారీ చేసింది.
short by / 10:32 am on 01 Jul
For the best experience use inshorts app on your smartphone