For the best experience use Mini app app on your smartphone
హైదరాబాద్‌ గాంధీభవన్‌లో శుక్రవారం జరిగిన టీపీసీసీ సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ పొరపాటున జై జగన్‌ అని నినదాలు చేశారు. మొదట రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఛైర్మన్‌ బెల్లయ్య నాయక్‌ తన ప్రసంగం ముగిసిన అనంతరం జై జగన్ అని నినదించారు. అనంతరం తన ప్రసంగం చివరలో "జై హింద్‌, జై భారత్‌, జై జగన్‌" అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
short by Bikshapathi Macherla / 09:01 pm on 28 Feb
For the best experience use inshorts app on your smartphone