For the best experience use Mini app app on your smartphone
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 25% సుంకం, పెనాల్టీ విధించడంపై భారత్ స్పందించింది. ట్రంప్‌ ప్రకటించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేదానిపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది.
short by / 09:26 pm on 30 Jul
For the best experience use inshorts app on your smartphone