For the best experience use Mini app app on your smartphone
త్రిపురలోని పశ్చిమ జిల్లాలో బైక్‌పై వెళ్తుండగా ఓ మహిళ తన భర్తపై యాసిడ్‌ పోసిందని పోలీసులు తెలిపారు. "దంపతులు బైక్‌పై వెళ్తుండగా ఇది జరిగింది. ఏం జరిగిందో తెలియక అతడు సహాయం కోసం కేకలు వేశాడు. అయితే ఇదే సమయంలో అతడి భార్య మరోసారి యాసిడ్ పోసేందుకు ప్రయత్నించింది. కానీ స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుకున్నారు" అని చెప్పారు. ముఖం, మెడపై గాయాలు కావడంతో సదరు వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు.
short by / 10:43 pm on 21 Aug
For the best experience use inshorts app on your smartphone