For the best experience use Mini app app on your smartphone
తిరుమలలోని పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునికీకరణకు ప్రవాస భారతీయుడైన రామలింగరాజు మంతెన బుధవారం రూ.9 కోట్లు విరాళం అందజేశారు. తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజు పేరిట దీన్ని ఇచ్చారు. 2013లోనూ ఆయన టీటీడీకి రూ.16 కోట్లు విరాళం అందించారు. 2017లోనూ శ్రీవారికి రూ.8 కోట్ల విలువైన బంగారు సహస్ర నామ కాసుల హారాన్ని బహుకరించారు. ఈ నెల 23న నేత్ర, ఎన్నారై వంశీ వివాహం ఉదయ్‌పుర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
short by srikrishna / 03:59 pm on 26 Nov
For the best experience use inshorts app on your smartphone