తిరుమలలో డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తామని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని చెప్పారు. మొదటి 3 రోజులు శ్రీవాణి, రూ.300ల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 2-8 వరకు రోజుకు 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తామన్నారు.
short by
srikrishna /
03:46 pm on
18 Nov