For the best experience use Mini app app on your smartphone
తిరుమలలో ఇకపై ఏరోజుకు ఆరోజు శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆగస్టు 1-15 వరకు దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఉదయం ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్‌ పొందిన భక్తులు, అదే రోజు సా4.30కి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నవంబర్‌ 1 నుంచి టీటీడీ దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. ప్రస్తుతం శ్రీవాణి టికెట్‌పై దర్శనానికి 3 రోజులు పడుతోంది.
short by Devender Dapa / 09:21 pm on 30 Jul
For the best experience use inshorts app on your smartphone