For the best experience use Mini app app on your smartphone
తెలంగాణలోని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు సోమవారం నుంచి బంద్‌ పాటించనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు తక్షణం విడుదల చేయాలంటూ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఈ నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సమాఖ్య ప్రతినిధులతో ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపింది. చర్చలు సానుకూలంగా జరిగాయని, యాజమాన్యాల సమస్యలపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
short by / 08:03 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone